breaking news
Mukund Varadarajan
-
తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై తాంబరం రోడ్డుకు మేజర్ ముకుంద్ వరదరాజన్ పేరు పెట్టారు. భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ సాహసానికి, త్యాగానికి నివాళిగా చెన్నైలోని వేలచ్చేరి - తాంబరం రోడ్డును 'మేజర్ ముకుంద్ వరదరాజన్''గా మారుస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక చర్యలకు నాయకత్వం వహిస్తూ మేజర్ ముకుంద్ వరదరాజన్ వీరమరణం పొందారు. ఆయన ప్రదర్శించిన అసాధారణ తెగింపుకు, శౌర్యానికి గాను అప్పట్లో ప్రభుత్వం ఆయన మరణానంతరం ఆయనకు అశోక్ చక్రను ప్రదానం చేసింది. దేశానికి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ.. ఆయన త్యాగాన్ని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా చేసేందుకు చెన్నైలోని ఈ కీలకమైన రహదారికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధిస్తూ.. తమిళనాడు సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి.పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుకున్నారు. -
ఇందు రెబెక్కా వర్గీస్గా...
ఇందు రెబెక్కా వర్గీస్గా తనను తాను పరిచయం చేసుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘అమరన్’. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ బహు బాషా చిత్రానికి రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. శుక్రవారం సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ‘అమరన్’ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ‘అమరన్’ అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. -
మేజర్ ముకుంద్ ఇంటికి భద్రత
టీనగర్, న్యూస్లైన్:కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో హతమైన మిలిటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇంటికి సైనిక భద్రత కల్పించారు. ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్ కాలనీ పార్క్వ్యూ అపార్టుమెంట్స్లో ముకుంద్ కుటుంబం నివసిస్తోంది. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వరదరాజన్ కుమారుడు ముకుంద్ వరదరాజన్(32). ఈయన ఆర్మీలో మేజర్గా పనిచేశారు. ఈయన భార్య ఇందు, కుమార్తె హర్షియ(3)తో బెంగళూరులోని మిలటరీ క్వార్టర్స్లో నివసించేవారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం కాశ్మీర్లో తీవ్రవాదుల కాల్పుల్లో ముకుంద్ వరదరాజన్ అమరుడయ్యూరు. ముకుంద్ వరదరాజన్ మృతదేహం చెన్నైలోని ఆయన ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ముకుంద్ తల్లి కేరళకు చెందిన మహిళ. ఆమె కుటుంబ స్నేహితుడైన కేరళ సీఎం ఉమెన్చాండీ ముకుంద్ తల్లిదండ్రులను, అతని భార్యను ఓదార్చారు. ప్రస్తుతం ముకుంద్ ఇంటికి భద్రతగా ఇద్దరు జవాన్లను నియమించారు. వీరు బయటి వ్యక్తులను ఎవ్వరినీ ఇంటిలోకి అనుమతించడం లేదు.


