-
నకోజరి హీరో
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన, వేల మైళ్ల దూరంలోని ఇద్దరు అన్న మాటలివి !‘ఈ రోజు మనం చేసే మంచి పనే రేపటి మన ఆనందంగా మారుతుంది’ - సోక్రటీస్ ‘ప్రపంచంలోని చెడ్డ వాళ్ల కన్నా మంచివాళ్లు తమ మంచితనాన్ని ఉపయోగించకపోవడం వల్లే ప్రజల్లో అధిక శాతం మంది దుఃఖానికి గురవుతున్నారు’ - చాణుక్యుడు 21వ శతాబ్దంలో దలైలామా ఓ సందర్భంలో ఇలా అన్నారు... ‘ఆలయాలకి వెళ్లాల్సిన పని లేదు. క్లిష్టమైన వేదాంత సారం చదవాల్సిన పని లేదు. మన హృదయమే, మన మెదడే మన ఆలయం. ఆ వేదాంతం కరుణ’. అందుకు మనిషి హృదయంలో ఓ చదరపు అంగుళం దయ ఉన్నా చాలు. అలాంటి దయ గల కొందరిని కలుసుకోండి. ఇది మీలో మంచిని ప్రేరేపించవచ్చు. నవంబర్ 7, 1907లో మెక్సికోలోని నకోజరి గ్రామంలో డైనమేట్లని రవాణా చేసే ఓ రైలు పెట్టె అంటుకుంది. ఇది గమనించిన ఇంజిన్ డ్రైవర్ జెసుస్ గార్షియా... వెంటనే రైలు ఇంజిన్ని స్టార్ట్ చేసి గ్రామానికి పది మైళ్ల దూరం తీసుకెళ్లాక డైనమేట్ అంటుకుని పేలింది. ఆ చప్పుడు ఆ గ్రామంలోని వారందరికీ వినిపించింది. అతను రైలుని వెంటనే తీసుకెళ్లి ఉండకపోతే నకోజరి గ్రామం మొత్తం ఆ పేలుడికి నాశనమైపోయేది. గ్రామాన్ని రక్షించిన గార్షియా శరీరం పేలుడి ధాటికి ఛిన్నాభిన్నమైపోయింది. అతని త్యాగానికి కృతజ్ఞతగా ఆ గ్రామానికి నకోజరి డి గార్షియా అనే పేరు పెట్టుకున్నారు. అంతేకాక మెక్సికోలోని చాలా వీధులకి అతని పేరు పెట్టారు. గార్షియా గౌరవార్థం ఏటా నవంబర్ 7న రైల్వే దినోత్సవంగా జరుపుతున్నారు. అతని త్యాగాన్ని వర్ణిస్తూ అనేక పాటలు, నాటకాలు, పద్యాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ -
సోక్రటీస్తో సమానుడు అంబేద్కర్
కనిగిరి : సోక్రటీస్, అరిస్టాటిల్ తో సమానుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. అని దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. రాజధానిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుస్తకంతో దేశాన్ని జయంచిన అపర మేధావి అంబేద్కర్ అని పద్మారావు కొనియాడారు. రాజధాని కేంద్రంలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో దళిత, బహుజనులు, ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దళిత నాయకులు ఆత్మకూరి చెన్నయ్య, కటికల రత్నం, జి.రవికుమార్ మాదిగ, ప్రొఫెసర్ కేవీఎన్ రాజు మాట్లాడారు. తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ వ్యక్తిత్వ దర్శనం, బహుజన దర్శనం పుస్తకాలను పద్మారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు రామ్మోహన్, పెరుగు శ్రీధర్, దద్దాల శ్రీనివాసులుయాదవ్, టీఐ ప్రతాప్, కేవీ రత్నం, చింతల పూడి వెంకటేశ్వర్లు, బాల గురవయ్య, దేపూరి వెంకటేశ్వర్లు, శివకాశయ్య పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement