breaking news
Residue
-
కడుపులోకి ‘కల్తీ’ కూట విషం..
సాక్షి, హైదరాబాద్: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. పప్పులు.. బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. గోధుమలు కాదేదీ పెస్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు) ఆనవాళ్లకు అనర్హం అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్ వాసులు రోజువారీగా విని యోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో బహిరంగ మార్కెట్ల, లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తం గా సుమారు 30% మేర పెస్టిసైడ్స్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా మంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఆన వాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మో క్రిమి సంహారకాలు.. క్రిమి సంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీ స్టార్బిన్, కార్బన్డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్ తదితర క్రిమిసంహారక ఆన వాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించి న పరిమితులకు మించి ఉంటున్నాయి. ఎసిఫేట్, లిండేన్ వంటి క్రిమి సంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుగంధ ద్రవ్యమైన యాలకులలోనూ క్వినై ఫోస్, అజోక్సీస్టార్బిన్, థయామె టోక్సా మ్ వంటి క్రిమి సంహారకాలు ఉంటున్నాయి. పెస్టిసైడ్స్ ఆనవాళ్లతో అనర్థాలివే.. దేశంలో సరాసరిన 10% మధుమేహ బాధి తులుండగా.. హైదరాబాద్లో సుమారు 16–20% మంది ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దేశంలో గ్రేటర్ సిటీ డయాబెటిక్ క్యాపిటల్గా మారుతుండటం ఆందోళన కలి గిస్తోంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవశరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్ల పాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహం లోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణ మవుతాయంటున్నారు. కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగిన తరవాత.. బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహానికి కారకాలు.. తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్న వారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్న వారు సైతం మధు మేహ వ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్ తదితర క్రిమి సంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేర డమే ప్రధాన కారణ మని ఈ నివేదిక హెచ్చరిం చింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్ క్రిమిసం హారకాల తయారీ దేశంలో అధి కంగా జరుగుతోందని.. ఇక లిండేన్ వంటి నిషే ధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాం తాల్లో విరివిగా విని యోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తు తున్నా యని ఈ నివేదిక స్పష్టం చేసింది. తలసరి క్రిమిసం హారకాల వినియోగం లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. తల్లిపాలలోనూ క్రిమి సంహారకాల ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి వైఖానస ఆగమ సదస్సు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమప్రోక్తంగా నిర్వహించే పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవల విశిష్టతను తెలిపేలా శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు వైఖానస ఆగమ సదస్సు నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల నేతృత్వంలో ఆస్థాన మండపంలో ఈ సదస్సు నిర్వహణకోసం హిందూ ధర్మప్రచార పరిషత్ ఏర్పాట్లు చేసింది. తొలి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఉపన్యాసాలు ఉంటాయి. 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ప్రసంగాలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సమావేశం నిర్వహిస్తారు. సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి వైఖానస ఆగమ పండితులు పాల్గొంటారు. లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం- జిజ్ఞాసాధికరణం, వైఖానసమ తత్త్వచింతన, అష్టాదశ శారీర సంస్కార విశిష్టత, ఉత్తమ బ్రహ్మ విద్య వైఖానస ఆగమం వంటి అనేక అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. 15న తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17వ తేదీన ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 17 తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఆలయంలో 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించరు. ఆరోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. ఇక 17వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమల ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఆ రోజు నుంచే ఆలయ నిర్వహణ లెక్కలు ప్రారంభిస్తారు.