breaking news
Peddamandyam
-
భార్యపై కోపంతో కరెంటు తీగలు పట్టుకున్నాడు!
సాక్షి, పెద్దమండ్యం(చిత్తూరు) : భార్యతో గొడవ పడిన ఓ ప్రబుద్ధుడు కోపంతో కరెంటు తీగలను పట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. మండలంలో ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. సి.గోళ్లపల్లె పంచాయతీ కనుమలోపల్లె దళితవాడకు చెందిన పెద్దమల్లయ్య (44) ఇంటి విషయమై భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగని పెద్దమల్లయ్య భార్యపై కోపంతో పల్లె వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కున్న ఫ్యూజు క్యారీయర్లకు ఉన్న సరఫరా వైర్లను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుని చేతులు కాలిపోయాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. -
దొంగ అరెస్ట్
పెద్దమండ్యం: చుట్టం చూపుగా వచ్చి రూ.50 వేల నగదు, 19 తులాల బంగారం చోరీ చేసిన దొంగను పోలీసులు పది రోజుల్లోనే పట్టుకున్నారు. ములకలచెరువు సీఐ రుషీకేశవ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దమండ్యం మండలంలోని వెలిగల్లుకు చెందిన నాగూరు హుసేన్బీ గొర్?రలు మేపుకొని జీవనం సాగిస్తోంది. ఈమె కుమారునికి మండలంలోని పాపేపల్లెకు చెందిన దస్తగిరి కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో దస్తగిరి కుమారుడు సాధిక్పీరా (23) వెలిగల్లులో ఉన్న అక్క దగ్గరికి ఆటోలో వెళ్లాడు. ఇంట్లో ఉన్న 19 తులాలు బంగారం, రూ.50 వేలు నగదు చోరీ చేశాడు. తాను దాచి ఉంచిన బంగారం, నగదు చోరీ అరుునట్లు పది రోజుల క్రితం హుసేన్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రుషీకేశవ, ఎస్ఐ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి వేసి న తాళం అలాగే ఉండి నగలు, నగదు చోరీకి గురికావడంతో బంధువులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బంధువైన సాధిక్పీరాను విచారించడంతో దొంగతనం బయటపడింది. అతన్ని పాపేపల్లె బస్స్టాప్ వద్ద అరెస్ట్ చేసి 19 తులాల బంగారం, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపా రు. నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లోనే చోరీని ఛేదించిన ఎస్ఐ శంకరమల్లయ్య, క్రైం పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు. వారికి రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి నివేదిస్తామని పేర్కొన్నారు.