breaking news
Nithari killings
-
సురేంద్ర కోలీ నిర్దోషి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో దోషిగా తేలిన సురేంద్ర కోలీని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతడు జైలు నుంచి విడుదలయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. నిఠారీ హత్యల కేసులో తనను దోషిగా తేల్చడాన్ని సవాలు చేస్తూ సురేంద్ర కోలీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో అతడికి విధించిన శిక్షను, జరిమానాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కో లీపై ఇతర కేసులు గానీ, విచారణ గానీ లేకుంటే తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. హంతకులెవరో ఇప్పటికీ తెలియకపోవడం విచారకరం నిఠారీ వరుస హత్యల వెనుక అసలు సూత్రధారులను గుర్తించలేకపోవడం తీవ్ర విచారకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సుదీర్ఘకాలం విచారణ జరిగినప్పటికీ హంతకులెవరో ఇప్పటికీ నిర్ధారణ కాలేదని వెల్లడించింది. పోలీసులు ఇంతకాలం శ్రమించినా నేరస్థులను పట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించింది. అభంశుభం తెలియని, చిన్నారులను హత్యచేయడం చాలా ఘోరమని, వారి తల్లిదండ్రుల ఆవేదనను వర్ణించలేమని స్పష్టంచేసింది. కేవ లం ఊహాగానాల ఆధారంగా ఒకరిని దోషిగా తేల్చడాన్ని ‘క్రిమినల్ లా’ అంగీకరించబోదని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. అస్థిపంజరాలు దొరికిన ఘటనా స్థలాన్ని సరిగ్గా సంరక్షించలేదని, ఆ తర్వాత హడావుడిగా తవ్వకాలు చేపట్టారని అసంతృప్తి వ్యక్తంచేసింది. కేసు దర్యాప్తులో అధికారులు కీలకమైన విషయాలను విస్మరించారని తప్పుపట్టింది. ఏమిటీ కేసు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని నిఠారీ అనే ప్రాంతంలో 2006 డిసెంబర్ 29న వ్యాపారవేత్త మనీందర్ సింగ్ ఇంటి వెనుక మురికి కాలువలో ఎనిమిది అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవన్నీ చిన్నారులకు సంబంధించినవే. మనీందర్ సింగ్ ఇంట్లో సురేంద్ర కోలీ సహాయకుడిగా పని చేస్తుండేవాడు. ఎనిమిది అస్థిపంజరాల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలికలను లైంగికంగా వేధించి, హత్య చేసి మురికికాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సురేంద్ర కోలీని కింది కోర్టు దోషిగా గుర్తించింది.మరణశిక్ష విధించింది. దీన్ని 2011 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. 2015 జనవరిలో అలహాబాద్ హైకోర్టు ఈ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2023 అక్టోబర్లో నిఠారీకి సంబంధించిన ఇతర హత్యల కేసుల్లో కోలీని, సహ నిందితుడు మనీందర్ సింగ్ను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోలీకి మొత్తం 12 కేసుల్లో విముక్తి లభించింది. మరో హత్య కేసులో ఆయనకు కింది కోర్టు విధించిన శిక్ష, జరిమానాను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. వంట గదిలో దొరికిన కత్తి ఆధారంగానే దర్యాప్తు జరిగిందని, కోలీని దోషిగా నిర్ధారించడానికి ఈ సాక్ష్యం సరిపోదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. -
నిఠారీ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సురేంద్ర కొలిని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ‘‘నిందితుడిపై నేరారోపణలు రుజువు కాలేదు. కాబట్టి నిర్దోషిగా విడుదల చేస్తున్నాం’’ అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలడంతో సురేంద్ర దాదాపు 19 ఏళ్ల తర్వాత విడుదల కానున్నాడు. ఏంటీ కేసు.. నోయిడా సమీపంలోని నిఠారీ గ్రామంలో 2005-06 మధ్యకాలంలో.. చిన్నారులు, యువతులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఫిర్యాదులను మొదట్లో పోలీసులు తేలికగా తీసుకున్నా.. బాధితుల సంఖ్య పెరుగుతూ పోవడం, మీడియా కథనాల దృష్ట్యా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. 2006 డిసెంబర్ 29న ఘోరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది. ఎవరీ సురేంద్ర?అస్థిపంజరాలు బయటపడ్డ డ్రెయిన్ను ఆనుకుని వ్యాపారవేత్త అయిన మోనిందర్ సింగ్ పాంధేర్ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పని చేసే సురేంద్ర కోలిని ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ చేతికి వెళ్లింది. 2007 నుంచి మూడేళ్ల పాటు విచారణ జరగ్గా.. మోనిందర్తో పాటు సురేంద్ర కోలిని నిందితులుగా పేర్కొంది. చాక్లెట్లు చూపించి చిన్నపిల్లలను సురేంద్ర రప్పించేవాడని, మోనిందర్తో కలిసి హత్యాచారం చేసేవాడని అభియోగం నమోదు చేసింది. నరమాంసం భక్షణ, ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం(అస్థిపంజరాలను కాలువలో పడేయడం) లాంటి అభియోగాలను కూడా పేర్కొంది. విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోలికి, పాంధేర్కి మరణశిక్ష విధించింది. రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఈ ఇద్దరూ ప్రయత్నించగా.. తిరస్కారం ఎదురైంది. కోలిపై 15 ఏళ్ల బాలిక హత్య కేసులో దోషిగా తీర్పు ఇచ్చి మరణశిక్షను ధృవీకరించింది. అయితే 2023లో అలహాబాద్ హైకోర్టు కోలిని 12 కేసుల్లో, పాంధేర్ని 2 కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అదే ఏడాది అక్టోబర్లో పాంధేర్ జైలు నుంచి విడుదలయ్యాడు.అయితే సీబీఐతో పాటు బాధిత కుటుంబాలు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ అప్పీల్ను తిరస్కరిస్తూ ఈ ఏడాది జులై 31వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. మరోవైపు సుప్రీం కోర్టు విధించిన మరణశిక్ష రద్దు కోసం(15 ఏళ్ల బాలిక కేసులో) కోలి కరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరగ్గా.. ఆధారాల లోపం, విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఇవాళ సీజేఐ బెంచ్ నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది. -
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
సీరియల్ రేపిస్ట్కు మరణశిక్ష
ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్ రేపిస్ట్తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. పింకీ సర్కార్ హత్య కేసులో వీరికి శిక్ష ఖరారు చేసింది. సోమవారం ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి పవన్ కుమార్ త్రిపాఠి నేరస్తులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఆరు కేసుల్లో ఇప్పటికే వీరికి శిక్ష పడింది. మరో 9 కేసులు కోర్టు విచారణల్లో ఉన్నాయి. 2006లో ఓ మహిళ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అక్టోబర్ 5వ తేదీన నోయిడాలోని నిథారి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వ్యాపార వేత్త మొహిందర్ సింగ్ త్రిపాఠి పనిమనిషి సురేందర్ కోలి లోపలికి పిలిచాడు. అనంతరం యజమానితో కలిసి ఆమెపై అత్యాచారం చేయటంతోపాటు తలనరికి ఇంటి వెనుక పడేశారు. ఇదే విధంగా పలువురు చిన్నారులు, మహిళలపై దారుణాలు జరిపారు. మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహిందర్ సింగ్ ఇంట్లో సోదాలు జరపగా 16మందికి సంబంధించిన ఎముకలు, కపాలాలు కనిపించాయి. ఇందులో ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ దారుణం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా అదే సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. ఈ మేరకు వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. -
అతనికి ఉరి తప్పదా?
న్యూఢిల్లీ: సంచలన నిఠారి హత్యకేసులో దోషి సురేందర్ కోలికి మరణశిక్షను తగ్గిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించి ముద్దాయి సురేందర్ కొలికి ఉన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సురేందర్ కోలికి, మరొకరికి ఉరి తప్పదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన ముద్దాయి సురేందర్ కోలీ, అతనికి సహకరించిన మణీందర్ సింగ్ పంథర్లకు 2006లో ఘజియాబాద్ సిబీఐ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పెట్టుకున్న మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముద్దాయి సురేందర్ కోలి మరణశిక్షను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టులో పియూడీర్ అనే స్వచ్ఛంద సంస్థ పిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు కు ఇది విరుద్ధమని వాదించింది. దీనికి స్పందించిన కోర్టు మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పుచెప్పింది. కాగా ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లలోని నిఠారీ గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో భాగంగా ఒక బాలిక కేసులో మాత్రమే ఘజియాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేందర్ సింగ్ కోలీ నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెల్సిందే.


