breaking news
per month
-
వొడాఫోన్: నెలకు 9జీబీ 4జీడేటా
రిలయన్స్ జియో దెబ్బకు మేజర్ టెలికాంసంస్థలు దిగివస్తున్నాయి.తగ్గింపు ధరల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్ కూడా తన పోస్ట్పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన నెట్వర్క్ను వాడుతున్న పోస్ట్పెయిడ్ యూజర్లకు నెలకు 9 జీబీ డేటా చొప్పున 3 నెలలకు గాను 27 జీబీ 4జీ డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వొడాఫోన్ అధికారిక వెబ్సైట్ లో ‘అమేజింగ్ ఆఫర్స్ ’ పేరుతో రెండు ఆఫర్లను ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఆఫర్ పొందాలంటే ఈ నెట్వర్క్లో పోస్ట్పెయిడ్ యూజర్లు అయి ఉండాలి. 4 జీ హ్యాండ్ సెంట్ వాడుతూ ఉండాలి. నెలకు కనీసం 1 జీబీ 4జీ డేటాను ఇప్పటికే వాడుతూ ఉండాలి. దీనికిగాను వొడాఫోన్ రెడ్కు చెందిన రూ.499 లేదా, రూ.699 ప్లాన్ కస్టమర్లు(ఎక్సెప్ట్ రెడ్ఫ్యామిలీ) అయినవారు మాత్రమే ఈ ఆఫర్కు అర్హులు. ప్లాన్ రెండు ప్రకారం ఇప్పటికే రెడ్ ప్లాన్ లో ఉన్నవారికి 12 నెలలపాటు 3జీబీ అదనపు డేటాను అందించనుంది. రెడ్ అన్ లిమిటెడ్ ప్లాన్లో ఉన్నవారికే ఈ సదుపాయం. అందుకు గాను యూజర్లు వొడాఫోన్ సైట్కు వెళ్లి తమ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఆ తరువాత వచ్చే ఓటీపీని కన్ఫాం చేయాలి. దీంతో ఫ్రీ 4జీ డేటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక ప్రీపెయిడ్ యూజర్లకు కూడా వొడాఫోన్ ఓ నూతన ప్లాన్ను ప్రకటించింది. దాని ప్రకారం 4జీ ఫోన్ ఉన్నవారు రూ.352తో రీచార్జి చేసుకుంటే వారికి 28రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా లభించనుంది. పూర్తి వివరాలకు వొడాఫోన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు. -
వయసు 7సంవత్సరాలు..సంపాదన 60వేలు
-
ఇక నెలలో ఆరుసార్లేనట
న్యూఢిల్లీ: ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో భారత రైల్వే శాఖ మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ ద్వారా టికెట్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇక మీదట నెలలో ఆరుసార్లు మాత్రమే రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుకింగ్ చేసుకొనే విధంగా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఒక నెలలో ఈ-టికెటింగ్ ద్వారా పదిసార్లు టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉండేది. తాజా పరిణామంతో తరచూ రైళ్లలో ప్రయాణం చేసేవారికి ఇక కొత్త తలనొప్పులు మొదలైనట్టే. రైల్వేశాఖ కొత్త నిబంధనలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ-టికెటింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహిరిస్తోందని ఆరోపిస్తున్నారు. చాలామంది సాధారణ ప్రయాణికులకు ఈ విధానం వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో చోటుచేసుకొంటున్న అక్రమాలకు తెరదించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దళారీలను నిరోధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.