Rudrama
-
28న నింగిలోకి ‘రుద్రమ వి.1’
కాజీపేట అర్బన్: హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానం నుంచి ఈనెల 28న నమూనా రాకెట్ రుద్రమ వి.1 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు నిట్ వరంగల్లోని సెమినార్హాల్లో నమూనా రాకెట్ లాంచింగ్ వాల్పోస్టర్ను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, కుడా వైస్ చైర్పర్సన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏటీడీఆర్ఎల్ ప్రతినిధి శశాంక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మాట్లాడుతూ నమూనా రాకెట్ను రుద్రమ వి.1 పేరిట ఆవిష్కరించి లాంచింగ్ చేయడం, ఇందులో నిట్ వరంగల్లోని ఆ్రస్టానమీ క్లబ్, శాటిలైట్ క్లబ్ విద్యార్థులు భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.హయగ్రీవాచారి మైదానంలో నమూనా రాకెట్ రుద్రమ వి.1ను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గతేడాది నాలుగు గ్రహాలు ఒకేసారి దర్శనమివ్వగా, ఈ ఏడాది ఏడు గ్రహాలను వీక్షించేందుకు ఈనెల 18 నుంచి 10 రోజులపాటు వరంగల్ హంటర్రోడ్డులోని భద్రకాళిబండ్పై నాలుగు టెలిస్కోప్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాకెట్ లాంచింగ్ అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులతో ప్యానల్ చర్చలు, టాక్షో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నిట్ వరంగల్లో అంతరిక్ష సాంకేతిక ప్రాజెక్టులతో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఇస్రో నోడల్ సెంటర్ కోఆర్డినేటర్, నిట్ ప్రొఫెసర్ ఎల్.ఆంజనేయులు చెప్పారు. స్టార్టప్గా ఏర్పడిన ఏటీడీఆర్ఎల్ ద్వారా తొలిసారిగా నమూనా రాకెట్ రుద్రమ వి.1 లాంచింగ్కు ఏర్పాటు చేసినట్లు ఏటీడీఆర్ఎల్ ప్రతినిధి శశాంక్ తెలిపారు. శ్రీహరి కోటలో రాకెట్ లాంచింగ్ను తలపించే విధంగా హయగ్రీవాచారి మైదానంలో నమూనా రాకెట్ రుద్రమ వి.1 నిలవనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్రెడ్డి, నిట్ ప్రొఫెసర్ చయన్బార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్కు రాణి రుద్రమదేవి పయనం
జీవకళ ఉట్టిపడుతున్న శిల్పం రాజ్కుమార్ శిల్పశాలలో రూపకల్పన కొత్తపేట : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో నెలకొల్పేందుకు రాణి రుద్రమదేవి విగ్రహాన్ని కొత్తపేట నుంచి బుధవారం తరలించారు. హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. రుద్రమదేవి విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్కు కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పగించింది. దీంతో వుడయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విగ్రహాన్ని రూపొందించారు. రుద్రమదేవి విగ్రహం ద్వారా ‘ఆచార్య’ పురస్కారం తాను రుద్రమదేవి విగ్రహాన్ని తొలిసారి 2004లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి తయారు చేశానని శిల్పి రాజ్కుమార్ తెలిపారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అప్పటి గవర్నర్ సుశీల్కుమార్ షిండే ద్వారా ’ఆచార్య’ గౌరవ పురస్కారాన్ని ఆ యూనివర్సిటీ తనకు అందజేసిందని చెప్పారు. తరువాత రుద్రమదేవి పరిపాలన సాగించిన వరంగల్ కోట వద్ద, 2005లో వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నెలకొల్పిన విగ్రహాలను తానే రూపొందించానన్నారు. ఇది నాల్గవ విగ్రహమన్నారు. సజీవ శిల్పాల రూపశిల్పి రాజ్కుమార్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజ్కుమార్ నెలకొల్పిన విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయని కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి వి.ఎస్.ఆర్.గాంధీ అభినందించారు. తెలంగాణలో రాజ్కుమార్ తయారు చేసిన రుద్రమదేవి, జయశంకర్, చాకలి ఐలమ్మ తదితరుల అనేక విగ్రహాలు పరిశీలించిన తరువాత ఈ విగ్రహం బాధ్యతను ఆయనకే అప్పగించామన్నారు.77.15 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతానికి 2012లో కాకతీయ హిల్స్గా నామకరణం చేశామని తెలిపారు. ముఖద్వారంలో 72 అడుగులు వెడల్పు, 24 అడుగులు ఎత్తులో ఆర్చ్ నిర్మించామని, అక్కడే ఈ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఈ నెలలోనే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
‘రుద్రమ’ రెడీ
గుణశేఖర్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ విడుదలకు సిద్ధమైంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేస్తున్నట్టు గుణశేఖర్ ప్రకటించారు.


