breaking news
sevasangh
-
సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి
జైపూర్: సమాజంలో పేరు రావాలనే ఉద్దేశంతోకాకుండా ఎలాంటివి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయండని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. రాజస్తాన్లోని జామ్దోలీలో జరుగుతున్న సేవా సంఘ్లో ‘రాష్ట్రీయ సేవా భారతి’ ప్రతినిధులు, సంఘ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవత్ ఉపన్యసించారు. ‘ వ్యవస్థీకృతమైన శక్తులు ఎల్లప్పుడూ ఘన విజయాలను సొంతం చేసుకుంటాయి. విశ్వమానవాళి శ్రేయస్సు కోసం నిశ్శబ్దంగా సేవచేసే కార్యకర్తలం మనం. నిస్వార్థ సేవ అలవాటు చేసుకోండి. మనల్ని ఇంకెవరో పొగడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలపైకి దృష్టిని పోనివ్వకండి. సామాజిక సేవ చేస్తే పేరు అదే వస్తుంది. అంతమాత్రానికే దానిపై ధ్యాస పెట్టొద్దు. అహం మీకు అవరోధంగా మారొద్దు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటపుడు హుందాగా ఉండాలి. మనమేం గొప్ప పని చేయడంలేదు. సమాజం కోసం మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. -
బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులపై ప్రచారం
సింహాచలం : బ్రాహ్మణ కార్పరేషన్ నిధులను బ్రాహ్మణులు ఏవిధంగా వినియోగించుకోవాలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో తెలియజేసే కార్యక్రమం ని నిర్వహిస్తున్నామని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు జ్వాలాపురపు శ్రీకాంత్ తెలిపారు. సింహాచలంలోని ఓ కల్యాణమండపంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణులకు విద్యాభారతి, చాణుక్య, గరుడ, వశిష్ట అనే పథకాలు అమలులో ఉన్నాయని, వీటికి అర్హులైనవారు ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఖర్చూ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇక, ఇటీవల దేవాలయాల్లో అర్చకులకు, పురోహితులకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం, ఇడ్లీ, దోశ అమ్మినట్టు కష్ణా పుష్కరాల్లో బ్రాహ్మణ సేవలకు ధరలు నిర్ణయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కాపు, ఖమ్మ, వెలమ, క్షత్రియ కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తమ సంఘం పోరాటం చేయనుందని తెలిపారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యదర్శి ఎమ్ఎల్ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం నుంచి జరిగే గోదావరి అంత్య పుష్కరాల్లో సేవలకొచ్చే బ్రాహ్మణులకు అసౌకర్యం కలగకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. కష్ణా పుష్కరాల్లో పాల్గొనే బ్రాహ్మణుల కోసం టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు జిల్లాల పురోహితులకు మాత్రమే కష్ణాపుష్కరాల్లో విధులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని, రాష్ట్రంలో ఉన్న పురోహితులందరికీ ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రిని, కమిషనర్ను కోరామన్నారు. బ్రాహ్మణ భవనం నిర్మాణానికి విశాఖలో 22 సెంట్ల స్థలం ఇచ్చారని, సెప్టెంబరు నెలాఖరులో బ్రాహ్మణ భేరి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు కనీసం పది సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సుసర్ల ఉదయ్కుమార్, ప్రతినిధులు హరి, రాపత్తి కన్నా, కె. సుబ్రహ్మణ్యం, జెఎస్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.