breaking news
National Training campaign
-
జాతీయ బాక్సింగ్ శిబిరంలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత ఎలైట్ మహిళా బాక్సర్ల కోసం నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిన వారి జాబితాలో భారత మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ మొహమ్మద్ అలీ కమర్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన బాక్సర్లెవరికీ పాజిటివ్ రాలేదని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. కరోనా సోకిన వారందరూ క్వారంటైన్లో ఉన్నారని... నెగెటివ్ వచ్చిన వారికి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి తరలించామని ‘సాయ్’ వివరించింది. -
అమెరికాకు ఆడతా: ప్లంకెట్
లండన్: జాతీయ శిక్షణ శిబిరం కోసం ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడం... ఈ విషయంపై టీమ్ మేనేజ్మెంట్ తనకు కనీస సమాచారం ఇవ్వకపో వడంపట్ల ఇంగ్లండ్ వన్డే వరల్డ్కప్ జట్టు సభ్యుడు ప్లంకెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. జాబితాలో తన పేరు లేని విషయాన్ని ప్లంకెట్ ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశముంటే అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధమేనని ప్లంకెట్ పేర్కొన్నాడు. ‘నా భార్య అమెరికన్. అక్కడ అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశముంటే నేను సిద్ధమే. ఇంగ్లండ్లో చేయడానికి ఏం లేనప్పుడు అమెరికాకు ఎందుకు ఆడకూడదు?’ అని ప్లంకెట్ పేర్కొన్నాడు. -
రహదారి భద్రతపై జాతీయ శిక్షణ శిబిరం
19, 20 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు హాజరుకానున్న విదేశీ ప్రతినిధులు మర్రిపాలెం : విశాఖ నగరంలో రహదారి భద్రత జాతీయ శిక్షణ శిబిరం నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో హోటల్ నోవాటెల్ జరగబోయే ఈ శిబిరంలో విదేశీ ప్రతినిధులు పాల్గొనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రవాణా శాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిబిరం విజయవంతం కావడానికి ఆ శాఖ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. ‘రహదారి భద్రత’ అంశాలపై తీర్మానాలు? ఇటీవల పార్లమెంట్లో ‘రహదారి భద్రత’ బిల్లు ఆమోదం పొందడం తెలిసిందే. ఈ క్రమంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడంతో అందరి చూపు విశాఖపై పడింది. శిబిరంలో ‘రహదారి భద్రత’పై పలు అంశాలు తీర్మానించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అమలు చేయబోయే పాలనా సంస్కరణలు, మోటార్ వాహనాల చట్టంలో మార్పుల గురించి చర్చించనున్నారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథులుగా కేంద్ర రవాణా, హైవే, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కారీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ హాజరు కానున్నారు. ప్రపంచ బ్యాంక్ నిపుణులు, గ్లోబల్ లీడ్ రోడ్ సేఫ్టీ, గ్లోబల్ రోడ్ సేఫ్టీ ప్రతినిధులు, సౌత్ ఆసియా ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు, న్యూజిలాండ్ పోలీస్ విభాగం అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా, హైవేల ఉన్నతాధికారులు, సుప్రీంకోర్టు నియమించిన రోడ్ సేఫ్టీ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొంటారు. ఇంకా మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రవాణా, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు విచ్చేయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేపడుతున్నామని డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రహదారి భద్రత’పై దృష్టిసారించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు.