breaking news
retirees
-
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓలో పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు సుమారు రూ.2.54 కోట్లు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.రిటైర్డ్ బ్యాంకర్కు రూ.1.25 కోట్ల నష్టంసికింద్రాబాద్కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ మోసానికి ప్రధాన బాధితురాలుగా ఉన్నారు. నేరగాళ్లు ముందుగా బాధితురాలిని ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అందులో సంస్థాగత ఐపీఓల ద్వారా వచ్చే భారీ లాభాల స్క్రీన్షాట్లను చూపి నమ్మించారు. ఒక యూఎస్ నంబర్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో బోగస్ ట్రేడింగ్ యాప్ను ఆమె డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్య ఆమె తన మూడు వ్యక్తిగత ఖాతాల నుంచి 11 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 15 దఫాలుగా రూ.1.25 కోట్లు బదిలీ చేశారు. యాప్లో ఆమె బ్యాలెన్స్ రూ.1.9 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలేదు. పైగా ‘క్లియరింగ్ ఛార్జీల’ పేరుతో మరో రూ.58.58 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.మరో మూడు కేసులుజనవరి 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇలాంటివే మరికొన్ని ఫిర్యాదులు అందాయి.మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని స్టాక్ బ్రోకరేజ్ విశ్లేషకులుగా నటించిన స్కామర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రలోభపెట్టారు. గత ఏడాది మార్చి-మే మధ్య ఆయన రూ.50.8 లక్షలు పోగొట్టుకున్నారు.76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఐపీఓ ట్రేడింగ్ సలహాలను నమ్మి డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య రూ.46.25 లక్షలు నష్టపోయారు.మియాపూర్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూఎస్ స్టాక్స్లో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్ ద్వారా రూ.32.1 లక్షలు కోల్పోయారు.పోలీసుల హెచ్చరికలుఈ నాలుగు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం తెలియాజేయాలని సూచించారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే.. -
రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్
పదవీ విరమణ చేసిన బ్యాంకర్లకు వర్తించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కలిగించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) నిర్వహించే పథకం కింద ఉన్న పాలసీలకు ఈ స్టే వర్తిస్తుంది.అసలు సమస్యేంటి?భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం సమగ్రమైన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలు సాధారణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి నిర్వహిస్తున్నారు. అయితే ఈ గ్రూప్ పాలసీలకు వర్తించే వస్తు సేవల పన్ను (GST) రిటైర్డ్ బ్యాంకర్లకు ఆర్థిక భారంగా మారిందనే వాదనలున్నాయి. ఈ పాలసీల ప్రీమియం మొత్తాన్ని పదవీ విరమణ చేసిన వారే పూర్తిగా భరిస్తున్నారు కాబట్టి, జీఎస్టీ కారణంగా వచ్చే అదనపు భారం నేరుగా వారిపై పడుతోంది. దీనిపై ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్స్ కాన్ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈక్రమంలో దాఖలైన పిటిషన్ను కేరళ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ తరుణంలో పదవీ విరమణ చేసిన బ్యాంకర్లను కవర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు స్టే విధించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి పాలసీలను పునరుద్ధరించేటప్పుడు వాటిపై జీఎస్టీని వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ ఆదేశాలను అనుసరించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇప్పటికే సర్క్యులర్ను జారీ చేసింది.పదవీ విరమణ చేసిన బ్యాంకర్లపై ప్రభావంఐబీఏ గ్రూప్ పాలసీ పరిధిలో సుమారు 2 లక్షల మంది పదవీ విరమణ చేసిన బ్యాంకర్లు ఉన్నారు. ఈ మొత్తం ప్రీమియంను బ్యాంకులకు బదులుగా రిటైర్డ్ ఉద్యోగులే చెల్లిస్తున్నారు. కాబట్టి జీఎస్టీ వారికి ప్రత్యక్ష భారంగా మారుతోంది. ఈ మధ్యంతర ఉపశమనం శాశ్వతంగా మారి, దేశవ్యాప్తంగా అమలులోకి వస్తే ఇది సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 31, 2025న జరగనుంది.ఇదీ చదవండి: వడ్డీ ఆదాయంపై పన్ను ఏ మేరకు..? -
విభజన.. హైరానా!
అందరి దృష్టి జూన్ 2 పైనే - తలమునకలవుతున్న ప్రభుత్వం - ఉద్యోగుల బిల్లులు మినహా తక్కిన పనులన్నీ వాయిదా - నెలాఖరునే పదవీ విరమణ లబ్ధి - మొరాయించిన ఆన్లైన్ సర్వర్లు - జూన్ ఒకటి సహా మే నెల వేతనం బిల్లుల సమర్పణ గడువు పొడిగింపు? సాక్షి, కర్నూలు: ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతులు.. పోస్టింగ్లు.. కౌన్సెలింగ్లు.. అన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బిల్లులు మినహా మిగిలిన పనులేవీ ఇప్పుడు కాదని తేల్చి చెప్పింది. విభజన నేపథ్యంలో చక్కబెట్టాల్సిన పనులపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉద్యోగులు వారి జీతాల బిల్లులు సమర్పించేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు పొడిగించడంతో ఆదివారం కూడా ఖజానా కార్యాలయాలు పనిచేశాయి. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు 65వేల పైమాటే. పింఛన్దారులు 35వేల మంది ఉన్నారు. అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ తుది గడువుగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జూన్ 2న అమల్లోకి రానుండటంతో ఆ నెల 1వ తేదీకి సంబంధించి ఒక్కరోజు ఉద్యోగుల జీతం బిల్లును కూడా ముందుగానే సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుల తయారీకి ఉద్యోగులు హైరానా చెందుతున్నారు. ఇదిలాఉండగా ఐసీడీఎస్ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులతో పాటు వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధులను కూడా ఒకే పద్దు కింద డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు మూడు రోజుల్లోనే నిధులన్నీ డ్రా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన అమల్లోకి వస్తే ఆ తర్వాత నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో తెలియని నేపథ్యంలో ఐసీడీఎస్ పథకాలు నిలిచిపోకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాఖల కుదింపు ప్రస్తుతం ప్రభుత్వ శాఖల విభాగాలన్నీ కలిపి 114 ఉండగా.. వీటిని కుదించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ విభాగాలను సగం కన్నా తక్కువ సంఖ్యలో కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ డెరైక్టరేట్లోనూ ఆయా శాఖలను పర్యవేక్షించే సిబ్బందిని కుదించనున్నారు. ఈ కసరత్తును ఈనెల 24వ తేదీలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 24వ తేదీ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఖర్చును అనమతించరాదని నిర్ణయించారు. ఉద్యోగులు జీపీఎఫ్, కంటింజెంట్, జీతాల బిల్లులు, నెలాఖరుకు పదవీవిరమణ చేసే వారి గ్రాట్యూటీ, ఇతర బిల్లులను ఈ గడువులోగానే సమర్పించాల్సి ఉంది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన బిల్లులను కూడా ఈ గడువులోపే అందజేయాలని ఆదేశించారు. అందుబాటులోకి రాని సర్వర్లు విభజన ముంచుకొస్తున్న సమయంలో ఆన్లైన్ మొండికేసింది. శని, ఆదివారం సర్వర్లు మొరాయించగా.. సోమవారం ఉదయం కొంతసేపు పనిచేసినా ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. ఉద్యోగులు బిల్లులు సమర్పించేందుకు సోమవారం ఆఖరు కావడంతో గందరగోళానికి తావిచ్చింది. సర్వర్లు పని చేయని కారణంగా గడువును 23వ తేదీ వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ట్రెజరీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా విభజన కారణంగా ప్రతి శాఖలోనూ ఉద్యోగులపై ఒత్తిడి అధికమైంది.


