breaking news
Sharan Kumar
-
‘సాక్షి’ మూవీ రివ్యూ
టైటిల్: సాక్షి నటీనటులు: శరణ్ కుమార్, జాన్వీర్ కౌర్, నాగబాబు, ఆమని, ఇంద్రజ తదితరులు నిర్మాత: మునగాల సుధాకర్ రెడ్డి దర్శకత్వం : శివ కేశన కుర్తి సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఎడిటర్ : సెల్వ కుమార్ విడుదల తేది: జులై 29, 2023 ఇప్పటికే సూపర్స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. సీనియర్ నరేష్ బావ కుమారుడు శరణ్ కుమార్ కూడా గతంలో హీరోగా మిస్టర్ కింగ్ అనే ఒక సినిమా చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా రిలీజ్ అయిన సాక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శరణ్ కుమార్. శివ కేశన కుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి నిర్మించారు. నాగబాబు, ఆమని, ఇంద్రజ, దేవీ ప్రసాద్ వంటి సీనియర్ నటులు నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సాక్షి కథేంటంటే.. అర్జున్(శరణ్ కుమార్) ఒకపక్క సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూనే పత్రిక నడిపే తన తండ్రి (దేవీ ప్రసాద్)కి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఆఫీసులో మేనేజర్ నుంచి ఎదురైన ఒక అనూహ్యమైన ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో పరిచయమైన రిపోర్టర్ నేత్ర (జాన్వీర్ కౌర్)తో ప్రేమలో పడతాడు. అంతా బాగానే ఉంటుందనుకున్న సమయంలో తండ్రి రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆయనకు ఆపరేషన్ చేయాలంటే 20 లక్షలు కావాలి అనడంతో తెలియకుండానే ఒక స్మగ్లింగ్ ఊబిలో కూరుకుపోతాడు. ముందుగా స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మర్డర్ కేసులు కూడా మీద పడతాయి. ఆ స్మగ్లింగ్ నుంచి మర్డర్ కేసుల నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? హాస్పిటల్ లో ఉన్న తండ్రిని కాపాడుకున్నాడా? చివరికి నేత్ర, అర్జున్ ఒకటయ్యారా ? అనేది సినిమా కథ. ఎలా ఉందంటే? సాక్షి అనే పేరుతోనే ఆసక్తి రేకెత్తించిన సినిమాను ఏదో కొత్త కథతో తెరకెక్కించలేదు. రొటీన్ గా మనం చూసే సినిమా లాగానే ఉంటుంది కానీ ఎవరు టచ్ చేయని సబ్జెక్టులను టచ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్లతోని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సినిమా యూనిట్. డబ్బు కోసం దేనికైనా దిగజారిపోతున్న రాజకీయ నాయకుల నుంచి నిజాయితీగా పోరాడే తన తండ్రి లాంటి జర్నలిస్టుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు ఎలా కాపాడుకున్నాడు అనే విషయాన్ని ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించారు. అప్పటివరకు సుకుమారంగా అన్నింటికీ దూరంగా పెరిగిన ఒక వ్యక్తి తన తండ్రి ప్రాణాల మీదకు వస్తే తెగించి ఎంతవరకు పోరాడాడు అనే విషయాన్ని సినిమాలో కరెక్ట్ గా క్యాప్చర్ చేశారు. కథ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించి కొంత వరకు సఫలం అయ్యాడు. సీనియర్ నటీనటులు ఈ సినిమాకి అదనపు బలంగా మారారు. హీరో, హీరోయిన్లు స్క్రీన్ కి కొత్తయినా తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ శివ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కమర్షియల్ ఎలిమెంట్లతో ఒక మెసేజ్ ఇచ్చేలా చెప్పేందుకు ప్రయత్నించి కొంతవరకు సఫలం అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అసలు అర్జున్ స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాన్ని చూపించగా సెకండ్ హాఫ్ అంతా ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేయడానికి ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ తర్వాత సినిమా కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. వరుస ట్విస్టులతో సినిమా మీద ఆసక్తి పెంచేశాడు డైరెక్టర్. ఎవరెలా చేశారంటే? నటీనటుల విషయానికి వస్తే శరన్ మొదటి సినిమా కంటే ఈ సినిమాలో నటన విషయంలో మెరుగయ్యాడు. జాన్వీర్ కౌర్ కి కూడా నటనకు స్కోప్ ఉన్న రోల్ దక్కింది.. విలన్ గా నాగబాబు ఒక రేంజ్ లో నటించాడు. తన అనుభవం అంత స్క్రీన్ మీద కనిపించింది. ఇంద్రజ, ఆమని, దేవి ప్రసాద్ వంటి వారి పాత్రలకు కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. వారు కూడా తమ అనుభవం స్క్రీన్ మీద పండించారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. భీమ్స్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. అయితే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగినట్టు ఉన్నాయి. -
విజయనిర్మల ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న శరణ్
శరణ్కుమార్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సాక్షి’. జాన్వీర్ కౌర్ హీరోయిన్. శివకేశన కుర్తి దర్శకత్వంలో ఆర్యూ రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో మునగాల సుధాకర్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– 'విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, శరణ్తోపాటు చిత్ర యూనిట్కి మంచి పేరు రావాలి' అన్నారు. 'సాక్షి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది' అన్నారు శరణ్. 'యూనిట్ సభ్యులందరూ బాగా సహకరించారు' అన్నారు శివ. 'ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేయాలి' అన్నారు సుధాకర్రెడ్డి, ఆర్యూ రెడ్డి. -
ఆకట్టుకుంటున్న ‘సాక్షి’ టీజర్
సూపర్స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో శరణ్ కుమార్ నటిస్తున్న సినిమా సాక్షి . శివ కేశన కుర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రముఖ ఇన్ఫ్లూఎన్సర్స్ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. ఒక నిమిషం 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చూపించారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త హీరో శరణ్ కుమార్ ఫైట్ సీన్స్ ఇరగ దీశారని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. చిత్రంలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని ఇలా భారీ క్యాస్టింగ్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.