breaking news
Real trader
-
టెలిగ్రామ్, వాట్సప్లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే!
ముంబై: రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలో ఎలాంటి పెట్టుబడులు పెట్టొందంటూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘టెలిగ్రామ్, వాట్సప్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలు మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టి మోసపోద్దు. ఈ సంస్థలకు ఎక్స్చేంజ్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో గత నెలలో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ను సైతం ఎక్స్చేంజ్ నిషేధించింది. ఇది చదవండి: కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! భారత్లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి -
రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
-
రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
హైదరాబాద్: నగరంలో మరోసారి తుపాకి కలకలం రేపింది. అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ సమీపంలో కిశోర్కుమార్ అనే రియల్ వ్యాపారిని శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన చర్యతో భయబ్రాంతులకు గురైన కిషోర్కుమార్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనపై బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమీర్ పేటలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.