breaking news
Registration of new vehicles
-
2020 నాటికి బీఎస్–4 రిజిస్ట్రేషన్లు బంద్
న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలతో దేశంలో తయారయ్యే వాహనాల రిజిస్ట్రేషన్ను 2020, జూన్ 30 నాటికి నిలిపివేస్తామని కేంద్రం తెలిపింది. 2020, ఏప్రిల్ 1 వరకు తయారైన వాహనాలన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టంలో మార్పులు చేపట్టేందుకు ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రస్తుతం బీఎస్–4 ప్రమాణాల నుంచి 2020 నాటికి ఏకంగా బీఎస్–6 ప్రమాణాలను అందుకోవాలని కేంద్రం ఇంతకుముందు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ముసాయిదాపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను డిసెంబర్ 20లోగా తెలియజేయాలని కేంద్రం సూచించింది. -
జోరందుకున్న రిజిస్ట్రేషన్లు
చంద్రశేఖర్కాలనీ : జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయం లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. గతనెల 30వ తేదీ నుంచి ఈనెల 17 వరకు అంటే దాదాపు ఇరవై రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తెలంగాణ పది జిల్లాలో ఎక్కడా కూడా జరగలేదు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు స్టేట్(టీఎస్) సిరీస్ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్ర శివారులోని నాగారం వద్ద గల జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో బుధవారం నుంచి అన్నిరకాల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు టీఎస్ 16 సిరీస్పై చేయడం అధికారులు ఆరంభించారు. బుధవారం 45 వాహనాల రిజిస్ట్రేషన్లు కాగా, గురువారం 157 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగా యి. దాదాపు 20 రోజుల నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో జిల్లాలో దాదాపు 1,500 వరకు ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాల వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా గురువారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా ఉప రవాణా కార్యాలయం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్దారులతో కిటకిటలాడింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొత్త వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను ఆర్టీఏ సిబ్బంది స్వీకరించా రు. భోజన విరామ సమయాన్ని ఉపయోగించుకోకుండా సాయంత్రం 4 గంటల వరకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తుల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. శుక్రవారం పెద్దమొత్తంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. తిరిగి సోమవారం నుంచి వారం లోగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లన్నింటిని పూర్తి చేసేవిధంగా డీటీసీ రాజారత్నం చర్యలు చేపట్టారు.