breaking news
Rs.10000
-
భారత్లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?
భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తరువాత రెండు వేలరూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ10000 నోటు.. అతిపెద్ద డినామినేషన్గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు భారదేశంలో అతిపెద్ద కరెన్సీ అంటే రూ. 500 నోటు అనే చెప్పాలి. -
తాగితే 10 వేలు.. అమ్మితే 20 వేలు..
చిన్నశంకరంపేట (మెదక్): మద్యం బాబుల ఆగడాలను అరికట్టేందుకు ఆ గ్రామస్తులు నడుం బిగించారు. మద్యపాన నిషేధం కోసం అందరూ ఏకమయ్యారు. మద్యం క్రయవిక్రయాలను నిషేధించారు. మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా, బహిరంగంగా తాగితే రూ.10 వేల జరిమానాగా వసూలు చేయాలని తీర్మానించారు. వివరాలు.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని కిరాణం దుకాణాల్లో విచ్చలవిడిగా మందు తాగి కొందరు గొడవలకు దిగుతున్నారు. ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం 'గ్రామజ్యోతి' గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో మద్యం నిషేధ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షురాలిగా గ్రామ సర్పంచ్ కర్రె నర్సమ్మ, కన్వీనర్గా ఎంపీపీ అధ్యక్షురాలు కర్రె కృపావతితో పాటు మరో 23 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించరాదని ఈ సందర్భంగా నిర్ణయించారు. గ్రామసభ తీర్మానాన్ని కాదని ఎవరైనా మద్యం అమ్మితే రూ.20 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలో ఎవరైనా బహిరంగంగా మద్యం తాగినా, తాగి వచ్చి అల్లరి చేసినా రూ.10 వేల జరిమానా విధించాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆ మేరకు తయారైన తీర్మానంపై గ్రామస్తులు, కిరాణ షాపుల యజమానులు సంతకాలు చేశారు.