breaking news
Sarthak
-
కేకేఆర్లోకి పప్పు యాదవ్ కొడుకు.. ధర ఎంతంటే?
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ భారీ బిడ్డింగ్స్తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 105, టీ20ల్లో 5 మ్యాచ్లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు."అభినందనలు సార్థక్! నీ టాలెంట్తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్! -
పాపం.. తాతామనవళ్లను పొట్టనపెట్టుకున్నాడు
ముంబై: అన్నీ సవ్యంగా సాగినట్టయితే ఆ బాలుడు మరో రెండు వారాల్లో ఆరో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సివుంది. మద్యంతాగిన కారు డ్రైవర్ రూపంలో మృత్యువు ఊహించని విధంగా వచ్చింది. పాపం ఆ చిన్నారితో పాటు అతని తాతను పొట్టనపెట్టుకుంది. ముంబై శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సార్తక్, తాత భికు కొలెకర్ (65) మరణించారు. మద్యంమత్తులో కారు నడిపిన వ్యక్తి దర్శకుడు, నిర్మాత. సార్తక్ కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఒషివరాలోని ఆనంద్ నగర్లో సార్తక్, తల్లి శిల్ప, అవ్వతాతలు ఇందు (58), భికుకొలెకర్ రోడ్డు దాటుతుండగా.. స్పీడ్గా వచ్చిన వోక్స్ వ్యాగన్ కారు వారిని ఢీకొట్టింది. సార్తక్ గాల్లో ఎగిరి కారు బ్యానెట్పై పడి దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డాడు. తాతా భికు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. శిల్ప భుజాలకు స్వల్ప గాయాలయ్యాయి. సార్తక్ను, తల్లి శిల్పను సమీపంలోని రూబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, సార్తక్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సార్తక్ తాతను కూపర్ హాస్పిటల్కు తరలించగా, ఆయన కూడా మరణించినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఈ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సార్తక్ తండ్రి సందీప్ ఈ పార్టీకి వెళ్లలేదు. కారు డ్రైవర్ మద్యంమత్తులో తన కొడుకు, తండ్రిని బలితీసుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యాడు. మద్యంమత్తులో ఈ కుటుంబాన్ని ఢీకొట్టిన కారు డ్రైవర్ ఇంద్రజిత్ నట్టోజి (45) వాహానాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు బైకులపై వెళ్లి అతన్ని పట్టుకుని బందించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యంతాగి వాహనాన్ని నడిపినట్టు పోలీసులు చెప్పారు.


