breaking news
	
		
	
  Rayalaseema tour
- 
      
                    'బాబు పర్యటనను అడ్డుకుంటాం'
 అనంతపురం: అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్న మాటను నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
 బాబు పర్యటనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు జాతీయరహదారిపై ధర్నా చేశారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నా బాబు మాత్రం తాబేలుగా నత్తనడకన వ్యవహరిస్తున్నారని అన్నారు.
- 
      
                   
                                 నేటి నుంచి లోకేశ్ రాయలసీమ పర్యటన
 సాక్షి,హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ మీడియా కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించి వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొంది.


