breaking news
Pension Hike
-
రేపో, ఎల్లుండో పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపు
సాక్షి, సిద్దిపేట: ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన రాష్ట్రాన్ని పొరపాటున కాంగ్రెస్ చేతిలో పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమ ర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. సోమ వారం సిద్దిపేట బస్టాండ్లో బీపీ చెకప్ కేంద్రం, స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపుపై రేపో, ఎల్లుండో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారన్నారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేశామని... ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లే వారని... ఇప్పుడు పక్క రాష్ట్రాల వారికి కూలీ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. వీవోలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని... ఉద్యోగస్తులతోపాటు వారికి కూడా పీఆర్సీ వర్తింపజేశామన్నారు. ‘దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చుస్తోంది.. ఇక్కడ అమలవుతున్న రైతు బంధు, బీమా, ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో మహిళా భవనం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాం’ అని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
TS: వికలాంగులకు మరో వెయ్యి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘వికలాంగులకు ఇప్పటివరకు రూ.3,116 ఇస్తున్నాం. శుక్రవారం మంచి రోజు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికలాంగుల పింఛను మరొక వెయ్యి పెంచుతున్నం. మంచిర్యాల గడ్డ, తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచే ఈ మాట ప్రకటించాలని నేను సస్పెన్స్లో పెట్టా. వచ్చే నెల నుంచే పెరిగిన రూ.4,116 అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా నస్పూర్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల ప్రగతి నివేదన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే తలమానికంగా తెలంగాణ ‘దేశంలో తెలంగాణ అన్నింటా నంబర్ వన్గా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసి చక్కటి కలెక్టరేట్ నిర్మించాం. మెడికల్ కాలేజీ అనుబంధంగా ఆసుపత్రి కూడా సమకూర్చుకుంటున్నాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ సమకూర్చుకుంటూ దేశానికే తలమానికంగా రాష్ట్రాన్ని మార్చు కున్నాం. పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, మంచి గ్రామం, ము న్సిపాలిటీల్లో నంబర్ వన్ ఎవరంటే తెలంగాణ. మిషన్ భగీరథతో ప్రతిఇంటికీ నల్లా పెట్టి అందరికీ నీళ్లుసరఫరా చేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. రైతుబంధుతో రూ.68 వేల కోట్లు రైతులకు అందించాం. గతంలో పంటలు పండాలంటే కరెంట్, నీళ్లు లేక గోస పడిన సంగతి తెలిసిందే. ఈ యాసంగిలో దేశంలో వరి 94 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క తెలంగాణలోనే 54.40 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి ఉత్పత్తిలో పంజాబ్ను మించిపోయింది. దేశంలోనే అతి ఎక్కువగా వడ్లు పండిస్తూ నంబర్ వన్గా నిలిచాం. గతంలో కోటి టన్నులు పండితే ఎక్కువ అనుకున్నాం. అటువంటిది మూడు కోట్ల టన్నుల పై చిలుకు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇదంతా ప్రభుత్వ సహకారం, రైతుల కష్టంతోనే సాధ్యమైంది..’ అని కేసీఆర్ చెప్పారు. ఇలాంటి గోదావరి చూస్తామా అనుకున్నాం.. ‘రూ.500 కోట్లతో మందమర్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. ఆదివాసీ, గిరిజ నులకు పోడు పట్టాలు ఇస్తున్నాం. యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. ఎంబీసీ, బీసీ కులాల వారికి రూ.లక్ష సాయం అందిస్తున్నాం. సొంత జాగా ఉంటే రూ.3 లక్షల సాయం ఇచ్చే పథకాన్ని ప్రారంభించుకున్నాం. గతంలో గోదారిలో రూపాయి బిళ్ల వేద్దామంటే నీళ్లు కనిపించేవి కావు. బ్రిడ్జి మీద అటు ఇటు తిరిగి మడుగులో ఎక్కడో వేసి వెళ్లిపోయేవాడ్ని. ఈ రోజు హెలికాప్టర్లో వస్తుంటే బ్రçహ్మాండంగా గోదావరి ఉంది. ఇలాంటి గోదావరి చూస్తామా? అనుకున్నాం. గోదా వరిఖనికి చెందిన సదాశివ కవి ‘తలాపున పారు తుంది గోదావరి, మా చేన్లు, మా చెలక ఎడారి అని పాడేవారు’ ఈ రోజు ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరంతా చూస్తున్నారు. చెన్నూరు ఎత్తిపోతలు, వార్దా బ్యారేజీతో ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లికి లక్ష ఎకరాల చొప్పున. సాగు నీరందిస్తాం..’ అని చెప్పారు. సింగరేణి నడకా మారింది.. ‘నిజాం మొదలు పెట్టిన 134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్ హయాంలో సర్వ నాశనం చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తెచ్చి, చెల్లించలేక సొంత కంపెనీని 49 శాతం వాటా కింద అమ్మేశారు. సమ్మెలు, కార్మికుల అణిచివేత ఉండేది. 2014 కంటే ముందు రూ.11 వేల కోట్ల టర్నోవర్తో, కార్మికులకు 18 శాతం బోనస్తో రూ.56 కోట్లు మాత్రమే సింగరేణి పంచేది. ఈ రోజు సింగరేణి నడక మారింది. ప్రస్తుతం రూ.33 వేల కోట్ల టర్నోవర్ ఉంది. ఈ సంవత్సరం రూ.2,184 కోట్ల లాభాలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే దసరాకు రూ.700 కోట్ల లాభాలు వస్తాయి. కాంగ్రెస్ హయాంలో 6,453 ఉద్యోగాలు ఇస్తే, డిపెండెండ్ల ఉద్యోగాలు పునరుద్ధరించి 15, 256మందికి ఉద్యోగాలిచ్చాం. ఇవికాక మరో 19,463 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రమాదం జరిగితే కార్మికులకు రూ.లక్ష ఇచ్చి చేతులు దులి పే సుకునేవారు. ప్రస్తుతం రూ.10 లక్షలు ఇస్తున్నా. దశాబ్ది ఉత్సవాల్లో అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మందమర్రిలో బీసీ గురుకులానికి చెందిన ఓ అమ్మాయికి 470కు 468 మార్కులు వచ్చాయి. కలెక్టర్ అయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి రూ.5 లక్షల చెక్కు పంపిస్తామని చెప్పాం. బ్యాంకులో వేసుకుని చదువుకోమన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది 1.30 లక్షల మందికి దళితబంధు ఇస్తాం..’ అని సీఎం తెలిపారు. సింగరేణికి తాళం వేయనిద్దామా? ‘కాంగ్రెస్ వాళ్లు సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అమ్మేశారు. ఇప్పుడు బొగ్గు గనుల ప్రైవే టీకరణతో సింగరేణి తాళం వేస్తామంటున్నారు. వేయనిద్దామా? సింగరేణిని నిండా ముంచేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. మోదీ తెలంగాణలో గనులు ప్రైవేటీకరణ చేయమని చెప్పి, బెంగళూరు వెళ్లి టెండర్లు పిలిచి మోసం చేశారు. అస్సాంలో పంకాలు బంద్జేయ్ మంటర్రు, ఇంకో దగ్గర ఏసీలు బంద్ చేయిమంటున్నాం, దేశ రాజధాని ఢిల్లీలో పవర్ కట్ ఉంది. కానీ నిరంతరంగా ఎటువంటి అవరోధాలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే..’ అని స్పష్టం చేశారు రైతు బొటన వేలితో పట్టామార్పు ‘గతంలో ధరణి రాకముందు రికార్డుల మార్పులకు లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఆ అధికారం ఆఫీసర్లకు ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అప్పగించింది. వీఆర్ఏ నుంచి సీఎం వరకు ఎవరూ మార్చలేరు. రైతు బొటన వేలితో మాత్రమే మారుతుంది. ప్రతి మండల ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఐదు నిమిషాల్లో పట్టా అవుతోంది. రైతుబీమా కింద రూ.5 లక్షలు బాధిత రైతులకు పది రోజుల్లోనే అందుతోంది. గతంలో వడ్లు అమ్ముకునేందుకు సేట్ల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం నేరుగా డబ్బులు బ్యాంకుల్లో పడుతున్నాయి. తెలంగాణ భూ భాగమే 2.75 కోట్ల ఎకరాలు. ఇందులో 1.55 లక్షల ఎకరాలు ధరణిలో ఎక్కాయి. 66 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలిన కుంటలు, బావులు, ఇళ్లు తీసేస్తే ఒక లక్ష వరకు మాత్రమే ఉంది. 99 శాతం పోర్టల్లో ఎక్కింది. కానీ ఎలక్షన్లు రాగానే «కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు. వాళ్లనే బంగాళాఖాతంలో విసిరెయ్యాలి. నేను మూడేళ్లు చెమటోడ్చి కష్టపడి రైతు బాధలు పోవాలనే ఈ పోర్టల్ రూపొందించా. అంతకుముందు పె³రిగిన భూముల ధరలతో ఎన్నో కొట్లాటలు జరిగేవి. ఈ రోజు పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. భూమి ఉందో లేదో కంప్యూటర్లో చూసుకోవచ్చు. అలాంటి ధరణి ఉండాలా? వద్దా? (చేతులు లేపాలని సీఎం కోరారు). ధరణి తీసేస్తే మళ్లీ దళారీ రాజ్యం వస్తుంది. రైతుబంధు, బీమా ఎలా వస్తాయి. దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టాలి..’ అని సీఎం కోరారు. సభకు ముందు రూ.ç55 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయ భవనం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం, రూ.205 కోట్లతో మంచిర్యాల మెడికల్ కాలేజీ, రూ.164 కోట్లతో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి, రూ.500 కోట్లతో మందమర్రి ఆయిల్ఫాం ఫ్యాక్టరీతో పాటు ఎంబీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం, సొంతింటి పథకానికి రూ.3 లక్షల సాయం (గృహలక్ష్మి), రెండో విడత గొర్రెల పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మాజీ స్పీకర్ మధుసూదనచారి, మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కోనప్ప, రేఖానాయక్, రాథోడ్ బాపురావు, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. కాగా సీఎం కేసీఆర్, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నూతన కలెక్టరేట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ బాదావత్ సంతోష్ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీలు జె.సంతోష్కుమార్, బొర్లకుంట వెంకటేష్ నేత, చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, దండే విఠల్, తాటిపర్తి జీవన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. గోదావరిమాతకు కేసీఆర్ పూజలు గోదావరిఖని: మంచిర్యాల జిల్లా పర్యటను ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి నిండుకుండలా ఉన్న గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య పూలు, చీరసారె నదిలో వేసి కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం గోదావరి తల్లికి మహాహారతి ఇచ్చారు. -
కేంద్ర మాజీ ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: మాజీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పూర్తి పింఛన్ పొందడానికి కనీసం 33 ఏళ్ల సర్వీసు ఉండాలన్న నిబంధనను కేంద్రం తొలగించడంతో 2006కు ముందు విరమణ పొందిన ఉద్యోగులకు అందే పింఛన్ మొత్తం పెరగనుంది. ఇది వారికిచ్చే బకాయిలకు అదనం. సవరించిన పింఛన్.. వేతన శ్రేణిలోని కనీస వేతనంలో 50 శాతానికి తగ్గకుండా ఉంటుంద ని పింఛన్దారుల సంక్షేమ శాఖ తెలిపింది. కొత్త పింఛన్, బకాయిలు 2006, జనవరి1 నుంచి వర్తిస్తాయని ప్రకటించింది. 33 ఏళ్ల కన్నా తక్కువ కాలం సేవలందించిన వారు ఈ ప్రయోజనానికి అర్హులు అని వెల్లడించింది.