-
ఉదయ్ కొటక్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. సెపె్టంబర్ 1 నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచి్చందని బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంక్లో ఆయనకు 26 శాతం వాటా ఉంది. ఇక నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తారని కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైనా 15 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో పనిచేయాల్సి ఉంటుంది. గడువు కంటే 3 నెలల ముందే ఉదయ్ రాజీనామా చేయడం గమనార్హం. -
నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి కేకే మహేశ్వరి రాజీనామా.. కారణం ఇదే!
వోడాఫోన్ ఐడియా బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'కృష్ణ కుమార్ మహేశ్వరి' తన పదవికి రాజీనామా చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 19న రాజీనామా చేసినట్లు తెలిసింది. కెకె మహేశ్వరి రాజీనామా చేయడానికి గల కారణాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ మహేశ్వరి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మహేశ్వరి వోడాఫోన్ ఐడియా బోర్డులో చేరటానికి ముందు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. (ఇదీ చదవండి: వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పిల్లల హవా! ఒకరిని మించి మరొకరు..) నష్టాల్లో మునిగిపోయిన టెలికాం కంపెనీలో కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సమ్మేళనానికి 18 శాతం వాటా ఉంది. 2022 మార్చి 03న వొడాఫోన్ ఐడియా బోర్డులోకి నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. జులైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూండ్రా నియమితులు కాగా, హిమాన్షు కపానియా ఆగస్టులో టక్కర్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. -
జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్గా సుభాష్ చంద్ర రాజీనామా
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్పర్సన్కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ వివరించింది. ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. రుణాల భారం తగ్గింపునకు ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. -
టాటా జీఈసీలో మరో రాజీనామా
ముంబై: టాటా- మిస్త్రీ వివాదానంతర పరిణామాలలో మరో రాజీనామా చోటు చేసుకుంది. నాన్-ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ నిర్మాలయ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని టాటా గ్రూప్ మంగళవారం నివేదించింది. అక్టోబర్ 31, సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఈ సమాచారాన్నిటాటా కెమికల్స్ కంపెనీ కార్యదర్శి రాజీవ్ చందన్ బీఎస్ఈ ఫైలింగ్లో రిపోర్టు చేశారు. కాగా లండన్ బిజినెస్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్, నిర్మాలయ కుమార్ మిస్త్రీ ఏర్పాటు చేసిన ఎక్జిక్యూటివ్ కమిటీ (జీఈసీ) సభ్యులు. 2013 లో జీఈసీలో చేరిన టాటా గ్రూపు వ్యూహ రచనలో బాధ్యుడిగా ఉన్నారు. అయితే అక్టోబరు 24 న మిస్త్రీ తొలగించిన మరుక్షణమే ఈ కమిటీని కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement