-
కేసీఆర్కి కౌంట్డౌన్ మొదలైంది: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న అంబేద్కర్ వాదుల మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కేసీఆర్ను మించిన నియంత లేడని, అంబేద్కర్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని విమర్శించారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఎటు పోయిండు అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు కానీ దేశానికి ప్రధానమంత్రి అవుతానని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలుస్తున్నారని అన్నారు. కేసీఆర్కి కౌంట్డౌన్ మొదలైందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ అణిచివేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతను కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగoలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జనలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఎల్ రమణ, విమలక్క, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
వికసించిన కమలం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచందర్రావు ఘన విజయం సాక్షి, మహబూబ్నగర్: పట్టభద్రులు కమలానికి పట్టం కట్టారు. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్రావు విజయకేతనం ఎగిరేశారు. ఉద్యోగ సంఘాల నేత, అధికార టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ను ఓడించారు. రాంచందర్రావు వరుసగా మూడుసార్లు పోటీచేసి ఎట్టకేలకు పట్టుసాధించారు. బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం తో పాటు పలు పట్టణాల లో బాణాసంచా కాల్చి, స్వీ ట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఫలించిన వ్యూహం... పట్టభద్రుల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ వీటిపై ప క్కా ప్రణాళికతో ముం దుకు సాగింది. రామచంద్రరావు ఇదివరకే 2007, 2009 లలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం ఉండడంతో ఆయనకు కలిసి వచ్చింది. రెండుసార్లు ఓటమి సానుభూతితో అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగారు. ఎన్నికలకు ఆరునెలల ముందుగానే పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో ఎక్కడిక్కడ సమావేశాలు నిర్వహించారు. అలాగే కొత్తగా ఓటర్లను నమోదు చేయడంలో ముందుండి నడిచారు. ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరినీ కలిసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు పార్టీకి అనుబంధమైన విద్యార్థి సంఘం ఏబీవీపీ కూడా శక్తిమేర బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేసింది. అలాగే కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు లోలోన బీజేపీకి మద్దతిచ్చినట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని భావించిన కాంగ్రెస్ నేతలు... టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా అధికార టీఆర్ఎస్పై ఉన్న కోపంతో బీజేపీకి మద్దతిచ్చినట్లు వినికిడి. బీజేపీకి పట్టం కడుతున్న పాలమూరు... బీజేపీకి సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్గా పాలమూరు జిల్లా కేంద్రంగా మారుతుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీకి సంచలన విజయాలు అందించింది. దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడడంతో అనివార్యంగా ఏర్పడిన ఎన్నికల్లో పాలమూరు వాసులు బీజేపీకి పట్టం కట్టారు. ఉద్యమం బాగా తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు టీఆర్ఎస్ను కాదని, బీజేపీకి 2012లో పట్టం కట్టారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం కూడా పట్టభద్రుల ఎన్నికల్లో మూడు జిల్లాలో అత్యధికంగా పోలింగ్ జరిగినది పాలమూరులోనే. పాలమూరు అత్యధికంగా 56.08శాతం ఓటింగ్ జరిగింది. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో జరిగిన పోలింగ్లో పట్టభద్రులు కమలానికి పట్టంగట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement