breaking news
Sattenapalle Assembly Constituency
-
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
సాక్షి,గుంటూరు: సింగయ్య మరణంపై పుంకాలు పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా అండ్ గ్యాంగ్కు బిగ్ షాక్ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే వైఎస్ జగన్ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా, ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అందుకు రెంటపాళ్ల వైఎస్ జగన్ పర్యటనను వినియోగించుకుంది కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, సత్తెన పల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు జూన్ 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ కాన్వాయ్కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవ్వగా.. అప్రమత్తమైన స్థానికులు 108 ఫోన్ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించారంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్ది సేపటికే ఒరిజినల్ వీడియో రావడంతో ఎల్లో గ్యాంగ్ అడ్డంగా దొరికింది. -
సత్తెనపల్లి రీ పోలింగ్.. మంత్రి అంబటి పిటిషన్పై నేడు విచారణ
సాక్షి, అమరావతి: ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి రిగ్గింగ్, దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.కాగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నప్పటికీ వారిపై దాడులకు తెగబడ్డారు.ఇక, ఈ ఘటనలపై వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
‘సీఎం జగన్ పాలనలో పచ్చ బ్యాచ్ ఆటలు సాగవని బాబుకు తెలుసు’
సాక్షి, సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం జగన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం జగన్ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్ను ఓడించలేరు. సీఎం జగన్పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ, చంద్రబాబు, పవన్లకు మాత్రం వెటకారంగా ఉంది. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు?. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైస్సార్సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.