breaking news
Scavenger colony
-
‘స్కావెంజర్స్ కాలనీ వాసులకు బాబు సర్కార్ ద్రోహం చేస్తోంది’
-
‘వారికి బాబు సర్కార్ ద్రోహం చేస్తోంది’
సాక్షి, తిరుపతి : తిరుపతి నడిబొడ్డులో ఉంటున్న స్కావెంజర్స్ కాలనీ వాసులకు చంద్రబాబు నాయుడు సర్కార్ తీవ్ర ద్రోహం చేస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కావెంజర్స్ కాలనీలో ఉంటున్న వారంతా నిరుపేద గిరిజనులు, పారిశుద్ద్య కార్మికులని, వారు అనారోగ్యాలతో బాధపడుతున్నారని తెలిపారు. తిరుపతి నడిబొడ్డులో దశాబ్దాలుగా ఉంటున్న స్కావెంజర్స్ కాలనీ వాసులను ఖాలీ చేయించి వెల్లగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కావెంజర్స్ కాలనీలో బహుళ అంతస్తుల భవనాల పేరుతో మంత్రి నారాయణ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చటానికి చంద్రబాబు సర్కార్ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్ సీపీ పోరాటాల ద్వారా అడ్డుకుందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ గృహ నిర్మాణాల పేరుతో స్కావెంజర్స్ కాలనీ వాసులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
కోర్టు చెప్పినా అదే తీరు
► పేదల కాలనీపై మళ్లీ దౌర్జన్యం ► తెల్లారకుండానే చుట్టుముట్టిన అధికారులు ► న్యాయస్థానం ఉత్తర్వులపై కొత్త నాటకం ► భయాందోళన చెందిన గిరిపుత్రులు ► మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు ► తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో ఉద్రిక్తత నిరుపేదలు నివసించే ఆ కాలనీపై అధికార పార్టీ నేతల దృష్టి మారడం లేదు. ఎలాగైనా కాలనీని కైవసం చేసుకోవాలనుకుంటున్న వారి కుయుక్తులకు అధికారుల దూకుడు తోడయ్యింది. దీంతో ఆ పేదలంతా హడలిపోతున్నారు. కంటిమీద కునుకు లేదు. కోర్టు ఉత్తర్వులను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారు. కాలనీని ఖాళీ చేయించడానికి కదులుతున్నారు. పోలీసుల సాయంతో దండెత్తుతున్నారు. సోమవారం మరోమారు అధికారులు విజృంభించడంతో బాధిత గిరిజనులు కలవరం చెందారు. ఇదేం న్యాయం.. కోర్టు చెబితే వింటారనుకున్నాం. ఆఫీసర్లు అదేం పట్టించుకోలేదు. తెల్లారకుండానే మా ఇళ్లమీదకు వచ్చారు. ఖాళీ చేయమంటున్నారు. పోలీసులను కూడా తీసుకొచ్చా రు. ఏం చేయాలో తెలియడం లేదు. మాకు నిద్ర పట్టడం లేదు. ఇష్టం లేకపోయినా వెళ్లిపోమంటున్నారు. ఏవో కాయితాలు తెచ్చి సంతకం పెట్టమంటున్నారు. భయంగా ఉంది. ప్రభుత్వానికి మా పేదో ళ్ల గుడిసెలే కనిపించాయా.. ప్రాణాలయినా ఇస్తాం గాని ఇల్లు ఖాళీ చేయం. – గంగమ్మ, స్కావెంజర్స్ కాలనీ తిరుపతి తుడా: తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో సోమవారం మళ్లీ అలజడి మొదలైంది. మూడు రోజుల క్రితం ఈ కాలనీని ఖాళీ చేయించేందుకు పోలీసుల సాయంతో మున్సిపల్ అధికా రులు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కాలనీలోని పేదల పక్షాన పలు ప్రజా సంఘాలు ముందుకొచ్చి అండగా నిలిచాయి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడమని హెచ్చరించాయి. గిరిపుత్రులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని గుర్తించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు(తిరుపతి) సుమోటోగా స్వీకరించింది. బలవంతంగా ఖాళీ చేయి స్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కాలనీని యథావిధిగా ఉంచా లని మర్నాడు హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో అధికారులు మాట మార్చారు. ఇష్టం ఉన్న వారిని తరలిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరదీశారు. సోమవారం సోమవారం ఉదయం 5.30 గంటలకే స్కావెంజర్స్ కాలనీలో పోలీసు బలగాలను తీసుకుని అడుగు పెట్టారు. అప్పటికే గిరి పుత్రులు పారిశుద్ధ్య విధులకు వెళ్లిపోయారు. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న కార్మికులు పరుగున కాలనీకి చేరుకున్నారు. ‘ఈ ఇల్లు ఎవరిది, మీదేనా, ఎక్కడ పనిచేస్తారు, మీ మేస్త్రీ, సూపర్ వైజర్ ఎవరంటూ సిబ్బంది ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానానికి ఛాన్స్ ఇవ్వకుండా తాము చెప్పింది వినాలని, తక్షణమే ఇల్లు ఖాళీ చేసి చెప్పిన చోటకు వెళ్లాలంటూ వారు హుకుం జారీ చేశారు. అప్పటికే ఓ ఇంటిని తొలగించారు. వెంటనే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుని కాలనీ వాసులకు మద్దతుగా నిలిచారు. స్టేటస్ కో ఉన్నప్పుడు ఇంటిని ఎలా కూల్చేస్తారని అధికారులను నిలదీశారు. వంటా వార్పుతో నిరసన... కాలనీలో బాధితులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అధికారులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికారులు వెనక్కి వెళ్లకపోవడంతో అక్కడే వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్సీ సుధాకర్ రెడ్డి, సిఐలు శ్రీనివాసులు, భాస్కర్లు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులతో మాట్లాడిన డిఎస్పీ తాము ఎవ్వరినీ ఖాళీ చేయించడం లేదని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. -
సర్కారుకు మొట్టికాయ
► స్కావెంజర్ల కాలనీ ఖాళీ చేయించవద్దని కోర్టు ఆదేశాలు ► కార్పొరేషన్ అధికారుల చర్యలపై ఆగ్రహం ► సుమోటోగా స్పందించడం ఇదే తొలిసారి ► తీర్పుతో బాధిత స్కావెంజర్లకు ఊరట తిరుపతి తుడా: తిరుపతి స్కావెంజర్స్ కాలనీని తొలగించి బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలనుకున్న ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా కోర్టు స్పందనతో స్కావెంజర్లకు ఉపశమనం లభించింది. 90 శాతం ఎస్సీ, ఎస్టీలు వుండే కాలనీని ఖాళీ చేయించవద్దని తిరుపతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెంటివ్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. రెండు రోజులుగా తిరుపతి నగర పాలక సంస్థ అ«ధికారులు కాలనీలోని ఇళ్లను ఖాళీ చేయించేందుకు భారీగా పోలీసు బలగాలతో వచ్చి అలజడి సృష్టించారు. గిరిజన మహిళలు తమ ఇళ్లు ఖాళీ చేయించవద్దని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీనిపై కోర్టు సుమోటోగా స్వీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా సుమోటోగా స్వీకరించి స్పందించడం రాష్ట్రంలోనే తొలిసారి అని తెలిసింది. వారిచేత మాన్యువల్గా స్కావెంజర్ విధులు నిర్వర్తించడం కూడా నేరమని పేర్కొం ది. స్కావెంజర్ల కోసం ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏకమై కాలనీ వాసులకు అండగా నిలిచారు. రెండు రోజులుగా తిండి, నిద్రాహారాలు మాని కాలనీ వాసులు రోడ్డెక్కారు. కార్పొరేషన్ సిబ్బంది కొన్ని ఇళ్లను తొలగించగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టు జడ్జి రాంగోపాల్ జారీచేసిన ఉత్తర్వులు కాలనీవాసులకు ఆనందాన్ని పంచాయి. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అట్రాసిటీ చట్టం కింద కమిషనర్, సంబంధిత ఉద్యోగులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఇళ్లు ఖాళీ చేయించవద్దని, కాలనీవాసులకు అండగా నిలవాలని హెచ్చరికలు జారీ చేసింది. బహుళ అంతస్తుల భవనానికి తెరలేపిన ప్రభుత్వానికి, అధికారులకు కోర్టు తీర్పుతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.