breaking news
produces
-
ఏఐ.. నమ్మించి, నట్టేట ముంచుతోందిలా..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ చాట్బాట్లు తప్పుదారి పట్టించే సమాచారాన్ని అధికారిక రూపంలో వెల్లడిస్తున్నాయన్నారు. ఏఐలోని ఈ అంతర్గత లోపాలను సరిదిద్దకపోతే అవి వినియోగదారుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏఐ శిక్షణ పొందిన తన డేటాలోని నమూనాల ఆధారంగా తదుపరి పరిణామాలను అంచనా వేసి, ఫలితాలను అందిస్తుంది. అయితే ఈ క్రమంలో పలు తప్పిదాలు దొర్లుతుంటాయి.కల్పిత అవుట్పుట్లు: కృత్రిమ మేథ(ఏఐ) దాని వినియోగదారునికి నమ్మకం కల్పిందేందుకు కల్పిత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది.తప్పులను ఒప్పులుగా: ఏఐ తనలోని లోపాన్ని అంగీకరించే బదులు.. తప్పులను కూడా నమ్మించేలా చేస్తుంది.అస్పష్టమైన ప్రాంప్ట్లు: వినియోగదారు అడిగిన ప్రశ్నపై స్పష్టత లేనప్పుడు, ఏఐ ఆ అనిశ్చితిని అంగీకరించకుండా, ఏదో ఒక సమాధానాన్ని ఊహించి ఇస్తుంది.ఇటువంటి సమస్యలు ఉద్దేశపూర్వక అబద్ధాలు కావని, ఏఐ చాట్బాల్లోని నిర్మాణాత్మక లోపాలని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు.ఇటీవలి ఏఐ తప్పిదాలుగూగుల్ జెమిని(2025): ఈ ఏఐ మోడల్ యూఎస్ వ్యవస్థాపక పితామహుల చిత్రాలను వారి జాతిపరంగా తప్పుగా రూపొందించింది. ఇది పక్షపాత ధోరణితో చేసినదంటూ చర్చకు తావిచ్చింది.చాట్ జీపీటీ లీగల్ కేసు (2023–2024): న్యూయార్క్లోని న్యాయవాదులు చాట్బాట్ను నమ్మి.. అది అందించిన ఉనికిలో లేని కోర్టు కేసులను తమ న్యాయ పత్రాలలో పాటు సమర్పించారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, సదరు న్యాయవాదులపై ఆంక్షలు విధించింది.మైక్రోసాఫ్ట్ కాపీలాట్(2024): ప్రత్యక్ష పరిశోధనకు కనెక్ట్ కాని సందర్భాలలో పాత ఆర్థిక డేటాను తయారు చేసింది. ఇది ఆర్థిక విశ్వసనీయతపై ఆందోళనలను పెంచింది.మెటా ఏఐ అసిస్టెంట్లు (2024): తప్పుడు కెరీర్ విజయాలతో ప్రముఖుల గురించి కల్పిత జీవిత చరిత్రలను సృష్టించాయి. తద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించాయి.ఈ విధమైన సమస్యల ను పరిష్కరించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. గూగుల్ తన జెమినిని మెరుగుపరుస్తోంది. అలాగే ఓపెన్ ఏఐ.. కల్పిత సూచనలను తగ్గించేందుకు సైటేషన్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ రియల్-టైమ్ సెర్చ్ ఇంటిగ్రేషన్ను మెరుగుపరుస్తోంది. పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వ్యవస్థలను రూపొందించేందుకు ఏఐ కంపెనీలు కృషి చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి.. -
ఎకో గృహంతో ఎంతో మేలు...!
టిమ్ విల్కాక్స్, అతని భార్య మార్గరెట్ లు నిర్మించిన ఆ భవనం... ఇప్పుడో చిన్న పవర్ స్లేషన్ ను తలపిస్తోంది. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తో కూడిన, సూపర్ ఇన్సెలేటెడ్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. కరెంటు, వాటర్ బిల్లుల ఖర్చును తగ్గించడమే కాక, పర్యావరణ అనుకూలమైన ఆ భవనం.. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచిపెడుతోంది. రిటైర్డ్ అకౌంటెంట్ అయిన 66 ఏళ్ళ విల్కాక్స్... స్వీడన్ లోని హౌస్ బిల్డర్ల ద్వారా తెలుసుకున్న ఆలోచనను తన ఇంటికి అమలు చేశారు. అరవైశాతం వాటర్ బిల్ తగ్గించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తో పాటు... సూపర్ ఇన్సులేటెడ్ హౌస్ నిర్మాణానికి విల్కాక్స్ దంపతులు సుమారు 500,000 యూరోలు ఖర్చు చేశారు. ఇంటి నిర్మాణంలో వెంటిలేషన్ కూడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో.. చెడు గాలిని బయటకు పంపి, శుభ్రమైన గాలిని లోపలకు తెచ్చే అవకాశం కూడ ఉంది. శీతాకాలంలో హీటర్లతో వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా నిర్మించిన ఆ భవనం... నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం కూడ పాలుపంచుకుంది. ఎకో గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 1,500 యూరోలను నేషనల్ గ్రిడ్ అందించింది. ఆ భార్యాభర్తలు నిర్మించిన పర్యావరణ అనుకూల గృహం..ఇప్పుడు ఆ ఇంటికంతకీ విద్యుత్తును అందించే ఓ చిన్న పవర్ స్టేషన్ గా మారింది. ఆ ఇంట్లో రెండు రకాల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సోలార్ పవర్ తో పాటు, ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ళద్వారా వేడినీళ్ళతో విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. గతేడాది మొత్తం పన్నెండు నెలల్లో ఉత్పత్తిచేసిన 706.40 యూరోల విద్యుత్తునుంచి ఈ దంపతులు 292.87 యూరోల గ్యాస్, 413.53 యూరోల విద్యుత్తు వినియోగించుకున్నారు. మిగిలిన విద్యుత్తును సప్లై చేయడం ద్వారా నేషనల్ గ్రిడ్ అధికారులనుంచి 147 యూరోలను కూడ అందుకోగలిగారు. అంతేకాదు.. వీరికి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా పోయింది. ఈ ఎకో హౌస్ లోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా ఐదు వేల లీటర్ల ట్యాంక్ నిండుతుంటుంది. ఈ నీటిని వీరు టాయిలెట్లలో ఫ్లషింగ్ కు వాడుతున్నారు. దీంతో వాటర్ బిల్లులు కూడ 60 శాతం తగ్గిపోయాయి. సూపర్ ఇన్సులేట్ గోడలు, పైకప్పుతోపాటు, పది అంగుళాల మందపాటి పాలీస్టైరిన్ ప్యానెళ్ళు ఉపయోగించి ఈ పర్యావరణ గృహాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో వెంటిలేషన్ ద్వారా పాతగాలి బయటకు పంపి, కొత్త.. శుభ్రమైన గాలిని లోపలికి తెచ్చే ఓ ప్రసరణ వ్యవస్థ కూడ ఉంది. ఇకపై గృహ నిర్మాణాలు ఇదే పద్ధతిలో కొనసాగితే.. కొత్తగా విద్యుత్ కేంద్రాల స్థాపనే అవసరం ఉండదని విల్కాక్స్ అంటున్నారు. ట్రాంక్విల్లిటీలుగా పిలిచే ఈ గృహాల నిర్మాణానికి రెండేళ్ళ సమయం పడుతుంది. ఈ నిర్మాణం పూర్తయ్యే సరికి 520.000 యూరోలు ఖర్చయినా... ఇప్పుడు ఈ గృహం ఖరీదు 800.000 యూరోలు విలువ చేస్తోంది. ఏ రకంగా చూసినా ఈ ఎకో హోమ్ వల్ల లాభమే ఉంటుందని విల్కాక్స్ అంటున్నారు. అంతేకాక డబ్బు కూడ పొదుపు అవుతుందని చెప్తున్నారు.


