breaking news
Recruitment of teachers
-
9న టీచర్ నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు. ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. -
Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది. ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ఉండేవారు. -
గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీకి సిద్ధం
అధికారులతో డిప్యూటీ సీఎం కడియం సమీక్ష సాక్షి, హైదరాబాద్: వివిధ గురుకులాల్లో ఉన్న ఖాళీ పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేయనున్న మైనా రిటీ గురుకులాల్లో 630 పోస్టులు కలుపుకుని మొత్తం 2,444 పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. బుధవారం సచివాలయంలో డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. ఈ పోస్టుల భర్తీ, నియామక నిబంధనలు, ఇతర అంశాలపై ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. ఈ పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. టీచర్ల రిక్రూట్మెంట్ తదితర అంశాలకు సంబంధించి ఆయా గురుకులాల్లో అనుసరిస్తున్న విధివిధానాల గురించి కడియం పరిశీలించారు. గురువారం మరోసారి సమావేశమై ఈ పోస్టుల భర్తీపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ డా.ఘంటా చక్రపాణి, మైనార్టీశాఖ ముఖ్యకార్యదర్శి ఒమర్ జలీల్, ఏసీబీ డీజీ ఏకేఖాన్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, ప్రభుత్వ(జనర ల్) గురుకులాల కార్యదర్శి శేషుకుమారి పాల్గొన్నారు.