breaking news
Physical education teacher
-
కలిసి తిన్నారని కాలితో తన్నిన సారు..
సాక్షి, అర్ధవీడు: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఈటీ ఇద్దరు విద్యార్థుల పట్ల శుక్రవారం కర్కోటకంగా మారాడు. చేయని నేరానికి వారిని చితక బాదడంతో పాటు కులం పేరుతో దూషించాడు. బాధిత విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి జరిగిన అవమానాన్ని పోలీసుల ఎదుట చెప్పుకుని భోరున విలపించారు. వ్యాయామోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ఎనిబెర తేజస్సు (9వ తరగతి), పవన్ (8వ తరగతి)లు ఒకే ప్లేటులో భోజనం తింటున్నారు. పీఈటీ, వసతి గృహం కేర్టేకర్గా ఉన్న వినయ్కుమార్రెడ్డి విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఒకే ప్లేటులో తింటున్నారు.. ప్లేట్లు ఏమయ్యాయంటూ కాలితో అన్నం ప్లేటును తన్నాడు. అంతటితో ఊరుకోకుండా కర్రతో చితకబాదాడు. చివరకు ఒక అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించాడు. కర్రతో చితక బాదడంతో విద్యార్థుల పొట్ట, వీపుపై వాతలు పడ్డాయి. నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లిన విద్యార్థులు బాధిత విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ పీఈటీ వినయ్కుమార్రెడ్డి అన్నం ప్లేటు తన్ని కర్రతో చితకబాది కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సెలవులో ఉండటంతో విద్యార్థుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక ఎస్హెచ్ఓపై బాధిత విద్యార్థుల బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో వర్గపోరు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య వర్గపోరు ఉంది. నిత్యం తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చితకబాదిన వ్యాయామోపాధ్యాయుడు గతంలో తన కారును విద్యార్థులతో కడిగించడం వివాదాస్పదమైంది. పలు కుల సంఘాల నాయకులు ఎస్సీ కమిషన్కు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీశ్వరి సైతం విచారించి పీఈటీపై చర్యలకు ఆదేశించారు. అయినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిత్యం విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నాడని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ వనపాల్రెడ్డిని వివరణ కోరగా పీఈటీ వినయ్కుమార్రెడ్డి విద్యార్థులను తీవ్రంగా కొట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు పోలీసుస్టేషన్కు వెళ్లడంతో సర్ది చెప్పి వారిని వెనక్కి పిలిపించామని వివరించారు. పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ కొండల్రావును వివరణ కోరగా విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, చిన్న పిల్లలు కావడంతో వెనక్కు పంపించామని తెలిపారు. -
కీచక టీచర్
ఏలూరు నడిబొడ్డున గల హాస్టల్లో ఓ విద్యార్థినిపై నైట్ వాచ్మన్ అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన విషయం మరువక ముందే గిరిజన ప్రాంతంలో అలాంటి అకృత్యమే వెలుగు చూసింది. వ్యాయూమ విద్య నేర్పించాల్సిన గురువే అన్నెంపున్నెం ఎరుగని విద్యార్థినిపై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను చెరబట్టి గర్భవతిని చేశాడు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయమచ్చ తెచ్చాడు. విద్యార్థులకు ఏఎన్ఎం నెలవారీ పరీక్షలు నిర్వహించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి రాగా, ఆ ఉపాధ్యాయుడు పలాయనం చిత్తగించాడు. బుట్టాయగూడెం, న్యూస్లైన్ : బుట్టాయగూడెం మండలం నూ తిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో వ్యాయూమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుంజా సోమరాజు కన్నేశాడు. ఉపాధ్యాయులంతా సమైక్యాంధ్ర ఉద్య మం కోసం సామూహిక సెలవులు పెట్టగా, సోమరాజు మాత్రం యథావిధిగా విధులకు హాజరయ్యూడు. ఓ రోజు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆశ్రమ పాఠశాలలోని స్టోర్ రూమ్కు తీసుకెళ్లాడు. వ్యాయూమం అంటూ అన్నెంపున్నెం ఎరుగని ఆ మైనర్ బాలికపై కీచకపర్వానికి తెగబడ్డాడు. మండలంలోని అచ్చియ్యపాలెంకు చెందిన ఆ బాలిక రోజూ ఇంటినుంచి పాఠశాలకు వెళ్లొచ్చేది. తనకేం జరిగిందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఆ బాలిక ఉండగా, నెలనెలా ఆశ్రమ పాఠశాల లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఏఎన్ఎం ఈనెల 12న అక్కడకు వెళ్లింది. అందరితోపాటు ఆ బాలికను కూడా పరీక్షించింది. బాలిక గర్భం ధరించినట్టు గుర్తించింది. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిoచగా, ఆమెకు 4నెలల 14 రోజులు నిండాయ ని వైద్యులు తేల్చారు. ఏఎన్ఎం ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.రంగరాజు దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయగా, వ్యాయామ ఉపాధ్యాయుడే ఇందుకు కారణమని తేలింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో అధికారులు రంగంలోకి దిగి మంగళవారం విచారణ చేపట్టా రు. తహసిల్దార్ ఎన్.నరసింహమూర్తి, బుట్టాయగూడెం ఏటీడబ్ల్యూవో విజయశాంతి, డీవైఈవో తిరుమలదాసు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని ఏఎన్ఎంను, ఉపాధ్యాయులను, విద్యార్థులను విచారణ జరి పారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. ఇదిలావుండగా ఈ ఘటనపై మంగళవారం సాయంత్రం విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ మురళీరామకృష్ణారావు ఇక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. పరారీలో ఉపాధ్యాయుడు బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసి వ్యాయూమ ఉపాధ్యాయుడు కుంజా సోమరాజు వారం రోజుల క్రితమే పరారయ్యూడని తెలిసింది. ఈనెల 12వ తేదీనే ఈ అఘారుుత్యం బయటపడినా.. ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు ఈ విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం చర్చనీయూంశమైంది. బుట్టాయగూడెం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన సోమరాజు రెండేళ్ల క్రితం డీఎస్సీ ద్వారా వ్యాయూమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యూడు. అప్పటినుంచి నూతిరామన్నపాలెం ఆశ్రమ పాఠశాలలోనే పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో బాలురకు మాత్రమే హాస్టల్ వసతి ఉండగా, ఇందులో చదివే బాలికలంతా రోజూ ఇంటినుంచే పాఠశాలకు వస్తుంటారు. నిందితుడి భార్య ఆత్మహత్యాయత్నం! నిందితుడు సోమరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన భర్త ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలిసి అతని భార్య పోల వరం మండలం ఇటటికలకోటలోని తన పుట్టింట్లో పురుగుమందు తాగి నట్లు ఇక్కడకు సమాచారం అందింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. విద్యార్థుల ధర్నా కీచకపర్వానికి ఒడిగట్టున వ్యాయూమ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు ఆశ్రమ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. నిందితుణ్ణి తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు భాస్కర్, పీడీఎస్యూ నాయకుడు ఎస్.రామ్మోహన్ డిమాండ్ చేశారు.