breaking news
Shweta Mahanthi
-
హైదరాబాద్ కలెక్టర్గా ఎల్ శర్మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా శ్వేతా మహంతి స్థానంలో ఎల్ శర్మన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శ్వేతా మహంతి అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విధుల నుంచి రిలీవ్ అయ్యేందుకు అనుమతిస్తూ.. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా ఉన్న 2005 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శర్మన్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. కాగా గురువారం హెదరాబాద్ జిల్లా కలెక్టర్గా ఎల్. శర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి కలెక్టర్ శ్వేతా మహంతి విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రిలీవ్ కావడంతో నాగర్కర్నూల్ కలెక్టర్ శర్మన్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కొత్త కలెక్టర్కు స్వాగతం పలికారు. అదే విధంగా... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా కూడా ఉన్న శ్వేతా మహంతిని ఆ బాధ్యతల నుంచి కూడా రిలీవ్ చేశారు. మెదక్ కలెక్టర్ ఎస్ హరీశ్కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్వేతా మహంతి గురువారం విదేశాలకు ప్రయాణం కానున్నారు. చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు -
ఇష్టం లేకపోతే ఇంటికెళ్లండి
♦ రికార్డులు ఇష్టమొచ్చినట్లు రాస్తారా? ♦ ‘భూప్రక్షాళన’ తీరుపై కలెక్టర్ అసహనం ♦ మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాలని ♦ అధికారులకు ఆదేశాలు జారీ ఖిల్లాఘనపురం : రెవెన్యూ రికార్డులను ఇష్టమొచ్చినట్లు రాస్తే ఎలాగని రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లండి..’అంటూ అసహనం వ్యక్తంచేశారు. సమస్యలు ఉన్న సర్వే నంబర్ల వివరాలు, సమస్యలను గుర్తించి ప్రత్యేకంగా ఓ రికార్డులో పొందుపర్చమని చెప్పామని, ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గురువారం ఆమె మండలం ఉప్పరిపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను ప్రత్యేకంగా పరిశీలించారు. గ్రామాల్లో ఆరురోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, రికార్డులను తీసుకుని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆమె కార్యాలయంలో ఉన్న ఆర్ఓఆర్, కాస్రాపహాణి, ఓల్డ్ ఆర్ఓఆర్, చెసాల, చేత్వార్లో ఉన్న భూములకు అధికారులు ప్రత్యేకంగా రాసిన రికార్డుల్లోని భూముల మధ్య వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రికార్డును మరోసారి పరిశీలించాలని డిప్యూటీ తహసీల్దార్ సునితను కోరారు. అనంతరం అప్పారెడ్డిపల్లికి వెళ్లిన కలెక్టర్ రికార్డుల నమోదు ప్రక్రియను చూసి అసహనం వ్యక్తంచేశారు. మరుగదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయండి ఉప్పరిపల్లిలో మరుగుదొడ్లను నిర్మించుకున్నప్పటికీ బిల్లులు రాలేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఎంపీడీఓ రెడ్డయ్య, ఏపీఓ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ మహిమూద్ను పిలిచి విచారించారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోవడంతోనే బిల్లులు ఆలస్యమైనట్లు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ను కలెక్టర్ హెచ్చరించారు. బతుకమ్మ చీరలు పంపిణీ మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గురువారం కలెక్టర్ శ్వేతామహంతి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, సర్పంచ్ నర్సింహారెడ్డి, శ్రీనువాసులు, శంకర్గౌడ్, శ్రీనువాసాచారి, కృష్ణయ్య, విష్ణు పాల్గొన్నారు.