breaking news
Processor
-
విక్రమ్... ఒక గేమ్ ఛేంజర్
భారతదేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 32 బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ ప్రత్యేకత ఏమిటి? రేపటి తరం ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లను నడి పేంత శక్తిమంతమైంది కాకపోవచ్చు కానీ... భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రం కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా సెమికాన్ ’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న విక్రమ్ 3201 ప్రాసెసర్దే ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ , గగన్ యాన్ యాత్రల ఎలక్ట్రానిక్స్లో ముఖ్య భూమిక. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిజైన్ చేయగా మొహాలీలోని సెమీకండక్టర్ లేబొరేటరీ తయారు చేసిన ఈ ప్రాసెసర్కు భారతదేశం గర్వించగదగ్గ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి పేరు పెట్టారు. గతేడాది డిసెంబరులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–60లో విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. 2009 నుంచి ఉపయోగిస్తున్న విక్రమ్ 1601 ప్రాసెసర్ స్థానంలో ఇకపై విక్రమ్ 3201ను ఉపయోగిస్తారు.పోటీ పడలేనప్పటికీ...ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో ఉపయోగిస్తున్న ప్రాసెసర్లతో పోల్చి చూస్తే విక్రమ్ 3201 గొప్ప శక్తిమంతమైందేమీ కాదు. సాంకేతిక పరి జ్ఞానం విషయంలోనూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలోని ప్రాసెసర్లతో సరితూగేది కాదు. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల్లో 64 బిట్ ప్రాసె సర్లు ఉపయోగిస్తూండగా విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ మాత్రమే.కొంచెం సింపుల్గా చెప్పాలంటే 32 బిట్ ప్రాసెసర్తో నాలుగు గిగాబైట్ల ర్యామ్తో పనిచేయగలం. అదే 64 బిట్ ప్రాసెసర్తోనైతే 8 గిగాబైట్లు, అవసరమైతే 16 గిగాబైట్ల ర్యామ్తోనూ పనిచేయించవచ్చు. అంటే, 64 బిట్ ప్రాసెసర్తో చేయగలిగిన పనులన్నీ 32 బిట్ ప్రాసెసర్తో చేయడం కష్టమన్నమాట. అంతేకాదు... విక్రమ్ 3201ను 180 నానోమీటర్ల సైజున్న ట్రాన్సిస్టర్లతో తయారు చేశారు. ఆధునిక మైక్రోప్రాసెసర్లలోని ట్రాన్సిస్టర్ల సైజు ప్రస్తుతం మూడు నానోమీటర్లు! సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్లో ఎక్కువ ట్రాన్సి స్టర్లు పడతాయి. తద్వారా వాటి వేగం, సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ రకంగా చూస్తే విక్రమ్ 3201 ఎప్పుడో 1990ల నుంచి 2000 సంవత్సరం వరకూ అందుబాటులో ఉన్న ప్రాసెసర్ల స్థాయిది.ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎలెవన్ ్త జనరేషన్ కూడా పది నానో మీటర్ల ట్రాన్సిస్టర్లతో తయారైందన్నది గమనార్హం. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్ సైజు తగ్గి... చిన్న చిన్న పరికరాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నింటికీ తట్టుకునేలా...అయితే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లతో పోలిస్తే అంతరిక్షంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ తీరుతెన్నులు భిన్నం. అవి అంతరిక్షంలోని కఠిన పరిస్థితులను తట్టుకుని పనిచేయాలి. అక్కడ ఉష్ణో గ్రతల్లో విపరీతమైన మార్పులుంటాయి. భూ కక్ష్యలో తిరుగు తున్నప్పుడు సూర్యాభిముఖంగా ఉన్నప్పుడు ఉపగ్రహాలు 125 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకో వైపు ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు–55 డిగ్రీ సెల్సియస్కు పడిపోతాయి. రేడియోధార్మికత కూడా ఎక్కువ. పైగా ప్రయోగ సమయంలో పుట్టే ఎలక్ట్రిక్ ప్రకంపనలు, ధ్వని తాలూకూ షాక్లను తట్టుకుని మరీ పనిచేయాల్సి ఉంటుంది. భూ వాతావరణ పొర తాలూకూ రక్షణ ఉండదు కాబట్టి సౌరగాలులు, అత్యంత శక్తిమంతమైన కణాలతో కూడిన కాస్మిక్ రేస్ వంటివన్నీ నిత్యం ప్రాసెసర్లకు పరీక్ష పెడుతూంటాయి. ప్రాసెసర్లలో సమాచారం ‘1’, ‘0’ల రూపంలోనే నిక్షిప్త మవుతూ ఉంటుంది. ట్రాన్సిస్టర్ల గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’, ప్రవహించకపోతే ‘0’ అన్నమాట. ఖగోళం నుంచి దూసుకొచ్చే శక్తి మంతమైన కణాలు ట్రాన్సిసర్టలపై ప్రభావం చూపితే సమాచారం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఆధునిక మైక్రో ప్రాసెసర్లలో ఇలా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉండటం, విద్యుదావేశాన్ని నిలిపి ఉంచుకోవడం దీనికి కారణాలు. విక్రమ్ 3201లో 180 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లు ఉండటం వల్ల ఈ తప్పులు జరగవు.వేగం కంటే అవసరాలే ముఖ్యం...పీఎస్ఎల్వీ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో టెలిమెట్రీ, నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి నమ్మకంగా పనిచేయాలి. ఈ అవసరాలతో పోలిస్తే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలోని ప్రాసెసర్ల గిగాబైట్ల వేగం అంత ముఖ్యం కాదు. అత్యంత దుర్భర పరిస్థితు లను తట్టుకుని, అతితక్కువ తప్పులు, వైఫల్యాలతో పనిచేసేలా విక్రమ్ 3201ను తయారు చేశారు. అంతరిక్ష రంగంలో స్వావలంబన అన్న భారతదేశ ఆశలు నెరవేర్చడంలో విక్రమ్ 3201 మేలి మలుపు కాగలదనడంలో సందేహం లేదు. 2009లో కార్టోశాట్ ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఉపయోగించిన పీఎస్ఎల్వీ సీ–47లో విక్రమ్ 1601ను ఉపయోగించగా... ఫ్లోటింగ్ పాయింట్ కాలిక్యులేషన్ వంటి ఆధునిక హంగులు, అడా వంటి ఆధునిక కంప్యూటర్ భాషలతో పనిచేయగల సామర్థ్యాన్ని అందించి విక్రమ్ 3201ను తయారు చేశారు. దీన్ని విజయవంతంగా పరీక్షించిన నేప థ్యంలో ఇస్రో ఇప్పటికే 70 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కొత్త మైక్రో ప్రాసెసర్ తయారీ యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. విక్రమ్ 1601 ప్రాసెసర్ వినియోగం కేవలం అంతరిక్షానికి మాత్రమే పరిమితం కాలేదు. రైల్వే వ్యవస్థల్లోనూ వినియోగి స్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆటోమెటిక్ ట్రెయిన్ సూపర్విజన్స్ వంటి వాటిల్లో. ఇదే విధంగా విక్రమ్ 3201ను కూడా ఇతర రంగాల్లో వాడే అవకాశం ఉంది. విక్రమ్ 1601కు ముందు దేశం ప్రాసెసర్ల దిగుమతిపైనే ఎక్కువగా ఆధార పడి ఉండేది. తద్వారా సరఫరా, నియంత్రణలు, భద్రతాంశాల విషయంలో సవాళ్లు ఎదుర్కొనేది. 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల తరువాత అమెరికా విధించిన ఆంక్షలతో స్వావలంబన అవసరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఈ సవాలును స్వీకరించిన శాస్త్రవేత్తలు విక్రమ్ 3201తో తొలి అడుగు వేశారని చెప్పాలి. అంత రిక్ష రంగంలో సాంకేతిక పరిజ్ఞానపరంగా ‘ఆత్మ నిర్భరత’ సాధించే విషయంలో ఇది నిజంగానే మేలిమలుపు!టి.వి. వెంకటేశ్వరన్ వ్యాసకర్త మొహాలీలోని ‘ఐసర్’ విజిటింగ్ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు. -
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ను లాంచ్ చేసిన ఇంటెల్..!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెస్క్టాప్( 12 జెన్ i9-12900KS) ప్రాసెసర్ను లాంచ్ చేసింది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ ఏకంగా 5.5GHz ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఈ ప్రాసెసర్ మునుపటి i9 చిప్సెట్లకు కొనసాగింపుగా రానుంది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ప్రాసెసర్ ఇంటెల్ థర్మల్ వెలాసిటీ బూస్ట్తో గరిష్టంగా 5.5 GHz వరకు టర్బో ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం ఇంటెల్ అడాప్టివ్ బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. 30MB ఇంటెల్ స్మార్ట్ కాచీతో పాటు మొత్తం 16 కోర్స్, 24 థ్రెడ్స్ను కల్గి ఉంది. 150W ప్రాసెసర్ బేస్ పవర్, PCle Gen 5.0 అండ్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. DDR5 4800 MT/s వరకు మరియు DDR4 3200 MT/s మద్దతును అందిస్తోంది. Intel కోర్ i9-12900KS ఇప్పటికే ఉన్న Z690 మదర్బోర్డులకు అనుకూలంగా ఉండనుంది. ధర ఏంతంటే...? ఇంటెల్ తన కొత్త i9-12900K ప్రాసెసర్ను ఏప్రిల్ 5, 2022 నుంచి అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాసెసర్ ధర 739 డాలర్లు(సుమారు రూ. 55,937)గా ఉంది. ఈ ప్రాసెసర్ను ప్రపంచవ్యాప్తంగా అన్ని రిటైలర్ల వద్ద బాక్స్డ్ ప్రాసెసర్గా కనుగొనవచ్చు. చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా -
2021లో రానున్న ఆపిల్ ఎమ్2 ప్రాసెసర్
ఆపిల్ కంపెనీ ఇటీవలే సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్తో మూడు మ్యాక్ కంప్యూటర్లను విడుదల చేసింది. దీంతో సంప్రదాయ ఇంటెల్ ప్రాసెసర్లకు స్వస్తి పలికింది. ఆపిల్ కంపెనీ మాక్ కోసం కొత్తగా సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్ లను రూపొందించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 2021లో రాబోయే కొత్త 13-అంగుళాల మ్యాక్బుక్ ప్రో,16-అంగుళాల మాక్బుక్ ప్రోలో సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎమ్1 ప్రాసెసర్తో వచ్చిన కొత్త ల్యాప్టాప్లు పనితీరు, బ్యాటరీ విషయంలో ఇతర ల్యాప్టాప్ల కంటే మెరుగైన పనితీరును ప్రదర్శించాయి అని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంస్థ త్వరలో కొత్త మాక్బుక్ మరియు ఐమాక్ పరికరాలలో కొత్త ఆపిల్ సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆపిల్ 2021లో కొత్త డిజైన్తో మ్యాక్బుక్ ప్రొ మోడల్స్ని విడుదల చేయనుందట. అలానే 2022లో మిని-ఎల్ఈడీ డిస్ప్లేతో మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రొ, మ్యాక్బుక్ ల్యాప్టాప్లను యాపిల్ విడుదల చేస్తుందని సమాచారం. ఎఆర్ఎం ఎమ్1 చిప్ 5నానోమీటర్ పై బిల్డ్ చేయబడింది. కొత్త ఎమ్2 ప్రాసెసర్ ఎమ్1 ప్రాసెసర్ కు కొనసాగింపుగా రాబోతుంది. ఎమ్1 చిప్ లో శక్తివంతమైన 8-కోర్ సీపీయూ ఉంది. ఈ చిప్ మునుపటి తరం ప్రాసెసర్ల కంటే 3.5x వేగంగా మరియు 5x వేగవంతమైన జీపీయు పనితీరును ప్రదర్శిస్తుంది. ఆపిల్ సిలికాన్ ఎం1 చిప్సెట్లు న్యూరల్ ఇంజిన్ వంటి టెక్నాలజీ సహాయంతో రూపొందించబడ్డాయి. -
సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్.. హ్యాకర్లకు చెక్
న్యూయార్క్: గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్ను ఆవిష్కరించింది. ప్లూటన్ పేరుతో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ చిప్ విండోస్ పీసీలకు మరింత భద్రతను చేకూర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ కొత్త సెక్యూరిటీ చిప్ను సిలికాన్ దిగ్గజాలు ఇంటెల్, ఏఎండీ, క్వాల్కామ్ సాంకేతిక సహకారంతో రూపొందించినట్లు తెలియజేసింది. తద్వారా విండోస్ పీసీలలోని నెక్ట్స్ జనరేషన్ హార్డ్వేర్కు మరింత భద్రతను కల్పించనున్నట్లు వివరించింది. సీపీయూలతో.. మైక్రోసాఫ్ట్ ప్లూటన్ను భవిష్యత్ సీపీయూలలో అంతర్గతంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ డేవిడ్ వెస్టన్ తెలియజేశారు. తద్వారా హార్డ్వేర్, క్రిప్టోగ్రాఫిక్స్ భద్రతకు వినియోగించే ట్రస్ట్డ్ ప్లాట్పామ్ మాడ్యూల్(టీపీఎంలు)ను ఈ చిప్ రీప్లేస్ చేయనున్నట్లు వివరించారు. ఈ ఆధునిక సెక్యూరిటీ ప్రాసెసర్(ప్లూటన్) హ్యాకర్ల నుంచి మరింత భద్రతను చేకూరుస్తుందని పేర్కొన్నారు. తద్వారా హ్యాకర్లు ఆపరేటింగ్ సిస్టమ్లో భాగంగా అంతర్గతంగా దాక్కునేందుకు లేదా.. ఫిజికల్ ఎటాక్స్ చేసేందుకు కష్టమవుతుందని తెలియజేశారు. క్రెడిన్షియల్, ఎన్క్రిప్షన్ కీస్ వంటివి చోరీ చేయడాన్ని ఈ చిప్ అరికడుతుందని వివరించారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ బగ్స్నుంచి రికవరీ సాధించేందుకు సైతం తోడ్పడుతుందని పేర్కొన్నారు. వెరసి కమ్యూనికేషన్ చానల్పై దాడి అవకాశాలకు చెక్ పెడుతుందని చెప్పారు. గత పదేళ్లుగా టీపీఎంలు విండోస్కు మద్దతిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో సర్ఫేస్!
ఎంతోకాలం నుంచి త్వరలో విడుదల చేస్తామని చెబుతున్న మైక్రోసాఫ్ట్లో తన కొత్త మోడల్ 'సర్ఫేస్'లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారో తెలిసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో లభ్యం కానుంది. ఇందుకోసం ఎంఎస్ఎం 8998 ఎస్ఓసీ ప్రాసెసర్ను ఆపరేటింగ్ సిస్టంకు తగినట్లుగా సిద్ధం చేసింది. ప్రత్యేకంగా తయారుచేసిన ప్రాసెసర్ను క్వాల్కామ్ త్వరలో మైక్రోసాఫ్ట్కు అందించనున్నట్లు సమాచారం. ఫోర్బ్స్ ప్రచురణ ప్రకారం ఎంఎస్ఎం8998 ప్రాసెసర్ ముందు తరానికి చెందినదిగా, స్నాప్ డ్రాగన్ 830గా పేర్కొంది. శామ్సంగ్ ఫోన్ల తయారీ పద్దతిలో ఉపయోగించే 10ఎన్ఎం తయారీ పద్ధతిని ఇందుకు ఉపయోగించనున్నారు. 8 జీబీ ర్యామ్తో ఉండే ఈ ఫోన్ను మూడు రకాలుగా భిన్నమైన ధరలతో ముందుకు తేనున్నట్లు సమాచారం. విండోస్ 10 ఓఎస్కు జతచేస్తున్న కొత్త ఫీచర్ల కారణంగా విడుదల సమయం పెరుగుతూ వస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ 2017 వరకు ఈ మొబైల్ను అందుబాటులోకి తేలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.