breaking news
Postal ATM
-
టెక్ తపాలా..
పోస్టాఫీసులంటే టక్కున గుర్తువచ్చేవి ఉత్తరాలు, టెలిగ్రామ్లు. కాలం మారింది. దూరాలను దగ్గరగా చేసిన పోస్టల్ శాఖ సాంకేతిక విప్లవంతో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేక ప్రజలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అదే సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వినూత్న పథకాలు, ప్రణాళికలతో ‘దూరం నుంచి దగ్గర’ అవుతోంది. ఇప్పటికే పోస్టల్ ఖాతాలను జాతీయ బ్యాంకుల తరహాలో ఆన్లైన్ చేసింది. ఏటీఎం కార్డులను జారీ చేస్తూ.. ఏటీఎంలను ప్రారంభించిన ఈ శాఖ మరో అడుగు ముందుకేసి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్సు సంస్థల కంటే మిన్నగా ఆర్థిక సేవలను వేగంగా అందిస్తోంది. ప్రజలకు ఆత్మబంధువులా చేరువవుతోంది. మార్కాపురం: టెక్నాలజీ లేని కాలంలో గ్రామీణ ప్రజలకు పోస్టాఫీసులే దిక్కు. ఉత్తరాల దగ్గర నుంచి అత్యవసర సేవల కోసం ప్రజలు వీటినే ఆశ్రయించే వారు. ఉత్తరాలు, ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు, మనియార్డర్లతో ఖాకీ డ్రెస్ వేసుకుని ప్రతి రోజూ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఎందరో ఆశలకు జీవం పోసి ఉత్సాహపరుస్తూ ఆతీ్మయులుగా ఉండేవారు పోస్టుమేన్లు. నేడు పరిస్థితి మారింది. సమాచారాన్ని క్షణాల్లో మన ముందుంచేలా పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే స్థాయిలో పోస్టల్ శాఖ కూడా మారుతూ వచ్చింది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది. అత్యాధునిక సేవలను వినియోగదారులకు అందిస్తూ పోటీ పడుతోంది. సెల్ఫోన్ రాకతో.. సెల్ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ సాంకేతికంగా వస్తున్న మార్పులను ప్రజలకు అందించేందుకు తపాలాశాఖ సిద్ధమైంది. పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాలు కొని డబ్బాలో వేసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. ప్రస్తుతం వాట్సాప్, ట్విట్టర్ ద్వారా సమాచార మారి్పడి చేసుకుంటున్నారు. మనీయార్డర్ల స్థానంలో ఏటీఎంలు, మనీ ట్రాన్స్ఫర్ వంటివి వచ్చాయి. సెల్ఫోన్, ఇంటర్నెట్, ఈ మెయిల్స్ పోటీ తట్టుకోవటంలో వెనుకబడిన తపాలా శాఖ ఇప్పుడిప్పుడే వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల ఆదరణ చూరగొంటోంది. టెక్ సాయంతో ముందడుగు.. ప్రైవేటు సంస్థలు, బ్యాంక్లకు దీటుగా పోస్టాఫీసుల్లో కూడా ఆన్లైన్ సేవలు, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు, పుష్కరాల సమయంలో ఆ ప్రాంత పుష్కరాలను తెలియజేస్తూ కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర జలాల లీటర్, అర్ధ లీటర్ బాటిల్స్ తక్కువ రేటుకు ప్రజలకు అందిస్తూ వారి అభిమానాలను చూరగొంటోంది. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్, ఎల్రక్టానిక్ మనీయార్డర్, మై స్టాంప్ పథకం, స్పీడ్ పోస్టుల సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వివిధ వర్గాల ప్రజలు మళ్లీ పోస్టాఫీసుకెళ్తున్నారు. విదేశాల్లో ఉన్న బంధు మిత్రుల నుంచి క్షణాల్లో నగదు బదిలీ, ప్రైవేటు కొరియర్స్ కంటే ముందుగా వెళ్తున్న స్పీడ్ పోస్టు, వ్యక్తిగతంగా ఫొటోలతో విడుదల చేసే మై స్టాంప్, రికరింగ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పథకాలు ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో అత్యవసరమైన మందులను పోస్టల్శాఖ వారు అందించారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ను పోస్టల్ శాఖ ప్రారంభించింది. పోస్టల్ సిబ్బందికి బయోమెట్రిక్ మిషన్ అందించారు. దీని ద్వారా బ్యాంకు అకౌంట్ ఉంచి ఐపీపీబీలో అకౌంట్ కలిగి ఉంటే పోస్టల్ సిబ్బంది బయోమెట్రిక్ వేయించుకుని రూ.5 నుంచి రూ.10 వేల వరకూ వారే ఇంటికి వచ్చి అందించే సౌకర్యం కల్పించారు. -
తపాలా ఏటీంలు వచ్చేశాయ్..!
తొలుత జిల్లా కేంద్రంలో ప్రారంభం శ్రీకాకుళం అర్బన్: ఇప్పటివరకు ఉత్తరాల బట్వాడా, చిన్నమొత్తాల పొదుపు, బీమా సేవల కే పరిమితమైన తపాలాశాఖ వాణిజ్య బ్యాంకులతో పోటీకి సై అంటోంది. పోస్టల్ ఖాతాదారులకు ఏటీఎం సేవలు అందుబాటులోకి తెచ్చిం ది. రాష్ట్రంలో సుమారు 100 ఏటీఎంలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా తొలుత శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి హెడ్పోస్టాఫీస్ల వద్ద ఏటీఎంలను ఏర్పాటుచేసింది. శ్రీకాకుళం హెడ్పోస్టాఫీసు ఏటీఎంను మంగళవారం ఉదయం 9.30గంటలకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ప్రారంభించనున్నారు. టెక్కలిలో మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి అధికారులు ప్రారంభిస్తారు. నరసన్నపేటలో ఈ నెల 13 నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటికి లభించే ఆదరణను బట్టి ఏటీఎంలను విస్తరింపజేస్తామని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. -
త్వరలో పోస్టల్ ఏటీఎంలు
2015 నాటికి అన్ని ఆఫీసులకు ఆన్లైన్ తపాలా సూపరింటెండెంటు రామారావు మాకవరపాలెం : తపాలాశాఖ ఏటీఎం సౌకర్యం కల్పిస్తోంది. ఆశాఖ అనకాపల్లి డివిజన్ సూపరింటెండెంట్ డి.సి.హెచ్.రామారావు ఈ విషయం తెలిపారు. మండల కేంద్రంలోని పోస్టాఫీసును శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిక్డాలతోపాటు కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015 నాటికి అన్ని గ్రామీణ పోస్టాఫీసులను ఆన్లైన్కు ప్రతిపాదించామన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో త్వరలో ఏటీఎం ఏర్పాటు చేస్తామన్నారు. తన పరిధిలోని 47 పోస్టాఫీసుల్లో కొత్త వాతావరణం కోసం చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి కూలీలు, పెన్షన్దారులకు చెల్లింపులకు అనకాపల్లి డివిజన్ పరిధిలో 392 మంది సీఎస్పీలు అవసరమన్నారు. ప్రస్తుతం 288 మంది ఉన్నారని తెలిపారు. త్వరలో మరో 35 మంది నియామకానికి వచ్చే నెల 2న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు. లబ్ధిదారుల నుంచి కాకుండా స్థానిక పెద్దల నుంచి ఫిర్యాదులొస్తున్నందున సీఎస్పీలపై విచారణకు అవకాశం లేదన్నారు. తక్కువ ఖర్చుతో సేవలు ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు లక్ష్యంగా తమ శాఖ పని చేస్తున్నదన్నారు. ఇప్పటికే లాజిస్టిక్ పేరుతో పార్శిల్ సర్వీసును ప్రారంభించామన్నారు. మై స్టాంప్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రూ. 300 చెల్లిస్తే వారి ఫొటోతో స్టాంప్ను అందజేస్తామన్నారు. ఆ స్టాంపులను అతికించుకుని ఎక్కడికైనా వారు గ్రీటింగ్స్, ఇతర ఆహ్వాన పత్రికలు పంపిచుకోవచ్చన్నారు. తక్కువ కమిషన్తో ఇన్స్టెంట్ మనీయార్డర్(ఐఎంవో), మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ స్కీము (ఎంఎంటిఎస్) సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం విద్యుత్ బిల్లులు కట్టించుకుంటున్నామని, త్వరలో ఫోన్ బిల్లులు, పాస్ పోర్టులకు దరఖాస్తులను స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.