-
స్కిప్పర్ హైజంప్- మోర్పెన్ వీక్
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-520) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు విద్యుత్ రంగ టవర్ల తయారీ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ కౌంటర్కు డిమాండ్ను పెంచాయి. అయితే మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు వెల్లడించిన హెల్త్కేర్ కంపెనీ మోర్పెన్ ల్యాబొరేటరీస్ కౌంటర్ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వివరాలు చూద్దాం.. స్కిప్పర్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో విద్యుత్ టవర్లు, పీవీసీ పైపుల తయారీ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 58 శాతంపైగా జంప్చేసి రూ. 28 కోట్లను అధిగమించింది. అమ్మకాలు మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 439 కోట్లకు చేరాయి. పూర్తిఏడాదికి(2019-20)నికర లాభం 32 శాతం ఎగసి రూ. 41 కోట్లను తాకింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి 10 శాతం డివిడెండ్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కిప్పర్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 47 వద్ద ఫ్రీజయ్యింది. మోర్పెన్ ల్యాబ్ ఫార్మా రంగ కంపెనీ మోర్పెన్ ల్యాబ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 11 కోట్లను అధిగమించింది. అమ్మకాలు మాత్రం 5.5 శాతం క్షీణించి రూ. 207 కోట్లకు చేరాయి. పన్నుకు ముందు లాభం 6 శాతం బలపడి రూ. 11.4 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభం 9 శాతం నీరసించి రూ. 21 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మోర్పెన్ ల్యాబ్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం ఎగసి రూ. 31.4ను తాకింది. తదుపరి అమ్మేవాళ్లు అధికమై 4 శాతం పతనమైంది. ప్రస్తుతం రూ. 29 దిగువన ట్రేడవుతోంది. -
హైదరాబాద్ వద్ద స్కిప్పర్ పీవీసీ పైపుల ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీవీసీ పైపుల తయారీలో ఉన్న స్కిప్పర్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లా బొల్లారం వద్ద రానున్న ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం 6,000 మిలియన్ టన్నులు. జూన్ నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుందని కంపెనీ వెల్లడించింది. థర్డ్ పార్టీకి చెందిన స్థలంలో దీనిని నెలకొల్పినట్టు స్కిప్పర్ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఉన్న కోల్కత్తాకు చెందిన స్కిప్పర్కు దేశవ్యాప్తంగా ఇప్పటికే పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్ తయారీకి నాలుగు ప్లాంట్లున్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాదికే పరిమితమయ్యాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement