breaking news
number of users increased
-
సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు 500 కోట్లు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంటే ప్రపంచ జనాభాలో 64% మంది సామాజిక మాధ్యమాల్లో అత్యధికంగా కాలం గడుపుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే వినియోగదారులు 3.7% పెరిగినట్టు డిజిటల్ అడ్వయిజరీ సంస్థ కెపియోస్ అధ్యయనంలో వెల్లడైంది. ► తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతీ 11 మందిలో ఒక్కరికే సోషల్ మీడియాలో ఖాతాలున్నాయి. ► భారత్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు ► రోజుకి సగటున 2 గంటల 26 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు ► బ్రెజిల్ వాసులు అత్యధికంగా సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్ మీడియాలో ఉంటే, జపాన్ వాసులు అత్యంత తక్కువగా గంటలోపు మాత్రమే సోషల్ మీడియాని చూస్తున్నారు. ► సోషల్ మీడియా యూజర్లకి దాదాపుగా ఏడు యాప్స్లో ఖాతాలుంటు న్నాయి. వీటిలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విటర్ ప్రధానమైనవి. -
20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు
న్యూఢిల్లీ: ప్రధాన జీఎస్ఎం టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, టెలినార్ వంటి కంపెనీల యూజర్ల సంఖ్య జూలైలో 20 లక్షలకు పైగా పెరిగింది. టెలికం సమాఖ్య సీఓఏఐ నివేదిక ప్రకారం.. మొత్తం జీఎస్ఎం సబ్స్క్రైబర్ల సంఖ్య 77.90 కోట్లుగా ఉంది.