-
పీఎన్బీకి రూ.2 కోట్లు జరిమానా
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బ్యాంకుపై ఆర్బీఐ రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వినియోగించే సాఫ్ట్వేర్ అయిన ‘స్విఫ్ట్’ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించినట్లు పీఎన్బీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ కార్యాచరణ లోపం కారణంగానే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ.14,000 కోట్ల కుంభకోణం చేయగలిగారని వివరణ ఇచ్చింది. ఇటీవలే ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీ, బీఓబీ, సిటీ బ్యాంక్, కెనరా బ్యాంక్, యస్ బ్యాంక్లపైనా ఆర్బీఐ ఇదే తరహా జరిమానాలను విధించింది. -
ముగిసిన ‘క్రమబద్ధీకరణ’!
చివరి రోజు పెరిగిన రుసుం చెల్లింపులు మూడు పర్యాయాలు గడువు పెంచినా స్పందన అంతంతే మరో రెండు నెలల గడువు కోసం ప్రతిపాదనలు సిటీబ్యూరో : ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్ధీకరించుకునేందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నోటీసు అందుకున్న వారు బ్యాంక్లో ఈ-చలాన్ చెల్లించేందుకు బారులు తీరారు. ప్రభుత్వం మూడు పర్యాయాలు గడువు పెంచినా క్రమబద్ధీకరణ అంతంత మాత్రంగానే కొనసాగింది. మరోవైపు కొత్త దరఖాస్తులకు అవకాశం, రుసుం చెల్లింపులో వెసులుబాటుపై పేద ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు రావడంతో...మరో రెండు మాసాలు గడువు పెంచాలని హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వాస్తవంగా 59 జీవో కింద 956 దరఖాస్తులు రాగా అందులో కేవలం 387 మాత్రమే అర్హత సాధించారుు. మరోవైపు జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న సుమారు 4,841 దరఖాస్తులు సర్వే నివేదికల ఆధారంగా 59 జీవో కిందకు మార్చారు. దీంతో పేదలపై ఆర్థిక భారం పడినట్లరుుంది. అధికారులు డోర్ టూ డోర్ విచారణ జరిపి ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమతపై నివేదిక సమర్పించడంతో కేటగిరి మార్పు తప్ప లేదు. ముఖ్యంగా అంబర్పేట, ఆసిఫ్నగర్, షేక్పేట, ఖైరతాబాద్, గోల్కొండ, మారేడుపల్లి తదితర మండలాలలోని ఆక్రమిత ఇళ్ల కేటగిరిలో మార్పు చోటుచేసుకుంది. దీంతో కేటగిరి మారిన వారు క్రమబద్ధీకరణ కోసం రుసుం చెల్లించేందుకు పెద్దగా అసక్తి కనబర్చనట్లు తెలుస్తోంది. నోటీసులకు స్పందన కరవు జిల్లా యంత్రాంగం ఆక్రమిత ఇళ్ల భూ క్రమబద్ధీకరణ కోసం అర్హులైన దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన కరువైంది. మొత్తం మీద 3,647 మంది దరఖాస్తు దారులకు నోటీసులు జారీ చేస్తే..100 శాతం రుసుం చెల్లించిన వారు 590 మందికి మించలేదు. 59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న 150 మందికి, 58 నుంచి 59 కేటగిరిలోకి మార్పు చెందిన 3,311 కుటుంబాలకు నోటీసు జారీ చేసినా..కొద్ది మంది మాత్రమే రుసుం చెల్లించేందుకు ముందుకు వచ్చారు. జీవో 92కు కూడా అంతంతే.. జీవో నంబర్ 92 కింద స్పందన అంతంత మాత్రంగానే మారింది. గడువు పెంపు అనంతరం కేవలం 148 మంది మాత్రమే రుసుం చెల్లించినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నారుు. అధికారులు సుమారు 372 మందికి నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోరుుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
పోలింగ్ బూత్లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement