-
ఇక ట్రాకింగ్, ఎమర్జెన్సీ బటన్లు తప్పనిసరి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి రిజిస్టర్ అయ్యే అన్ని కొత్త ప్రజా రవాణా వాహనాల్లోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, ఎమర్జెన్సీ బటన్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆటోలు, ఈ–రిక్షాలకు నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నామనీ, ఇవి కాకుండా మిగిలిన ప్రజా రవాణా వాహనాలన్నింటికీ 2019 జనవరి 1 నుంచే కొత్త నిబంధన అమలవుతుందని వెల్లడించింది. క్యాబ్ల వంటి వాహనాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రయాణికులు అధికారులకు తెలియజేసేందుకు ఎమర్జెన్సీ బటన్ ఉపయోగపడుతుంది. ఆ వాహనం ఎక్కడుందో గుర్తించేందుకు లొకేషన్ ట్రాకింగ్ పరికరం దోహదపడుతుంది. -
బస్సుల్లో జీపీఎస్ను వాళ్లే అమర్చాలి
న్యూఢిల్లీ: ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణికులకు భద్రతగా, ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వాహనాల్లో జీపీఎస్ పరికరాన్ని వాహన తయారుదారు లేదా డీలర్ ఇన్ స్టాల్ చేయాలని రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది. అలర్ట్ బటన్, సీసీటీవీ నిఘా వ్యవస్థను కూడా అమర్చాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. సీటింగ్ కెపాసిటీ 23 కంటే ఎక్కువ ఉన్న వాహనాలు ఈ మూడు ఫీచర్లు కలిగి ఉండాలని, 23 కంటే తక్కువ ఉన్న వాహనాల్లో కూడా కచ్చితంగా వాహన ట్రాకింగ్ పరికరాలు, ఎమర్జెన్సీ బటన్ ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపింది. 2014 జనవరిలోనే నిర్భయ ఫండ్, మొదటి ప్రాజెక్టు కింద 32 నగరాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్ లు, జీపీఎస్ పరికరాలు అమర్చాలన్న నిబంధనలకు యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఆ ప్రాజెక్టు సక్రమంగా అమలుకాలేదు. 2012 డిసెంబర్లో నిర్భయ ఘటన అనంతరం నిర్భయ ఫండ్ను గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పబ్లిక్ వాహనాల రూట్లు తెలుసుకోవడం, ఆయా మార్గాలలో వాహనాలను ట్రాక్ చేయడం, ఎమర్జెన్సీ సమయంలో పానిక్ బటన్ ద్వారా పోలీసులను అప్రమత్త చేయడం లాంటివి ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement