breaking news
Settled
-
ఇదో పెద్దకుటుంబం, ఏ ఆపద వచ్చినా..మేలిసంధ్య!
రిటైర్డ్ ఉద్యోగులు తమ మలివయసు జీవనం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో నలుగురిలో కలవలేకపోవడం, ఆనందకరమైన జీవనం గడపలేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివి గుర్తించి హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్ర ప్రదేశ్ విశ్రాంత ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడ్డారు.వెయ్యికి పైగా ఉన్న ఈ సభ్యులు తమకు ఆత్మీయులు ఉన్నారనే భరోసాతో ఆనందాలను కలబోసుకుంటూ, ఆరోగ్యాల గురించి సమీక్షించుకుంటూమలివయసును ఉపయుక్తంగా మలుచు కుంటున్నారు. ఈ సంఘ సభ్యులను కలిసినప్పుడు అంతా ఒక జట్టుగా ఉంటే ఏ వయసు అయినా ఉల్లాసంగా గడిచిపోతుందనే ఆలోచనను పంచుకున్నారు.‘అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్’ సంఘం హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంది. ఈ ఏడాది నాల్గవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ నాలుగేళ్లలో వెయ్యికి పైగా ఉన్న సభ్యులను ఒక తాటి మీదకు తీసుకువచ్చి, తమ సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, వారి పెన్షన్లో నుంచి కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఉల్లాసభరితమైన కార్యక్రమాల ఏర్పాటుతో కొత్త ఉత్సాహాన్ని పొందడానికి ప్రయతిస్తున్నారు.ఆరోగ్యంగా భరోసా! సంఘం కార్యదర్శి బుచ్చిరాజు మాట్లాడుతూ ‘‘మొన్నీమధ్య అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. సనత్నగర్లో ఉన్న మా సంఘ సభ్యుడు ఒకరికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ‘ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. హెల్త్ కార్డ్ ఎలా?’ అనే విషయంపై ఆ సభ్యుడి కూతురు ఆందోళనగా ఫోన్ చేసింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సమీప హాస్పిటల్ వాళ్లకు ఫోన్ చేసి, అంబులెన్స్ను పంపించడంతో పాటు, వారికి సహాయంగా ఉండటం కోసం వారి దగ్గరలో ఉన్న మరొక సభ్యుడిని అలెర్ట్ చేశాం. మాకు పెద్ద కుటుంబం అండగా ఉందన్న భరోసాను ఆ కుటుంబానికి అందించాం. ఇదే విధంగా ఇంకో సభ్యుడి సమస్య. పిల్లలిద్దరూ విదేశాలలో ఉన్నారు. తండ్రి ఒక్కడే హైదరాబాద్లో ఒంటరిగా ఉంటాడు. ఆరోగ్య స్థితి బాగోక ఆపద సమయంలో మమ్మల్ని సంప్రదించాడు. మేం తోడున్నామనే భరోసాను అందించాం. విశ్రాంత జీవనంలో ఉండేవి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలే. పిల్లలు వారి పనుల్లో బిజీగా ఉంటారు. దీంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు. కొన్ని విషయాల్లో పిల్లలు చెప్పింది వినరు. ఇలాంటప్పుడు ఏ వయసు వారిని ఆ వయసు వారితో కౌన్సెలింగ్స్ కూడా ఇప్పిస్తుంటాం..’’ అంటూ తామంతా ఒకే కుటుంబంగా ఎలా ఉంటున్నదీ వివరించారు.గాత్రంతో వీనుల విందు..కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా చేసి, రిటైర్డ్ అయిన కె.రామారావు మాట్లాడుతూ ‘‘మా సంఘ సభ్యులుగా ఉన్న ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించడం కోసం కల్చరల్ విభాగం ఏర్పాటు చేశాం. ఇప్పటికి 16 మంది కళాకారులు తమ గాత్రంతో సభ్యులకు వీనుల విందు చేస్తుంటారు. ఘంటసాల, బాలసుబ్రమణ్యంవర్ధంతి, జయంతి, సుశీల బర్త్డే సందర్భంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కళాకారులు అందరినీ సన్మానిస్తుంటాం. ఈ విభాగానికి కన్వీనర్గా ఉన్నందుకు, ఇలా కళాసేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉంద’ని తెలియజేశారు.పెన్షన్ నుంచి సామాజిక సేవఆరోగ్య అవగాహన కల్పించడమే కాదు ఈ సంఘం సభ్యులు సామాజిక సేవలో పాల్గొంటూ తమ దాతృత్వాన్నీ చాటుకుంటున్నారు. నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా చేసిన విశ్రాంత ఉద్యోగి డి.మీరం శెట్టి మాట్లాడుతూ ‘‘ప్రతి మూడు నెలలకు ఒకసారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇటీవల నిలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు లక్ష రూపాయల విలువైన మెడికల్ పరికరాలను, సైఫాబాద్ లో గల వైదేహి అనాథ బాలికల ఆశ్రమానికి స్కూటీని, దమ్మాయిగూడలోని వేద పాఠశాలకు పుస్తకాలు, వంట సామాగ్రిని, ఆర్ఓ వాటర్ప్లాంట్ అందించాం. కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ వైద్యులను, 700 మంది నర్సులను సన్మానించాం. రెండు నెలల కిందట మున్సిపల్ వర్కర్లకు, గాంధీ ఆసుపత్రి మెటర్నటీ వార్డులోని 400 మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్లోని అన్నా క్యాంటీన్కు రెండు లక్షలు, ఇటీవల వరద బాధితుల సహాయార్థం రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశాం. ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాల సహాయార్థం రెండు లక్షల రూపాయలకు పైగా వితరణ చేశాం’’ అని వివరించారు. ఈ మొత్తాలను సంఘ సభ్యులే తమ దయా హృదయంతో విరాళంగా ఇస్తుంటారని, వాటితోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపిన వీరు మలివయసును మహోన్నతంగా మలుచుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సంఘంలో చేరవచ్చుఆంధ్రప్రదేశ్ పెన్షన్ దారులు ఎవరైనా హైదరాబాద్లో స్థిరపడినవారుంటే ఈ సంఘంలో చేరి, తమ కంటూ మరో పెద్ద కుటుంబం ఉందన్న భరోసాతో ఆనందంగా జీవించవచ్చు. – టిఎంబి, బుచ్చిరాజుప్రధాన కార్యదర్శిమా సభ్యులకు వివిధ ప్రముఖ మెడికల్ ల్యాబ్ల నుండి, ఆసుపత్రుల నుండి ఫీజులో రాయితీ వచ్చేటట్లు కృషి చేస్తున్నాం. మా సభ్యుల సౌకర్యార్థం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సంఘానికి సంబంధించిన వివరాలతో త్రైమాసిక మ్యాగజైన్ని కూడా మా సభ్యులకు పంపుతున్నాం. – డి. మీరం శెట్టి, కన్వీనర్, ఆర్థిక సామాజిక సేవా విభాగంమహిళా బృందంవిశ్రాంత ఉద్యోగ మహిళలను, విశ్రాంత ఉద్యోగుల సతీమణులను చైతన్య పరచి, వారు వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విభాగంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉత్సాహవంతులైన మహిళలతో కోలాట బృందాన్ని ఏర్పరచి వారికి శిక్షణను ఇచ్చి, వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. – ఆర్ అనురాధ, కన్వీనర్, మహిళా విభాగం – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎల్ఐసీ సెటిల్డ్ క్లయిమ్స్ ఎంతంటే...
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ మొత్తంలో పాలసీ వినియోగదారులకు చెల్లించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం పదికోట్ల రూపాయలకుపైగా నగదును తమ పాలసీ దారులకు చెల్లించినట్టు కంపెనీ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,12,700.41 కోట్ల మేర 215.58 లక్షల క్లెయిములను పరిష్కరించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ 61 వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. 98.34 శాతం పాలసీ మెచ్యూరిటీ క్లయిములను, 99.63 శాతం డెత్ క్లయిములను పరిష్కరించినట్టు తెలిపింది. సంవత్సరం ప్రాతిపదికన 27,2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎల్ఐసికి రూ. 23,23,802. 59 కోట్ల లైఫ్ ఫండ్తో పాటు 25 ట్రిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. ఎల్ఐసీ మార్కెట్ వాటా 76.09 శాతంగా ఉంది. మార్చి చివరి నాటికి 20 మిలియన్ల కొత్త పాలసీలను సాధించింది. 2017 చివరి నాటికి, ఎల్ఐసికి వ్యక్తిగత వ్యాపారంలో 23 పధకాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆధార్ స్తంభ్, ఆధర్ షీలా, జీవన్ ఉమంగ్ , ప్రధాన్ మంత్రి వాయ వందన యోజన లాంటి నాలుగు కొత్త ప్లాన్లను చేర్చినట్టు చెప్పింది. చేర్చబడ్డాయి. మార్చి చివరి నాటికి మొత్తం పెట్టుబడులు రూ. 24,72,389 కోట్లు. 14 దేశాలలో సేవలను అందిస్తున్న ఎల్ఐసీ సంస్థ పూర్తిగా సొంతమైన, అనుబంధ మరియు జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా కార్యకలాపాలు నిర్వహస్తోంది. కార్పొరేషన్ ప్రస్తుతం 1.15 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 11.31 లక్షల మంది ఏజెంట్లు, 29 కోట్ల ప్లస్ పాలసీలు అమల్లో ఉన్నాయి. -
ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత కష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ 1,000 లోపు లావాదేవీల చార్జీలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఇతర ప్రీ పెయిడ్ సర్వీస్ ఏజెన్సీలకు సమాచారం అందించింది. 2017 జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వెయ్యి లోపు చెల్లింపులపై తక్షణ చెల్లింపుల సేవ (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, ఐఎంపీస్ ) యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపులు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలపై ఎలాంటి చార్జీలను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సమాజం లో ఎక్కువ మంది ప్రజల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఆదేశాలుజారీ చేసినట్టు ఆర్ బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. -
దుబాయ్లో భూమిక
సగటు పౌరుడు సంపాదించుకోవడానికి అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు నటీమణులు మాత్రం ఇక్కడ బాగా సంపాదించుకుని విదేశాల్లో సెటిలవ్వాలని ఆశిస్తుంటారు. నటి భూమిక ఇందుకు అతీతం కాదు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయిన నటి భూమిక. 2000 సంవత్సరంలో ప్రముఖ నటిగా వెలుగొందిన ఈమె తమిళంలో బద్రి, రోజాకూటం, చిల్లున్ను ఒరు కాదల్ తదితర చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులో మిస్సమ్మ, ఖుషి, సింహాద్రి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. యోగా మాస్టర్ భరత్ను పెళ్లి చేసుకుని కొంతకాలం నటనకు దూరంగా ఉన్న భూమిక ఆ తరువాత నటిగానే కాకుండా తన భర్తను నిర్మాతగా చేర్చి రెండు మూడు చిత్రాలు నిర్మించారు. భూమికకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు దుబాయ్లో సెటిల్ అయ్యారు. అక్కడ యోగా సెంటర్ను నెలకొల్పి భర్తకు సాయంగా ఉంటున్నారు. అంతేకాదు ఇండియాలోనూ పలు యోగా సెంటర్లను నెలకొల్పుతున్నట్లు భూమిక తెలిపారు.