-
రెండేసి ఇళ్లు కొంటున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్ హోమ్స్ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు కొంటున్నారంటే? ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్ హోమ్స్ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్తో పోలిస్తే సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ కొంటున్నారంటే? ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్ హోమ్స్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్ హోమ్స్కు డిమాండ్ ఉందని అడ్వైజరీ సర్వీసెస్ కొల్లియర్స్ ఇండియా ఎండీ శుభంకర్ మిత్రా తెలిపారు. దుబాయ్, యూఏఈలోనూ.. మిలీనియల్స్ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్ రోడ్లో ఫామ్హౌస్లకు డిమాండ్ ఉంది. గోవాలోని పలు బీచ్ ప్రదేశాలు కూడా హెచ్ఎన్ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్లోనూ సెకండ్ హోమ్స్ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్లో సెకండ్ హోమ్స్ డిమాండ్ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల ఫామ్హౌస్లు.. ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్ హోమ్స్ వృద్ధి 30–40% వరకుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్పూర్, సుల్తాన్పూర్లలో రూ.10–100 కోట్ల ఫామ్ హౌస్లకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్ హోమ్స్ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్ఎన్ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, మిలీనియల్స్ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్ అపార్ట్మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్లలో వర్క్ ఫ్రం హోమ్కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు. -
బంగారు బాతు..రెండో ఇల్లు
♦ అద్దెకివ్వటంతో అదనపు ఆదాయం ♦ అమ్మకం కోసమైనా ఖాళీగా ఉంచొద్దు ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, సొంతిల్లు... ఈ మధ్యలో కారు!! ఇదీ... ఈ తరం యువత ఆలోచన. ఆదాయాలు పెరుగుతుండటంతో చాలామందికి ఇవన్నీ 30-40 ఏళ్లలోపే సాకారమైపోతున్నాయి. దాంతో చాలా మంది రెండో ఇంటిని కూడా కొనుక్కోగలుగుతున్నారు. మరి ఈ రెండో ఇంటి ద్వారా ♦ అధికాదాయం పొందటమెలా? అందుకూ మార్గాలున్నాయి. రియల్ ఎస్టేట్పై డబ్బులు సంపాదించటానికి చాలామంది రకరకాల మార్గాలు ఎంచుకుంటుంటారు. డబ్బులు తగినంతగా ఉంటే ఫ్లాటో, ప్లాటో(స్థలం) కొనేసి, మంచి రేటు వస్తే అమ్మేసి లాభపడాలనుకునే వారు కొందరు. ముందు ఒక ఇంటిని కొనుక్కున్నాక... అదనంగా ఉన్న డబ్బులతో రెండో ఇంటిని కొని, దానిని అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని భావించే వాళ్లు మరికొందరు. తక్కువలో ఏదైనా ఇల్లు అమ్మకానికొస్తే, దానిని ఠక్కున కొనేసి, మరికొంత లాభానికి అమ్మడం ద్వారా లాభాలు కళ్లజూడాలని ఆలోచించే వాళ్లు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఎప్పుడు మంచిరేటు వస్తే, అప్పుడు అమ్మేద్దామనే భావనతో ఇంటిని ఖాళీగా ఉంచుతారు. ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే లాభాలను వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత మందగించిన విషయం తెలిసిందే. ఈ మందగమన కాలంలో ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం ఇన్వెస్టర్కు ఒకింత ఊరటనిస్తుందనేది కాదనలేని వాస్తవం. ♦ఉదాహరణకు మీ దగ్గర కోటి రూపాయల విలువ చేసే ఇల్లు ఉందనుకుందాం. దీనిని నెలకు రూ.50,000 చొప్పున అద్దెకిచ్చారనుకుందాం. అంటే ఏడాదికి మీకు రూ.6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే మీ ఇంటి అద్దె ఆదాయం(వార్షిక) మీ మూలధన విలువలో 6 శాతం అన్నమాట. సాధారణంగా మన దేశంలో సగటు ఇంటద్దె ఆదాయం రేటు 2-4 శాతం రేంజ్లో ఉంటుంది. అంటే మూల విలువలో 2-4 శాతమన్న మాట. రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణుల ప్రకారమైతే, మీ ఇల్లు మూలధన విలువలో 2 నుంచి 3 శాతం వరకూ వార్షికంగా ఇంటద్దె రూపంలో లభిస్తుంది. మీరు అందించే సౌకర్యాలు, మీ ఇల్లు ఉండే ఏరియాను బట్టి అద్దె విలువ మారుతుంటుంది. ఢిల్లీ, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇంటి అద్దె ఆదాయం రేటు 6-7 శాతంగా ఉంటోంది. ♦ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీ ఇంటి ద్వారా మంచి అద్దెనూ పొందే అవకాశాలున్నాయి. ఇంటికి సరైన అద్దెను నిర్ణయించడం... మీ ఇంటిమీద మీకు నెలవారీ వచ్చే అద్దెను సరిగా నిర్ణయించడమనేది ప్రధానమైన విషయం. మీ ఇల్లు ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న పరిస్థితులు, మార్కెట్ ట్రెండ్స్ను బట్టి అద్దె వస్తుంది. మీ ఇల్లు హౌసింగ్ సొసైటీలో ఉందనుకుందాం. అక్కడ ఉండే ఇళ్లన్నిటికీ ఒకే రకమైన అద్దె లభిస్తుంది. కొంచెం ఎక్కువ అద్దె రావాలంటే, ఇంటీరియర్స్ను మార్చడమో, లేక ఫర్నిచర్తో సహా అద్దెకు ఇవ్వడమో చేయాలి. ఒకవేళ మీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉందనుకుందాం. ఈ తరహా ఇళ్లకైతే సరైన అద్దె నిర్ణయించడం కొంచెం కష్టమైన పని. అయితే ఆ ఏరియాలో ఉండే ఇండిపెండెంట్ ఇళ్లను ఆయా ఇళ్ల యజమానులు ఎంతెంత ధరలకు అద్దెకిచ్చారో వాకబు చేయవచ్చు. ఇక్కడ కూడా అదనపు సౌకర్యాలు కల్పించడం ద్వారా అదనపు అద్దె పొందవచ్చు. కొత్త తరం మార్కెటింగ్.. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నవారే. ఇంటర్నెట్ పుణ్యమాని మీ ఇంటిని మార్కెటింగ్ చేయడం ఇప్పుడు చాలా సులభం. మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్, కామన్ఫ్లోర్, హౌసింగ్డాట్కామ్, మకాన్డాట్కామ్ తదితర వెబ్సైట్లలో మీరు అద్దెకివ్వాలనుకున్న ఇంటిని గురించి ఉచితంగా అడ్వర్టయిజ్ చేయవచ్చు. ఇక ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్ల ద్వారా మీ రెండో ఇంటిని సర్వీస్ అపార్ట్మెంట్గా, హాలిడే హోమ్గా అద్దెకు ఇవ్వడం ద్వారా ఒక్క రోజుకు రూ.3,000-రూ.5,000 వరకూ ఆదాయం పొందవచ్చు. అయితే ఇది అన్ని ఇళ్లకూ సాధ్యం కాకపోవచ్చు. దీనికి ఇల్లుండే ప్రాంతమనేది ప్రధానం. త్రీ-స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడం, మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తేవడం ద్వారా మరికొంత అదనంగా అద్దె ఆదాయం పొందే అవకాశమూ ఉంది. మీరు కనుక ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వంటమనిషి/కేర్ టేకర్, డ్రైవర్తో కూడిన కారు, స్విమ్మింగ్ ఫూల్, క్లబ్ ఏరియా, జిమ్ తదితర సౌకర్యాలను కూడా అందిస్తే రోజుకు రూ.7,000-10,000 వరకూ కూడా అద్దె పొందవచ్చు. ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్లు 3 శాతం వరకూ సర్వీస్ ఫీజును వసూలు చేస్తాయి. అయితే మీ ఇంటిని సర్వీస్ అపార్ట్మెంట్గా అద్దెకు ఇవ్వాలంటే పలు రకాల అనుమతులు, ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. మీరు అద్దెకు ఇవ్వాలనుకుంటున్న ఇల్లు ఏ ప్రాంతంలో ఉందో, ఆ ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. సంబంధిత మునిసిపాలిటీ అధికారుల నుంచి అనుమతులు పాందాలి. పోలీసుల వెరిఫికేషన్ కూడా తప్పనిసరి. సరైన కిరాయిదారు... మీ ఇంటిని సరైన వ్యక్తికి అద్దెకివ్వటమనేది చాలా తెలివైన పని. అద్దెకు దిగే వ్యక్తి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు? జీతం ఎంత ? తదితర వివరాలను తెలుసుకోవాలి. వీలైతే ఆ వ్యక్తి పనిచేసే కంపెనీ నుంచి రికమండేషన్ లెటర్ తీసుకుంటే మరీ మంచిది. ఇక ఆహారపు అలవాట్లు గురించి మీకు ఏమైనా అభ్యంతరాలు, ఏమైనా షరతులు ఉంటే ముందుగానే వెల్లడించడం ఉత్తమం. ఆ తర్వాత గొడవ పడేకంటే ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే, మీకు, మీరు అద్దెకు ఇచ్చే వ్యక్తికి మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. అన్ని వివరాలు నచ్చితే, పూర్తి వివరాలతో కూడిన అగ్రిమెంట్ను రాసుకోవాలి. ఒక రకంగా మీ రెండో ఇల్లు మీకు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటింది. అయితే మీకు వచ్చే ఆదాయంలో కనీసం పదో వంతు సొమ్ములతో మీ ఇంటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించడం కానీ, అదనపు సౌకర్యాలు కల్పించడం కానీ చేస్తే మీకు వచ్చే అద్దె విలువ మరింతగా పెరుగుతుంది. పన్ను వివరాలు... మీరు మీ ఇంటిని ఎలా అద్దెకు ఇచ్చారనే విషయాన్ని బట్టి పన్ను వివరాలుంటాయి. ఉదాహరణకు మీరు మీ ఇంటిని ఎవరికైనా నివసించడానికి అద్దెకు ఇచ్చారనుకోండి. ఈ అద్దెను ఇంటి ఆద్దె ద్వారా ఆదాయంగా పరిగణిస్తారు. ఒకవేళ సర్వీస్ అపార్ట్మెంట్గా మీరు మీ ఇంటిని అద్దెకిస్తే, దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అద్దె ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతారు. మీరు అద్దె ద్వారా పొందే ఆదాయం రూ. 1లక్ష మించినట్లయితే ఈ అద్దె ఆదాయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement