breaking news
payasam
-
ఆ హరిహరసుతడికి పిండిచేసిన పాయసం నుంచి నువ్వుల పాయసం వరకు..!
శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు. ⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది. ⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.అత్యంత స్పెషల్ పంచామృతం..తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు. అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్పై ఫిర్యాదులు..!) -
Recipe: శనగపప్పుతో రుచికరమైన పాయసం.. తయారీ ఇలా
ఎంత ఈజీ అయితే మాత్రం... ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... పండుగకు శనగపప్పు పాయసం చేద్దాం. శనగపప్పు పాయసం తయారీకి కావలసినవి: ►పచ్చి శనగపప్పు – 200 గ్రా ►కొబ్బరి పాలు లేదా గేదెపాలు– 100 మి. లీ ►బెల్లం తురుము – 150 గ్రా; ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు – 20 ►కిస్మిస్ – టేబుల్ స్పూన్ ►ఏలకుల పొడి – అర టీ స్పూన్. తయారీ: ►శనగపప్పును కడిగి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత రెండింతలు నీటిని పోసి ప్రెషర్ కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ►పాలను మరిగించి పక్కన ఉంచాలి. ►కుక్కర్ వేడి తగ్గిన తర్వాత శనగపప్పును ఒక మోస్తరుగా మెదపాలి (మరీ మెత్తగా చేయరాదు). ►వెడల్పాటి బాణలి పెట్టి అందులో మెదిపిన శనగపప్పు వేసి పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►మిశ్రమంలో బుడగలు వచ్చేటప్పుడు బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి సన్న మంట మీద (పెద్ద మంట చేస్తే పాయసం అడుగు పడుతుంది) కలుపుతూ ఉడికించాలి. మరొక స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. ►వీటిని ఉడుకుతున్న పాయసంలో వేసి కలిపి దించేయాలి. గమనిక: వీగన్ డైట్ను అనుసరించేవాళ్లు యానిమల్ మిల్క్కి చదువుగా కొబ్బరిపాలతో, నెయ్యికి బదులుగా వంట కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Bajji Recipe: రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారీ ఇలా.. Sankranti- Recipes: అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు.. -
కుళ్లిన కూరగాయలతో విందు
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్లైన్ : మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులకోసం కుళ్లిన వంకాయలతో చేసిన కూర, ఉడకని అన్నం సిద్ధం చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను సరిగా ఆవిష్కరించారో లేదో పరిశీలించడానికి విద్యార్థి సంఘాల నాయకులు బాలికల హాస్టల్ కు వచ్చారు. రంగు వెలసిన కాగితాలను అతికించడం, జెండా రెపరెపలాడకుండా కర్రకు అతుక్కుపోయి ఉండడంపై వారు హాస్టల్ సిబ్బందిని ప్రశ్నించారు. జెండాను ఆవిష్కరించిన వెంటనే వార్డెన్ విజయలక్ష్మి వెళ్లిపోయారని సిబ్బంది చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు వెజ్బిర్యాని, పాయసం వడ్డించాల్సి ఉంది. అయితే ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూరను గమనించి వెంటనే తహశీల్దార్కు సమాచారం అందించారు. ఆయన హాస్టల్కు వచ్చి సిబ్బంది వివరణ తీసుకున్నారు. కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసాగర్, సంతోష్, మహేశ్, ప్రవీణ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.


