breaking news
parchad
-
రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?
బుల్లితెరపై కనిపిస్తే.. వెండితెర అవకాశాలు తగ్గుతాయనే మాట అసత్యమని ఇప్పటికే చాలామంది నటీనటులు నిరూపించారు! ఆ జాబితాలో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా కూడా ఉంది. దశాబ్ద కాలంగా టీవీ సీరియల్స్లో నటిస్తూనే అటు సినిమా అవకాశాలనూ అందుకుంటూ.. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా స్టార్గా వెలిగిపోతోంది. సుర్వీన్ చండీగఢ్లో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంది. (ఇదీ చదవండి: గతంలో విడాకులు.. అయితే మళ్లీ ప్రేమను పొందే అర్హత లేదా?: నటి) దీంతో మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా మారింది. ‘కహీ తో హోగా’ అనే టీవీ సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించింది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో సీరియల్స్తోపాటు, సినిమా అవకాశాలూ రావడం మొదలుపెట్టాయి.దూరదర్శన్లో ప్రసారమయ్యే ‘రంగోలీ’ కార్యక్రమానికి దాదాపు ఐదేళ్లు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.కన్నడంలో విడుదలైన ‘పరమేశ పాన్వాలా’తో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన రెండో చిత్రంతోనే మోహన్బాబు, శర్వానంద్ ‘రాజు.. మహారాజు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు పంజాబీ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. ‘హిమ్మత్వాలా’, ‘క్రియేచర్ 3డీ’, ‘వెల్కమ్ బ్యాక్’ సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది సుర్వీన్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. లావుగా ఉంటే అవకాశాలు రావంటూ కొందరు నన్ను బాడీ షేమింగ్ చేశారు. వాటిని పట్టించుకోలేదు. కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పార్చ్డ్’ సినిమాలో తన ప్రతిభకు పురస్కారం అందుకుంది. ఆ సినిమాలో తను రకుల్తో చేసిన కొన్ని సీన్స్ వివాదస్పదం అయ్యాయి. ‘24’ సీజన్ 2తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, అక్కడ కూడా వరుస సిరీస్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెట్ఫిక్ల్స్లో ప్రసారంలో ఉన్న ‘రానా నాయుడు’తో వీక్షకులను అలరిస్తోంది. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ.. కంట్రోల్లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!) -
బోల్డ్ ఈజ్ గోల్డ్
బోల్డ్ ఈజ్ గోల్డ్. ఏమిటీ కొత్త నిర్వచనం అనుకుంటున్నారా? ఇది నటి రాధికాఆప్తే అంటున్న మాట. నిజమే ఈ పదానికి నప్పే నటే ఈమె.అందాలారబోతకు హద్దులు తుడిచేసే రాధికాఆప్తే దక్షిణాదిలోనే కాస్త సంసార పక్ష పాత్రల్లో కనిపించారు. ఉత్తరాదిలో ఈ అమ్మడి నటన అందర్నీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. అర్ధనగ్నంగానే కాదు నగ్నంగా నటించడానికీ ఏమాత్రం వెనుకాడని నటి రాధికాఆప్తే. పూణేకు చెందిన ఈ బోల్డ్ నటి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినీ ఆర్టిస్ట్గా ప్రమోట్ అయ్యింది. మొదట హిందీ, ఆ తరువాత బెంగాలీ, మరాఠి చిత్రాల్లో నటించి ఆపై దక్షిణాదికి దిగుమతి అయిన ఉత్తరాది భామ రాధికాఆప్తే. ఇటీవల కబాలి చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్కు భార్యగా నటించి మంచి ప్రాచుర్యం పొందిన ఈ జాణ ఆ ఇమేజ్ను తుడిచేసే విధంగా పర్చడ్ అనే హిందీ చిత్రంలో అర్ధనగ్నంగానూ, అహల్య అనే బెంగాలీ షార్ట్ ఫిలింలో నగ్నంగా నటించి పెద్ద చర్చకే దారి తీసింది. ఎలా అంత ధైర్యంగా నటించగలుగుతున్నారు? నగ్నంగా నటించడానికి మీ భర్త అభ్యంతరం చెప్పరా? అన్న ప్రశ్నలకు రాధికాఆప్తే చాలా బోల్డ్గా బదులిచ్చారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. కథకు అవసరం లేకుండా అర్ధనగ్నంగా నటించడం నాకూ సమర్థనీయం కాదు. అదే కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికైనా నాకు ఆక్షేపణ లేదు. ఎందుకంటే బోల్డ్ ఈజ్ గోల్డ్. వివాహమైన స్త్రీని మీ భర్త అభ్యంతరం చెప్పరా? అని అడుగుతున్నారు. గ్లామరస్గా నటించడానికి.. ముఖ్యంగా నగ్నంగా నటించడానికి నా భర్త బెనెడిక్ట్ టె యిలర్ అభ్యంతరం చెప్పరు కదా, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ సన్నివేశాల్లో తను కథా పాత్రల్నే చూస్తారు కానీ నన్ను చూడరు అని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. చూశారా ఎంత బోల్డ్గా బదులిచ్చిందో.