-
నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు
పవర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు బాబీ(కె.యస్.రవీంద్ర). దర్శకుడిగా మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్ టెక్నీషియన్ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. రెండో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ను డైరెక్టర్ చేసి ఛాన్స్ కొట్టేసిన ఈ యువ దర్శకుడు సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. సర్థార్ ఫెయిల్యూర్ తో గ్యాప్ తీసుకున్న బాబీ, తరువాత ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను రూపొందించి మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్న బాబీ, నిర్మాతగా తెరకెక్కించే సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు. నిర్మాతగా తొలి సినిమాకు అరుణ్ పవార్ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు బాబీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ యువ కథానాయకుడిని సంప్రదిస్తున్నారట. -
పావగడలో విద్యార్థి హత్య
► సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శనలో అపశ్రుతి ► షో నిలిపివేత పావగడ: థియేటర్లో కుర్చీ కోసం జరిగిన గొడవలో పవన్కల్యాణ్ అభిమాని హత్యకు గురయ్యాడు. స్థానిక అలంకార్ సినిమా థియేటర్లో ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తాలూకా లోని బాలమ్మనహళ్లి గ్రామానికి చెందిన ద్వితీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థి, పవన్ కళ్యాణ్ వీరాభిమాని రాకేశ్(20) తన స్నేహితులతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను చూడటానికి శుక్రవారం స్థానిక అలంకార్ థియేటర్ కు వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల మొదటి ఆటకు థియేటర్ లోకి వెళ్లాడు. అంతలో రవి అనే మరో పవన్ అభిమాని రాకేశ్ తో కుర్చీ కోసం గొడవ పడ్డారు. తేల్చుకుందామని ఒకరికొకరు థియేటర్ వెలుపలికి వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. ఈ సందర్భంలో రవి నైల్ కట్టర్కు ఉండే చిన్న పాటి చాకుతో రాకేశ్ మెడపై పొడిచాడు. దీంతో ప్రధాన నరం తెగినట్లు చికిత్స అందించిన వైద్యులు భావించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి బంధవులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మృతుడి తల్లి శాంతిబాయి కొడుకు హత్యతో గుండెలవిసేలా రోదించింది. కొన్ని రోజుల క్రితమే భర్త సేవానాయక్ మృతి చెందడాన్ని మరువక ముందే కొడుకు హత్యకు గురి కావడం ఆమెను తీవ్రంగా కలచి వేసింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే సోమ్లానాయక్, మున్సిపల్ చైర్మన్ మానం వెంకటస్వామి పోలీస్ స్టేషన్కు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా సీఐ ఆనంద్కు సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement