-
అవధ్ ఆనందం
పుట్టినరోజునాడు ‘కింగ్’ నాగార్జునకు షాక్... ఐబీఎల్లో ముంబై మాస్టర్స్ జట్టు ఆయనకు విజయాన్ని కానుకగా ఇవ్వడంలో విఫలమైంది. హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో అవధ్ వారియర్స్దే పైచేయి అయింది. ఆటగాళ్ల సమష్టి రాణింపుతో సింధు సేన లీగ్ తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం సైనా నేతృత్వంలోని హాట్షాట్స్తో పోటీకి సిద్ధమైంది. బెంగళూరు: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో అవధ్ జట్టు 3-2 తేడాతో ముంబై మాస్టర్స్పై విజయం సాధించింది. రెండు పురుషుల సింగిల్స్ ముంబై గెలుచుకోగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ వారియర్స్ నెగ్గడంతో స్కోరు 2-2తో సమమైంది. కీలకమైన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో అవధ్దే పైచేయి అయింది. శనివారం ముంబైలో జరిగే లీగ్ ఫైనల్లో హైదరాబాద్ హాట్షాట్స్తో అవధ్ వారియర్స్ తలపడుతుంది. లీ చోంగ్ వీ శుభారంభం పురుషుల తొలి సింగిల్స్లో వరల్డ్ నంబర్వన్ లీ చోంగ్ వీ 21-15, 21-7 స్కోరుతో గురుసాయిదత్ను చిత్తు చేశాడు. చోంగ్ వీని ఈ లీగ్లో ఇబ్బంది పెట్టిన భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, శ్రీకాంత్ల తరహాలో గురుసాయిదత్ పోరాటపటిమ కనబర్చలేకపోయాడు. తొలి గేమ్లో స్కోరు 4-4తో ఉన్న దశలో చక్కటి డ్రాప్ షాట్తో ఆధిక్యంలోకి దూసుకుపోయి లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో వరుస స్మాష్లతో పాయింట్లు సాధించిన గురు 12-13తో చేరువగా వచ్చాడు. ఈ సారి చోంగ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లి తొలి గేమ్ గెల్చుకున్నాడు. రెండో గేమ్లో మాత్రం సాయిదత్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఒత్తిడిని తట్టుకోలేక అనవసర తప్పిదాలతో వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు. 3-2 నుంచి లీ వరుసగా 11 పాయింట్లు సాధించి 14-2కు చేరాడు. ఆ తర్వాత లీ గెలుపు లాంఛనమే అయింది. సింధు మరోసారి... లీగ్ దశలో టిన్ బాన్ను ఓడించి పీవీ సింధు ఈ సారి కూడా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస గేమ్లలో 21-16, 21-13తో మ్యాచ్ నెగ్గింది. ఆరంభంలో వెనుకబడినా...వరుస పాయింట్లతో సింధు 7-4కు చేరింది. చక్కటి ప్లేసింగ్స్తో సింధు ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండానే 15-11తో ఆధిక్యంలో నిలిచింది. 18-16తో ఉన్న దశలో మళ్లీ మూడు పాయింట్లు సాధించి సింధు గేమ్ నెగ్గింది. రెండో గేమ్లో బాన్ ఆట పూర్తిగా అదుపు తప్పింది. ఆమె ఆడిన షాట్లలో ఎక్కువ భాగం నెట్కు తగలడమో బయట పడటమో జరిగింది. దాంతో సింధు ఖాతాలో సునాయాసంగా పాయింట్లు చేరాయి. వరుస పాయింట్లతో 14-8తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు, అదే ఉత్సాహంతో దూసుకుపోయి మ్యాచ్ సొంతం చేసుకుంది. వారియర్స్ జోరు... పురుషుల డబుల్స్లో అవధ్ జోడి మార్కిస్ కిడో-మథియాస్ బో చెలరేగింది. ఈ జంట 21-15, 21-10తో ముంబై జంట ప్రణవ్చోప్రా-సుమీత్ రెడ్డిలపై సునాయాస విజయ సాధించింది. పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్ను నెగ్గిన ఇవనోవ్ మాస్టర్స్ ఆశలను సజీవంగా నిలిపాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఇవనోవ్ 21-20, 21-19తో అవధ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ను ఓడించాడు. దాంతో ఫలితం 2-2తో సమంగా నిలిచింది. ఈ దశలో మిక్స్డ్ డబుల్స్లో విశేషంగా రాణిస్తున్న వారియర్స్ ద్వయం మార్కిస్ కిడో-పియా బెర్నాడెట్ చక్కటి విజయంతో తమ జట్టును ఫైనల్ చేర్చింది. ఈ జోడి 21-19, 21-15 తేడాతో ముంబై జోడి ఇవనోవ్-టిన్ బాన్లను చిత్తు చేసింది. -
'గ్రీకువీరుడు' నాగార్జున బర్త్ డే!
-
'కింగ్'కు శుభాకాంక్షలు తెలపండి!
టాలీవుడ్ తోపాటు, మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29. ఆయన మరిన్ని జన్మదినోత్సవాలను జరుపుకుంటూ, అనేక విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అభిమానులతోపాటు మనం కూడా జన్మదినం రోజున నాగార్జునకు శుభాకాంక్షలు తెలియచేద్దాం! -
అక్కినేని నాగార్జున జన్మదినం!
టాలీవుడ్ రంగంలోనే కాక, దక్షిణాది, బాలీవుడ్ లో కూడా అక్కినేని నాగార్జున అంటే ఓ క్రేజ్. నాగార్జున ఓ నటుడిగా సంతృప్తి చెందకుండా, వివిధ రంగాల్లో ప్రవేశించి విజయం సాధిస్తున్నారు. సినిమా రంగంలో విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ, యువ హీరోలకు ధీటుగా పోటినిస్తూ, కెరీర్ ను జాగ్రత్త ప్లాన్ చేసుకుంటూనే వివిధ వ్యాపార రంగాల్లో ప్రవేశించి బిజీగా లైఫ్ గడుపుతున్నారు. అందుకే నాగార్జునను ఓ ప్రయోగశాల అంటారు. నటుడిగా, నిర్మాతగా ఆయన విజన్ ప్రత్యేకమైనది కాబట్టే పలు వ్యాపార రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నన్నారు. టెలివిజన్ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని, వ్యాణిజ్య ప్రకటనల్లో పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించారు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో జతకట్టి 'మహీ రేసింగ్' జట్టుకు సహ భాగస్వామిగా చేరాడు. అంతేకాక ఇటీవలే ప్రారంభమైన ఇండియన్ బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టును భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ లతో కలిసి సొంతం చేసుకున్నారు. అటు మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29. ఆయన మరిన్ని జన్మదినోత్సవాలను జరుపుకుంటూ, అనేక విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అభిమానులతోపాటు మనం కూడా జన్మదినం రోజున నాగార్జునకు శుభాకాంక్షలు అందచేద్దాం! -
జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున
తన జన్మదినం రోజున ముంబై మాస్టర్ జట్టును పోత్సాహిస్తూ గడపాలనుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, వ్యాపారవేత్త చాముండేశ్వర నాథ్ ల భాగస్వామ్యంతో నాగార్జున ఐబీఎల్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన జన్మదినం రోజున బెంగుళూరులో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో తన జట్టకు ప్రోత్సాహిస్తూ గడుపుతానని తెలిపారు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి మహీ రేసింగ్ జట్టుకు సహచర భాగస్వామిగా ఉన్నాడు. ఈ సంవత్సరం తాను కొనుగోలు చేసిన జట్లు రాణించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోంది అని నాగార్జున అన్నారు. త్వరలో ముగిసే రేసింగ్ లీగ్ లో తమ జట్టు అగ్రస్థానంలో ఉందని, బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇలాగే తన జట్లు విజయపథంలో ప్రయాణించాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు. ఆగస్టు 29 నాగార్జున జన్మదినం జరుపుకోనున్న నాగార్జున చిత్ర రంగంలోనూ, క్రీడారంగంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగార్జున నటించిన భాయ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆస్థాయిలో ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)కు క్రేజ్ లభిస్తున్న సంగతి తెలిసిందే!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement