breaking news
sri krishnastmi
-
ఘనంగా జన్మాష్టమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మాష్టమి సందర్బంగా ‘దహీ హండీ’ (ఉట్టికొట్టే ఉత్సవం) వేడుకలకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. #WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు గుర్తుగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. దహి హండీ మహోత్సవంలో పాల్గొనేందుకు స్పానిష్ క్యాస్టెల్లర్ల బృందం ఇప్పటికే మహారాష్ట్ర చేరుకుంది.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025మరోవైపు గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఇస్కాన్ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుడిని, రాధాదేవిని దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. మధురలోని శ్రీ కృష్ణుని ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025ప్రధాని మోదీ ‘ఎక్స్’లో దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘నమ్మకం, ఆనందం, ఉత్సాహం నడుమ జరిగే ఈ ఉత్సవం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను.. జై శ్రీ కృష్ణ’అని రాశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.सभी देशवासियों को जन्माष्टमी की असीम शुभकामनाएं। आस्था, आनंद और उमंग का यह पावन-पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय श्रीकृष्ण!— Narendra Modi (@narendramodi) August 16, 2025 -
నేడు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
బళ్లారి టౌన్, న్యూస్లైన్ : బెంగళూరుకు చెందిన శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్లోని వాసవి కమిటీ వట్టం సమితి హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నేత హరికృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ సారి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు శ్రీకృష్ణుని దర్శనం, 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక పాఠశాల విభాగం విద్యార్థులకు శ్రీకృష్ణుడు, గోపికల వస్త్ర ప్రదర్శన, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక పోటీలు, అనంతరం 8.30 గంటల వరకు అభిషేకం, 9 గంటలకు ఊయల సేవ, అనంతరం ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, జేడీఎస్ యువనేత భరత్రెడ్డి, వివిధ కార్పొరేటర్లు ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో జువెలరీ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సోని, వట్టం జగదీష్, శివప్ప, ప్రభు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.