-
దసరాకు కొత్త కార్డులు
తెలంగాణ ప్రభుత్వం పేరిట కొత్త రేషన్కార్డులు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హుల గుర్తింపు వివరాలు అందించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త..! దసరా పండుగ తర్వాత అర్హులందరికీ కొత్తగా రేషన్కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేరుతో ఉన్న ఈ కార్డులను పునఃపంపిణీ చేయాలని భావించింది. కొత్తగా తెలంగాణ ప్రభుత్వ పేరిట వీటిని అందజేయాలని సంకల్పించింది. అలాగే అర్హులైన వారికి కొత్తకార్డులు, అనర్హుల కార్డులను తొలగించేందుకు సర్వం సిద్ధంచేసింది. ఇందుకు సంబంధించి రేషన్కార్డుల వివరాలు, ఇంకా కార్డులేని అర్హత కలిగిన వారి వివరాలను అందజేయాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాతో జాబితాను తయారుచేసేందుకు సిద్ధమవుతోంది.. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8,69,451 కుటుంబాలు ఉన్నాయి. అయితే అన్ని రకాల రేషన్కార్డులు కలిపి 10,38,124 వరకు ఉన్నాయి. అలాగే కార్డులు లేకుండా అర్హులుగా భావించిన 79వేల కుటుంబాలకు కూపన్ల ద్వారా సరుకులు పంపిణీచేస్తున్నారు. దీంతో రేషన్కార్డుల సంఖ్య 11లక్షలపైగా చేరింది. దీంతో కుటుంబాల కంటే రేషన్కార్డులు ఎక్కువగా ఉన్నాయని భావించిన సర్కారు అనర్హులను తొలగించేందుకు రంగం సిద్ధంచేసింది. అన్ని కార్డులకూ ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 10,38,124 రేషన్కార్డులకు కేవలం 7,62,607 కార్డులను మాత్రమే ఆధార్తో అనుసంధానం చేయగలిగారు. ఈ సందర్భంగా దాదాపు 57,659 కార్డులను బోగస్గా తేల్చారు. ఆధార్ అనుసంధానం చేయని వాటికి ప్రభుత్వ ఆదేశాల మేరకు సరుకులు నిలిపేశారు. కార్డుల్లో కోత..! అర్హులైన వారికి కొత్తగా రేషన్కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. గతంలో మాదిరిగా ప్రజాప్రతినిధుల ఒత్తిడి, అనుకూల తదితర పక్షపాతవైఖరి కాకుండా ప్రస్తుతం నూతన విధానాన్ని అవలంభించనుంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. సర్వే వివరాల ప్రకారం జిల్లాలో 9,85,557 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 42,14,865వరకు ఉంది. అంతేకాదు సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యుల జీవన విధానం, ఆర్థికస్థితిగతులకు సంబంధించి అంచనాలు చేసేలా పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సమాచార సేకరణకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలుపెట్టింది. జిల్లాలో తాజా సర్వే ప్రకారం కూడా కేవలం 9,85,557 కుటుంబాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న 11లక్షల కార్డులను కుదింపు జరిగే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న10,38,124 రేషన్కార్డులకు 18,500వేల మెట్రిక్టన్నుల బియ్యం కోటా పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ కార్డుల్లో కోత విధిస్తే బియ్యం కోటా తగ్గే అవకాశం ఉంది. -
దసరా నుంచి కొత్త రేషన్కార్డులు
- రుణమాఫీ చేసితీరుతాం - మంత్రి కేటీఆర్ వెల్లడి ముస్తాబాద్: ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ఇంటింటి సర్వే చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అర్హులకు దసరా నుంచి కొత్త రేషన్కార్డులు ఇస్తామని వెల్లడించారు. ముస్తాబాద్లో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సర్వేకు ముందే ప్రభుత్వానికి 6.15 లక్షల రేషన్కార్డులను సరెండర్ చేశారని తెలిపారు. హైదరాబాద్ భూములు విక్రయించైనా రుణమాఫీఅమలు చేస్తామని, తలతాకట్టు పెట్టయినా రైతులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా గోదాముల నిర్మిస్తున్నామని, ఇందుకోసం 200 గ్రామాలను ఎంపిక చేశామని వివరించారు. గోదాముల వద్ద ప్లాట్ఫామ్లూ నిర్మిస్తామని తెలిపారు. ఉపాధిహామీ పనుల్లో వెనుకబడిన కరీంనగర్ జిల్లాను నంబర్వన్గా నిలిపేలా కూలీలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేడీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, ఆర్డీవో బిక్షానాయక్, ఓఎస్డీ శ్రీనివాస్, డ్వామా పీడీ గణేశ్, జెడ్పీటీసీ శరత్రావు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్పాషా పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రోడ్డుపై పడుకున్న వారిపై యాసిడ్ దాడి
కాలిపోయిన స్థితిలో శవం లభ్యం
వేడుకగా అగ్నిగుండ మహోత్సవం
నకిలీ పత్రాల సృష్టి కేసులో యువకుడి అరెస్టు
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఒప్పందాలు
రైలులో నుంచి పడి ప్రయాణికుడు..
ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
సామాజిక సేవే లక్ష్యం
రాయితీ విత్తనాలు రెడీ
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement