-
ఫిష్ మాసాలాలో పురుగుమందులు? సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సీరియస్
ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో అనేక రకాల మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాలను విక్రయించే ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలో పరిమితికి మించి పురుగుమందులు ఉన్నట్లు గుర్తించింది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీంతో షిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నిన్న (ఏప్రిల్ 18న) ఒక ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ రీకాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మానవ వినియోగానికి పనికిరాని స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను ఉన్నట్లు గుర్తించినట్టు ఏజెన్సీ పేర్కొంది. “ఇంప్లికేట్ చేయబడిన ఉత్పత్తులు సింగపూర్లోకి దిగుమతి అయినందున, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఉత్పత్తులను రీకాల్ చేయమని దిగుమతిదారు, ముత్తయ్య & సన్స్ని ఆదేశించింది. విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం) వ్యవసాయ ఉత్పత్తులో ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం, ఆహారంలో పురుగుమందు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదమని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. ఈ మసాలా ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యంపై ఆందోళనలున్నవారు వైద్య సలహాను పొందాలనీ, ఇతర సమాచారం నిమిత్తం వారి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ ఉదంతంపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయ లేదు. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) -
ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్.. 3 లక్షల యూనిట్లు రీకాల్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారు సంస్థ యమహా ( Yamaha ) తమ కస్టమర్లకు అత్యవసర సమాచారం ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్య కాలంలో తయారు చేసిన దాదాపు 3 లక్షల యూనిట్ల 125cc స్కూటర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్కూటర్లు ఇవే.. కంపెనీ వెల్లడించిన ప్రకారం.. ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (2022 జనవరి తరువాతి మోడల్స్) ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో ఉన్న సమస్యను పరిష్కరించడమే రీకాల్ లక్ష్యంగా యమహా చెబుతోంది. ఉచితంగానే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ పార్ట్ కస్టమర్కు ఉచితంగా అందించనున్నట్లు యమహా కంపెనీ వెల్లడించింది. రీకాల్ కోసం అర్హతను ధ్రువీకరించడానికి కస్టమర్లు ఇండియా యమహా మోటర్ వెబ్సైట్లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్లోని 'SC 125 వాలంటరీ రీకాల్'ని క్లిక్ చేయాలి. ఇక్కడ బండి ఛాసిస్ నంబర్, వివరాలు నమోదు చేస్తే తదుపరి దశలు వస్తాయి. యమహా 2023 కొత్త 125 cc హైబ్రిడ్ స్కూటర్ శ్రేణి BS-VI OBD2 & E-20 ఫ్యూయల్ కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజన్తో 8.2 PS @ 6,500 RPM పవర్ అవుట్పుట్, 10.3 NM @ 5,000 RPM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. యమహా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధితో ఈ 125 Fi హైబ్రిడ్ ఇంజన్ తయారు చేశారు. -
మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా 11,177 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్లలో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టు ఎనిమిది నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల పనితీరు దెబ్బ తింటుందని మారుతి తెలిపింది. గత ఆగస్టు – నవంబర్ మధ్య తయారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్ల ద్వారా సమాచారం అందుతుందని తెలిపింది. దెబ్బ తిన్న విడి భాగాలను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామని మారుతి ప్రకటించింది. కాగా ఎయిర్బ్యాగ్ లోపం కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. -
17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్.. కారణం ఇదే!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 17,362 యూనిట్లు రీకాల్ చేస్తోంది. వీటిలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో కె10, ఎస్–ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బలేనో, గ్రాండ్ వితారా ఉన్నాయి. ఈ కార్లలో ఎయిర్బ్యాగ్ కంట్రోలర్ తనిఖీ చేసి లోపాలు ఉంటే ఉచితంగా మార్పిడి చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతీ సుజుకీ అధీకృత వర్క్షాప్స్ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్,రీకాల్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement