breaking news
seven hours continuous power
-
మాకు చావే శరణ్యం
దోమకొండ : ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించాలని, లేకుంటే పంటలు ఎండితే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములకు నిరంతరంగా ఏడు గంటలపాటు విద్యుత్ అందించాలని కోరుతూ మండలంలోని మందాపూర్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం సబ్స్టేషన్ను ముట్టడించారు. విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. వర్షాలు లేక పంటలు వేయలేదని బోర్ల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్ను అందించాలని కోరారు. అనంతరం రైతులు లైన్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య, లైన్మెన్లు సుధాకర్, దేవరాజ్, ఆపరేటర్ సురేష్లను గదిలో నిర్బంధించారు. ఏఈ రావాలని నినాదాలు చేశారు. సబ్స్టేషన్ ఎదుట గంటపాటు ధ ర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు గంగరాములు,రాజిరెడ్డి, నాగిరెడ్డి, సంజీవ్రెడ్డి, దేవేందర్, నాగరాజ్గౌడ్, ఉపసర్పంచ్ బాగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు యాచం నరేందర్, కాంగ్రెస్ నాయకులు నాగరాజ్గౌడ్, రాజనర్సు తదితరులు ఉన్నారు. విద్యుత్ సక్రమంగా సరాఫరా చేయండి వర్ని : మండలంలోని రుద్రూర్ సబ్స్టేషన్ పరిధిలోని లింగంపల్లి శివారుకు సక్రమంగా విద్యుత్ను సరఫరా చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు సోమవారం ఆందోళన చేశారు. సబ్స్టేషన్ను ముట్టడించి సిబ్బందిని నిలదీశారు. విద్యుత్ను నమ్ముకుని బోర్ల ద్వారా నాట్లు వేశామని విద్యుత్ కోతల వల్ల పంట ఎండి పోయే దశకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఐదు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. దీనిపై సిబ్బంది చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని రైతులు వారిని గదిలో నిర్బం ధించారు. ఏఈ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న ఏఈ నర్సింలు, అసిస్టెంట్ ఏఈ గోపికృష్ణ సబ్స్టేషన్కు రాగానే వారిని రైతులు నిలదీశారు. శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు కేవలం మూడు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చారని మండి పడ్డారు. రోజుకు ఏడు గంటలు ఇస్తామని ప్రక టించి మూడు గంటలు సరఫరా చేయడమేంటని ప్రశ్నిం చారు. రాత్రి వేళ విద్యుత్ రావడం లేదని ఆరోపిం చారు. ఫీడర్లను మార్పు చేయడం వల్ల కొంతమేర సరఫరాలో అంతరాయం జరిగిందని, సక్రమంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చూస్తానని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆందోళనలో రైతులు పోశెట్టి, బాగయ్య, గంగాధర్, బాలు, పర్వయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
కోతలపై కన్నెర్ర
దుబ్బాక, న్యూస్లైన్: అస్తవ్యస్తంగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో అన్నదాతలు కన్నెర్ర చేశారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతర విద్యుత్ను సరఫరా చేయాలని సోమవారం ఉదయం మండలంలోని పెద్దగుండవెళ్లిలో రోడ్డెక్కారు. సరాఫరా చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని పలువురు రైతులు పురుగు మందు డబ్బాలను పట్టుకుని స్థానిక 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఎదుట బైఠాయించారు. సూమారు 3 గంటలకు పైగా సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్కో ఏడీ జయరాములు సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడినుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏడీకి పలువురు రైతులు విద్యుత్ కోతలతో నెలకొన్న సమస్యలను విన్నవించారు. ఎక్కడలేని విధంగా తమ గ్రామంలోనే కోతలు విధిస్తున్నారని వారు ఆరోపించారు. వ్యవసాయానికి కేవలం నాలుగు, ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, అదికూడా వేళపాళా లేకుండా సరఫరా చేస్తున్నారని తెలిపారు. కోతల వల్ల పంటలు ఎండుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఏఈ, లైన్మన్ నిర్లక్ష్యం వల్లే సమస్య నెలకొందని వారు ఆరోపించారు. వారిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బిల్లుల సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ సరైన విద్యుత్తు సరఫరా చేయడం లేదంటూ అధికారితో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై ఏడీ జయరాములు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందన్నారు. ప్రస్తుతం కరెంట్ ఉత్పత్తులు పడిపోవటంతో ఈ సమస్య నెలకొందన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు వేణు, సత్యం, శ్రీనివాస్, రాజయ్య తదితరులున్నారు. సబ్స్టేషన్ వద్దకు దుబ్బాక ఏఎస్ఐ కొమురయ్య, సిబ్బంది అక్కడికి వచ్చి రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.