breaking news
Navami celebrations
-
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
-
సీతారాముల కల్యాణంలో "యజ్ఞోపవీత ధారణ"
-
సీతారాముల కళ్యాణంలో వరపూజ
-
సీతారాముల కళ్యాణం లో మాంగల్యధారణ
-
మహా సంకల్పం
-
Prabhadevi Temple: తెలుగువారి దేవేరి.. ప్రభాదేవి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం నడిబొడ్డున వెలసిన ప్రముఖ ప్రభాదేవి మందిరానికి మూడు వందల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే తొమ్మిది రోజులపాటు ఈ ఆలయం భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలతో, నిష్టగా వచ్చి ఆలయంలో ఉన్న మూడు దేవీ విగ్రహాలను దర్శించుకుని వెళుతుంటారు. నవరాత్రి ఉత్సవాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. పక్షం రోజుల ముందే ఆలయ గుడికి, ప్రహరీ గోడలకు, గర్భగుడిలో రంగులు వేసి సిద్ధంగా ఉంచారు. దేవీమాత విగ్రహానికి తాపడం పనులు పూర్తిచేసి అందంగా ముస్తాబు చేశారు. విగ్రహాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో పూజారులు ముందుగా ప్రకటించిన ప్రకారం రోజుకొక రంగు చీరతో దేవిని అలంకరిస్తున్నారు. నిత్యం వేలల్లో వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ మౌలిక సదుపాయాలు కల్పించారు. తోపులాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దసరా రోజున ముంబైలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలందరూ ప్రభాదేవి మందిరానికి చేరుకుంటారు. అక్కడే పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు. ఆలయంలో దేవి విగ్రహానికి బంగారం (జమ్మి చెట్టు ఆకులు) సమర్పిస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ భేటీ అయ్యే బంధువులు, మిత్రులు, పరిచయస్తులందరూ ఒకరికొకరు బంగారం ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. దసరా రోజున ఆలయంలో కనిపించే వాతావరణాన్ని బట్టి నిజంగా తెలంగాణలోని స్వగ్రామంలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మందిరానికి చేరుకుని పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఎల్ఫిన్స్టన్ రోడ్.. ప్రభాదేవిగా... మూడు వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆలయంలో ప్రభావతి దేవి, కాళికాదేవి, చండికాదేవి ఇలా మూడు విగ్రహాలున్నాయి. కాలక్రమేణా ఈ ప్రాంతం ప్రభాదేవిగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని ప్రభాదేవిగా పిలుస్తున్నారు. ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎల్ఫిన్స్టన్ రోడ్ రైల్వే స్టేషన్కు ప్రభాదేవిగా అధికారికంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ను ప్రభాదేవి పేరుతోనే పిలుస్తున్నారు. అంతేగాకుండా రైల్వే ప్లాట్ఫారంపై బోర్డులు సైతం మార్చివేశారు. టికెట్లు, సీజన్ పాస్లపై, అనౌన్స్మెంట్ ఇలా అన్ని ప్రభాదేవి పేరటనే జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల కారణంగా భక్తుల దర్శనం కోసం ప్రతీరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. దసరా రోజున అర్ధరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని పూజారులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయం ఆవరణలో వివిధ భక్తి పాటలు, కీర్తనలు ఆలపించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల్లో నగరంలో ఉన్న అనేక మందిరాలలో మార్పులు జరిగాయి. కానీ ప్రభాదేవి మందిరం ఇప్పటికీ పాత సంస్కృతులను కాపాడుకుంటూ వస్తోంది. ఏటా జనవరి రెండో లేదా మూడో వారంలో మందిరం వద్ద వారం రోజులపాటు జాతర జరుగుతుంది. ఈ ఆలయాన్ని ఉత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వందలాది భక్తులు దర్శించుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రముఖ సిద్ధివినాయక మందిరం ఉంది. దీంతో సిద్ధివినాయకున్ని దర్శించుకునేందుకు వచ్చిన స్ధానిక భక్తులతోపాటు, పర్యాటకులు ప్రభాదేవి మందిరాన్ని కచ్చితంగా దర్శించుకుని వెళతారు. దీంతో ఈ ప్రాంతం నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు, సామాన్య ప్రజల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంది. కరోనా అనంతరం తొలిసారి ఉత్సవాలు... కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్వల్ల గత రెండేళ్లుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించలేకపోయారు. దీంతో లాక్డౌన్ కాలంలో ఈ ఆలయం భక్తులు లేక బోసిపోయి కనిపించింది. ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత నవరాత్రి ఉత్సవాలు జరగడం ఇదే ప్రథమం. దీంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. దసరా రోజున పెద్ద సంఖ్యలో తరలి వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దసరా రోజున నిమజ్జనాలకు వివిధ ప్రాంతాల నుంచి సముద్రతీరానికి బయలుదేరే అనేక బతుకమ్మలు ఈ ఆలయం ముందునుంచే వెళతాయి. ఇక్కడ ఆడపడుచులు కొద్దిసేపు బతుకమ్మ ఆడి ముందుకు కదులుతారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. (క్లిక్ చేయండి: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?) -
ఇదేమిటి.. రామయ్య!
రాజంపేట: రాష్ట్ర విభజన కాకముందు రెండవ భద్రాద్రిగా వెలుగొందిన ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని విభజన తర్వాత మొదటి భద్రాద్రిగా గుర్తించి అధికారిక నవమి ఉత్సవాలు చేపడతారనుకుంటే నిరాశే మిగులుతోంది. ఈ ఉత్సవాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి మహోత్సవాలు భద్రాచలంలో నిర్వహించేవారు. భద్రాచలం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పురాతన గొప్ప రామాలయం ఒంటిమిట్టలోదే. భారతదేశంలోని గొప్ప కట్టడాల్లో ఒంటిమిట్ట రామాలయం కూడా ఒకటని విదేశీ యాత్రికుడు తావర్నియర్ ప్రశంసించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరపాలని అందరూ కోరుకుంటున్నారు. మరో రామాలయూనికి అధికారిక గుర్తింపునకు ప్రయత్నాలు.. ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండరామాలయూనికి అధికారిక గుర్తింపు లభించే సమయంలో కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు తమ ప్రాంతంలోని రామాలయూనికి ఆ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు విజయనగరం జిల్లా మెలిమర్ల మండలం రామతీర్థం రామాలయంలో చేపట్టాలని కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు కృషి చేస్తున్నారని తెలియడంతో జిల్లాలోని రామభక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రభుత్వపరంగా జరిపించడానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరడానికి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ దేవస్థాన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి అధికార బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. ఆలయ విశిష్టతలోకి వెళితే.. ఒంటిమిట్ట కోదండరామాలయం దేశంలో రెండవ అయోధ్యగా, రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా గుర్తెరిగినది. ఈ రామాలయంలోని మూలవిరాట్లను త్రేతాయుగంలో ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ రామాలయంలోని సీతారామలక్ష్మణులు విడివిడిగా కనిపించినా ఒకే రాతిలో ఉండటంతో ఏక శిలానగరంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఏ రామాలయంలోనైనా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ రామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనేది కథనం. ఒంటిమిట్ట రామాలయానికి ఉన్నంత పవిత్రత, ప్రాసత్యం, శిల్పకళాసంపద మరే రామాలయంలోనూ లేదు. ఒంటిమిట్ట రామాలయంలోని మధ్య మంటపంలో 31స్తంభాలు ఉన్నాయి. చూపరులను ఆకట్టుకునే శిల్పసంపద, విశాలమైన ప్రాంగణం ఈ రామాలయంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు శ్రీమదాంద్ర భాగవతం ఇక్కడే రచయించి శ్రీరామునికే అంకితం ఇచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో పోతన భాగవత తాంబూల సంప్రదాయం బ్రిటీషు కాలం నుంచి ఉంది. దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతారామలక్ష్మణులు ఇటుగా వెళుతున్న సమయంలో సీతమ్మకు ఒంటిమిట్టలో దాహం వేయగా ఆమె దాహం తీర్చేందుకు రామలక్ష్మణులు బాణాలు సంధించగా ఏర్పడిన నీటి బుగ్గలే శ్రీరామలక్ష్మణుల తీర్థాలుగా ఇప్పటికీ ఉన్నాయి. కడప నవాబు ఈ రామాలయ ఆవరణంలో ఒకబావిని తవ్వించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితాన్ని రామాలయ అభివృద్ధి కోసం అంకితం చేసిన వావిలకొలను సుబ్బారావు ఊరూరాా భిక్షమెత్తి ఒంటిమిట్ట రామాలయానికి కొన్ని కోట్లరూపాయల విలువ చేసే ఆభరణాలు, భూములు, భవనాలు సమకూర్చారు. ఇంతటి చరిత్ర ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక బ్రహోత్సవాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.