breaking news
Oonjal service
-
వైభవంగా ఊంజల్సేవ
రాపూరు: పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి శనివారం రాత్రి ఊంజల్సేవ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి సుప్రభాతసేవ, 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. ఉదయం 11గంటలకు నిత్య కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి,చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్సేవ నిర్వహించారు. -
చిన్నశేషునిపై వేణుగోపాలుడు
కార్వేటినగరం, న్యూస్లైన్: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అర్చన, తోమాల, శుద్ధి, అభిషేకం, నిత్యకైంకర్య పూజలు చేశారు. 7.30 నుంచి 9 గంటల వరకు స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. గజ, వృషభాలు, చిన్నారుల చెక్కభజనలు, కోలాటం, భజన కీర్తనల నడుమ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. ఘనంగా స్నపన తిరుమంజనం రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు గురువారం స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పసుపు, చందనం, పా లు, పెరుగు, నారికేళ జలాలు వంటి సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తుల ను అభిషేకించారు. వేద పండితులు సుందరవరదాచార్యులు, కిరణ్భట్టాచార్యులు, దీక్షితాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. రమణీయంగా ఊంజల్ సేవ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఊంజల్ సేవను సాయంత్రం ఐదు గంటలకు రమణీయంగా నిర్వహించారు. సంకీర్తనాలాపన, వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 గంటలకు పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఉభయ దేవేరులతో వేణుగాన లోలుడు పురవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సిద్దారెడ్డి, జమేదార్ శివకృష్ణ, ఓఎస్డబ్ల్యూ శ్రీనివాసులు, పీఎన్.మూర్తి. ఆలయ సిబ్బంది, పెద్ద ఎత్తును భక్తులు పాల్గొన్నారు.