breaking news
Petrol price decrease
-
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
ఈ నెలలో రెండవసారి తగ్గిన పెట్రోల్ ధర
హైదరాబాద్: వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర మళ్లీ తగ్గింది. లీటరుకు ఒక రూపాయి 82 పైసలు తగ్గించారు. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. హైదరాబాద్లో లీటర్కు రెండు రూపాయల 50 పైసల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండవసారి. స్వాత్రంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 15న పెట్రోల్ ధర తగ్గించారు. అప్పుడు లీటర్కు రూ.1.89 పైసల నుంచి రూ.2.38(ఢిల్లీలో ధరలు) వరకు తగ్గించారు.