breaking news
Natal (North American Telugu Association)
-
షికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడకలు అమెరికాలోని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హమ్మర్ పార్కులో సమావేశమైన ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సుమారు 150 మంది వరకు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరైన వెంకట్రెడ్డి లింగారెడ్డితో పాటు తెలంగాణ అమెరికా తెలుగు సోసైటీకి నుంచి కందిమళ్ల సత్య, ఏ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటం ముందు దీపాలను ఆర్వి రెడ్డి దీపాలను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ, శివ దేశూ, శ్రీజన్, శేషు, ఆడి, శశాంక్, శివారెడ్డి, రామకాంత్, భూపాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజన ఏర్పాటు చేశారు. దీంతో పాటు పిల్లల కోసం సరదా కార్యక్రమాలు నిర్వహించారు. -
నాటా సభల్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
తిరుపతి : అట్లాంటాలో నిర్వహించిన నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) మొదటి, ద్వితీయ సభల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మొదటి, ద్వితీయ సభలకు నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యుకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, అభిమానం వల్లే నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను. భారత సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ.. తెలుగుదనం ఉట్టిపడేలా.. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒక్కటే అని చాటుతూ నిర్వహించిన సభలు విజయవంతంగా జరిగాయి’’ అని కొనియాడారు. ఈ సభల్లో వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.