breaking news
nek chand
-
ప్రధాని రాకముందే నన్ను వెళ్లగొట్టారు!
చండీగఢ్: 'రాక్ గార్డెన్ లోపల నేను నిలబడి ఉన్నాను. మరికాసేపట్లో ప్రధానమంత్రి రాక్ గార్డెన్లోకి ఫ్రెంచ్ అధ్యక్షుడిని ఆహ్వానించాల్సి ఉంది. నా దగ్గర సరైన అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి. అయినా ప్రధాని మోదీ రావడానికి పది నిమిషాల ముందే నన్ను అక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నారు. నేను అక్కడ ఉండటానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్తూ ప్రధాని భద్రతా అధికారి ఏఐజీ బల్వాన్ సింగ్ నన్ను పంపించేశారు' అని అంజుసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చండీగఢ్లోని ప్రఖ్యాత 'రాక్ గార్డెన్' సృష్టికర్త నెక్ చంద్ తనయుడు ఆయన. ఆదివారం ప్రధాని రావడానికి ముందే తనను 'రాక్ గార్డెన్' నుంచి పంపించివేయడం తీవ్ర అవమానకరమని, చండీగఢ్ అధికారులు తనకు అనుమతి ఇచ్చినా ఈ విధంగా వ్యవహరించడం.. తనను బయటకు గెంటివేయడమేనని, దీనిని తనకు తీవ్ర అవమానకరమని ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు. చండీగఢ్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన రాక్ గార్డెన్ను 1976లో నెక్చంద్ సైనీ నిర్మించారు. శిల్పి అయిన ఆయన గత ఏడాది మరణించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్విట్టర్లో స్పందించారు. రాక్ గార్డెన్లో మోదీ, హోలాండ్ ఆనందంగా విహరిస్తుంటే.. రాక్ గార్డెన్ సృష్టికర్త అయిన నెక్ చంద్ కొడుకు పట్ల దారుణంగా వ్యవహరించి బయటకు గెంటేశారని ఆయన విమర్శించారు. -
రాక్గార్డెన్ సృష్టికర్త ఇక లేరు
దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన చండీగఢ్ రాక్ గార్డెన్ సృష్టికర్త నేక్ చంద్ గుండెపోటుతో మరణించారు. 90 ఏళ్ల నేక్ చంద్ మధుమేహం, రక్తపోటుతో పాటు కేన్సర్తో కూడా బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆర్కిటెక్టు మృతికి సంతాప సూచకంగా చండీగఢ్ ప్రభుత్వం తన కార్యాలయాలన్నింటికీ ఒక రోజు సెలవు ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని రాక్గార్డెన్లో ఉంచారు. నేక్ చంద్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తారు. గత డిసెంబర్ నెలలోనే ఆయన తన 90వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ట్విట్టర్ ద్వారా నేక్ చంద్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. టర్కీలోని ఇస్తాంబుల్లో కూడా ఇక్కడి లాంటి రాక్ గార్డెన్ నమూనాను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. అంటే ఈయన స్ఫూర్తి దిగంతాలకు కూడా పాకిందన్నమాట.