breaking news
Mohan Raju
-
మంత్రిననే అహంకారంతోనే విమర్శలు
భీమవరం : సాధారణ కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా పనిచేసిన కేఎస్ జవహర్ మంత్రి పదవి రాగానే అహంకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్రాజు హెచ్చరించారు. ఎంతోమంది టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్న జవహర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయిలేదన్నారు. మద్యం అమ్మకాలు పెంచుకోడానికి ప్రజలకు హెల్త్డ్రింక్ అంటూ ప్రచారం చేసిన జవహర్ మంత్రి పదవికి అనర్హుడని మోషేన్రాజు దుయ్యబట్టారు. కొవ్వూరు నియోజకవర్గంలో పరాన్నజీవిగా కొంతమందిపై ఆధారపడి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇసుకదోపిడీ, మద్యం మాఫియాలతో సంబంధాలు పెట్టుకుని తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జవహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఎస్సీల పరువు తీయకుండా మంత్రి సత్ప్రవర్తనతో ఉండాలని హితవు చెప్పారు. -
సీఎం నివాసం ముట్టడి భగ్నం
= దళితులపై దాడులను నిరసిస్తూ డీఎస్ఎస్ ఆందోళన = ఫ్రీడం పార్క్లో ధర్నా = దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం: మోహన్రాజు బెంగళూరు, న్యూస్లైన్ : రాష్ట్రంలో దళితులపై దాడులను కర్ణాటక దళిత సంఘర్షణ సమితి(డీఎస్ఎస్) శుక్రవారం చేపట్టిన సీఎం నివాసం ‘కృష్ణ’ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆందోళనకారులు ఫ్రీడం పార్క్ చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్ఎస్ రాష్ట్ర కన్వీనర్ ఆర్.మోహన్రాజ్ ప్రసంగిస్తూ... రాష్ట్రంలో దళితుపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ ముసుగులో ఇతర కులస్తులు నకిలీ సర్టిఫికెట్లు పొంది అసలైన దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దొడ్డదారిన చాలా మంది రాజకీయంగా పదవులు పొందారని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారిపై, మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన యూపీ ఏ సర్కార్ నేడు దళితులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములపై వారికే హక్కు పత్రాలను అందజేయాలని కోరారు. ఉత్తర కన్నడ జిల్లాలో దళితుల హత్యలు, అత్యాచారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ ఫ్రీడం పార్క్ చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. దళితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆంందోళనను విరమించారు. కార్యక్రమానికి కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందురామస్వామి, బాబు రాజేంద్ర ప్రసాద్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఎస్ పదాధికారులు డి.సిద్దరాజు, చక్రభావి భైరప్ప, మునికృష్ణ, ఆడుగోడి నాగరాజ్ పాల్గొన్నారు.