breaking news
patiala mp
-
కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణికి కాంగ్రెస్ షాక్..
న్యూఢిల్లీ: పంజాబ్ పాటియాల నియోజకవర్గం ఎంపీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి పర్నీత్ కౌర్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్నీత్ కౌర్పై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ తెలిపింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీజేపీకీ ప్రయోజనం చేకూర్చుతున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నందునే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. పర్నీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021లో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో ఎన్నికల అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం కమలం పార్టీలోనే కొనసాగుతున్నారు. చదవండి: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్లో యువతి రుబాబు.. -
ఆమ్ ఆద్మీనే..
పార్లమెంటు ముందు పచ్చికపై కునుకేస్తున్న ఈయన ఎవరో తెలుసా? ఓ ఎంపీ! పేరు ధరమ్వీర్ గాంధీ. ఎంపీ అనేసరికి మనం అంతా హైఫై అని ఊహించుకుంటాం. కానీ ఈయన తన పార్టీ పేరు (ఆమ్ ఆద్మీ పార్టీ)కు తగ్గట్లే.. ఓ సామాన్యుడిలా మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటు లాన్స్లో కునుకేశారు. పంజాబ్లోని పటియాలాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధరమ్వీర్ కార్డియాలజిస్ట్. హస్తవాసిగల వైద్యుడిగా పేరుంది. పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారు. గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్పై గెలుపొందారు. తన కాలేజీ రోజుల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి.. కొంత కాలం జైలులో కూడా ఉన్నారు.