-
అమెరికా బాటలో సౌదీ అరేబియా
సాక్షి, ముంబయి : భారత ప్రొఫెషనల్స్ ఎంట్రీపై అమెరికా వీసా ఆంక్షలు విధిస్తే..తాజాగా సౌదీ అరేబియా నూతన నితాకత్ మార్గదర్శకాలతో భారత్ నుంచి వలసలకు బ్రేక్ వేస్తున్నది. సౌదీ తాజా నిబంధనలతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కేవలం కొన్ని ప్రముఖ సంస్థలు హైగ్రేడ్ పోస్టుల్లో మాత్రమే భారతీయులకు చోటు దక్కుతుంది. ఇతరులు మై గ్రాంట్ ఉద్యోగులుగా వీసాలు నమోదు చేసుకునేందుకు పలు అవరోధాలు ఎదురవనున్నాయి. 2016 నాటికి సౌదీ అరేబియాలో 25 లక్షల మంది భారతీయులు పనిచేస్తుండగా వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. 2016లో సౌదీలో కేవలం 1.65 లక్షల ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చోటుచేసుకున్నాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 46 శాతం తక్కువ కావడం గమనార్హం. సౌదీ అరేబియాకు భారత్లో అత్యధికంగా యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ రాష్ట్రాల నుంచి వర్కర్లు తరలి వెళుతున్నారు. సౌదీఅరేబియా వాసులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత దక్కేలా అక్కడి ప్రభుత్వం ఇమిగ్రేషన్ పాలసీలో మార్పులు చేయడంతో భారత ఉద్యోగులకు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం ప్లాటినమ్, హైగ్రీన్ క్యాటగిరీ సంస్థలకు మాత్రమే న్యూ బ్లాక్ వీసాల జారీకి అర్హులుగా నిర్దారించారు. భారత్ నుంచి సౌదీలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా నిర్మాణ, ఆతిథ్య రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ రంగాలు ప్లాటినమ్, హైగ్రీన్ క్యాటగిరీలో ఉండే సంస్థలు అతితక్కువ కావడంతో భారత్ ఉద్యోగులు, కార్మికుల హైరింగ్పై ప్రతికూల ప్రభావం పడనుంది. -
సౌదీలో 180 మంది ప్రవాసాంధ్రుల అరెస్ట్
హైదరాబాద్, న్యూస్లైన్: సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులకు మళ్లీ ‘నితాఖత్’ కష్టాలు మొదలయ్యాయి. గత మూడు రోజులుగా సౌదీ అరేబియా పోలీసులు అక్రమంగా నివాసముంటున్న వందలమందిని అరెస్ట్ చేశారు. రాజధాని రియాద్లోని హారాలో అక్రమంగా నివాసముంటున్న తెలుగువారిని కూడా అరెస్ట్ చేశారు. వీరి సంఖ్య 180కి పైగానే ఉంది. హారాలో ఎక్కువగా హైదరాబాద్, వైఎస్సార్, చిత్తూరు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉంటున్నారు. ఆ ప్రాంతంలో రోడ్లు, కాలనీలు, నివాసాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటుచేసి వర్క్ పర్మిట్ లేని వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారికి వర్క్ పర్మిట్ను రెన్యువల్ చేసుకునేందుకు గత నవంబర్ 3తో గడువు ముగిసినప్పటికీ... చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో అక్కడి ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించి వెసులుబాటు కల్పించింది. ఈ గడువు కూడా తీరడంతో వర్క్ పర్మిట్ లేని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిని కట్టడి చేసేందుకు ఆ దేశంలో నితాఖత్ అనే కొత్త కార్మిక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వెంటనే చొరవ తీసుకొని అక్కడి తెలుగు వారిని ఆదుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
సౌదీలో స్తంభించిన జనజీవనం
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియా తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ ప్రభావంతో అక్కడ చాలా వరకు జనజీవనం స్తంభించిపోయింది. సరైన పత్రాలు లేక (వర్క్ పర్మిట్ లేక) అరెస్టవడంతో పాటు, అవగాహన లేక పెద్ద సంఖ్యలో కార్మికులు ఇళ్లకే పరిమితం కావడంతో.. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలను మూసి ఉంచాల్సి వస్తోంది. దాంతో ప్రధాన నగరాలైన జిద్దా, రియాత్, దమ్మామ్, హల్-కోబర్, మక్కా, మదీనా తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వలస వచ్చినవారితో పాటు, సౌదీ అరేబియా ప్రజల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం కింద అరెస్టయిన కార్మికుల్లో ఎక్కువగా ప్లంబర్లు, పెయింటర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, క్లీనర్స్, స్వీపర్లు ఉన్నారు. దాంతో చాలా సంస్థలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, కార్యాలయాల్లో కిందిస్థాయి సిబ్బంది రాకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయి, సౌదీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యోగ వీసాపై వెళ్లిన ఉద్యోగులు తమ కఫిల్ల నుంచి ఫ్యామిలీ వీసా అనుమతి తీసుకొని భార్యాపిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. వారిని భారత ఎంబసీ స్కూళ్లలో, స్థానిక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా చేర్పించారు. కానీ, ‘నతాఖా’ చట్టంతో వారంతా పాఠశాలలకు వెళ్లకపోవడంతో చాలా స్కూళ్లు మూతపడ్డాయి. చట్టంపై అవగాహన లేకనే.. సౌదీ అరేబియాకు వెళ్లిన వారికి తమ వద్ద అఖామా (వర్క్ పర్మిట్) ఉన్నప్పటికీ.. పిలిచిన వ్యక్తి (కఫిల్) పేర్కొన్న పనికి సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించే విధానం లేదు. దాంతో ఇప్పుడు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నతాఖా’ ప్రకారం వర్క్ పర్మిట్లో ఏ పని చేస్తారని పేర్కొన్నారో.. కార్మికులు అదే పని మాత్రమే చేయాలి. దీని ప్రకారం అఖామాలో డ్రైవర్గా ఉండి.. స్వీపర్ విధులు నిర్వహిస్తున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. దీంతో వర్క్ పర్మిట్ ఉన్న కార్మికులు కూడా విధులకు హాజరుకావడానికి భయపడుతున్నారు. నివాసాల్లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో పాటు, అక్కడి స్థానిక భాష అరబ్బీ రాకపోవడంతో విదేశాల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదనే విషయాలపై అక్కడి ప్రభుత్వం.. అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విదేశీ కార్మికులు, ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 25 వేల మంది అరెస్టు? : ఇప్పటి వరకు అక్రమంగా ఉంటున్న 25 వేల మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధి అల్ మన్సూర్ టర్కీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఎంతమంది అక్రమంగా నివాసం ఉంటున్నారో ఇకపై అరెస్టులతో తెలుస్తుందన్నారు.అరెస్టయిన వారిలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రశ్నించగా... వారికి సౌదీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా వైద్యం చేయిస్తామని ఇప్పటికే సౌదీ రాజు ప్రకటించారని చెప్పారు. విదేశీయుల మాన, ప్రాణ రక్షణ విషయంలో సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేవలం అక్రమంగా ఉంటున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. వారం రోజులుగా రెస్టారెంట్ మూతపడింది.. ‘‘వారం రోజులుగా మా రెస్టారెంట్ను మూసి ఉంచాల్సి వస్తోంది. మా రెస్టారెంట్లో పని చేస్తున్నవారికి వర్క్ పర్మిట్లు ఉన్నాయి. కానీ, పర్మిట్లలో పేర్కొన్న పనుల్లో వారు లేరు. ‘నతాఖా’ అరెస్టులకు భయపడి ఎవరూ విధులకు రావడం లేదు. దాంతో వారికి స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాం. విదేశీయులు తక్కువ వేతనాలకు పనిచేస్తారు. అదే ఈ చట్టం ద్వారా స్థానికులకు ఉద్యోగాలిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో నష్టాల పాలవుతాం.’’ - అలీ హద్దాద్, జిద్దా రెస్టారెంట్ మేనేజర్ సౌదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి.. ‘‘నేను మూడేళ్లుగా రియాద్లో ఉంటున్నాను. నేను వచ్చినప్పుడు నా కఫిల్ (నాకు వీసా ఇచ్చిన వ్యక్తి) నా పాస్పోర్టును తన వద్ద ఉంచుకొని అఖామా (వర్క్ పర్మిట్)ను ఇచ్చాడు. ఆ అఖామాలో తన కంపెనీలో పని కోసం పిలిచినట్లుగా ఉంది. కానీ, ఆయన నాకు తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వకుండా, బయట పని చేసుకొమ్మన్నాడు. దాంతో ఒక ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు అఖామా ఉంది. కానీ, కొత్త చట్టం కింద నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. కఫిల్ తప్పుతో నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది సౌదీ ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ చట్టంలో మార్పులు చేయాలి.’’ - నహీం సిద్ధిఖీ, రియాద్, ఆటో మోబైల్ కంపెనీ వర్కర్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement