-
సిమ్ కార్డ్, నెట్ లేకుండానే వీడియోలు.. ఎలాగంటే..
మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూడవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్(డీ2ఎం) ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 మెగాహెర్డ్జ్ స్పెక్ట్రమ్ను కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రాడ్కాస్టింగ్లో వీడియో ట్రాఫిక్ను 25 నుంచి 30 శాతం డీ2ఎంకి మార్చడం వల్ల 5జీ నెట్వర్క్లు అన్లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చుని అభిప్రాయపడ్డారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్లు జరిగాయన్నారు. దేశంలో 69 శాతం కంటెంట్ను వీడియో ఫార్మాట్లోనే చూస్తున్నారని చెప్పారు. అయితే వీడియోలను అధికంగా వీక్షిస్తున్నపుడు మొబైల్ నెట్వర్క్ల వల్ల డేటాకు కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం టెక్నాలజీను టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్లను నేరుగా మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల్లో ప్రసారం చేసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! దేశంలోని దాదాపు 28 కోట్ల కుటుంబాల్లో కేవలం 19 కోట్ల టెలివిజన్ సెట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 80 కోట్ల స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ డీ2ఎం సాంకేతికత అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్ల వినియోగం ఒక బిలియన్(100 కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. ఈ టెక్నాలజీ ద్వారా డేటా ట్రాన్స్మిషన్ ఖర్చులు తగ్గుతాయని, సమర్థమైన నెట్వర్క్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ ప్లాన్ అంటే ఇదే, రూ.6వేల వరకు బెనిఫిట్స్ కూడా!
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లాన్పై ఓ లుక్కేస్తే.. రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. దేశీయ హోటల్ బుకింగ్లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్మెడ్స్లో అదనపు NMS సూపర్క్యాష్తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్! -
ఫోన్లో నెట్వర్క్ లేకున్నా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్లో ఫోన్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, ఫోనులో నెట్వర్క్ లేకపోయినప్పటికీ ఎమర్జెన్సీ కాల్ చేసే ఆప్షన్ కనిపించడాన్ని మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఎవరైనాసరే ఎటువంటి నెట్వర్క్ అవసరం లేకుండా ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఎమర్జెన్సీ కాల్లో పోలీసులకు, అంబులెన్స్ మొదలైనవాటికి ఫోను చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, నెట్వర్క్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫోనులో నెట్వర్క్ లేదంటే దాని అర్థం ఆపరేటర్ నుంచి నెట్ వర్క్ అందడం లేదని అర్థం. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ మరో పద్ధతిలో కనెక్ట్ అవుతుంది. మీ ఫోనుకు మీ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ కాకపోతే.. ఆటోమేటిక్గా అదే ఏరియాలో అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ ఏదైనా ఇతర నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇటువంటి సమయంలో సాధారణ కాల్ కనెక్ట్ అవదు. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ చేసినా ఏ నెట్ వర్క్తో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. కాగా, ఎమర్జెన్సీ కాల్స్ చేసే సమయంలో ప్రత్యేకమైన నెట్వర్క్ ఉండాలన్న నియమం ఏదీ లేదు. ఈ కారణంగానే ఎమర్జెన్సీ కాల్ ఎప్పుడైనా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాల్ ఎలా కనెక్ట్ అవుతుందంటే.. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ముందుగా ఆ ఫోను మాధ్యమం ద్వారా సమీపంలోని నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్కు మెసేజ్ చేరుకుంటుంది. అప్పుడు ఫోనుకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ కొద్ది సెకెన్ల వ్యవధిలోనే జరుగుతుంది. ఫలితంగానే మీరు వెంటనే అవతలి వ్యక్తితో మాట్లాడగలుగుతారు. ఇది కూడా చదవండి: జియో, ఎయిర్టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా -
హలో.. అవుటాఫ్ కవరేజ్.. వారికి ఇంకా మొబైల్ కవరేజ్కష్టాలు!
సాక్షి, అమరావతి: దేశంలో 38,901 మారుమూల గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజ్ లేదని కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. వాణిజ్యపరంగా ఇది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా 6,05,230 గ్రామాలకు మొబైల్ కవరేజ్ ఉందని, మిగతా 38,901 గ్రామాలకు లేదని వివరించింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో 6,592 గ్రామాలకు.. ఆ తరువాత రాజస్థాన్లో 3,316 గ్రామాలకు మొబైల్ కవరేజ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మొబైల్ కవరేజీ లేని గ్రామాల్లో 4జి మొబైల్ సేవలను దశల వారీగా సంతృప్త స్థాయిలో కల్పించడానికి రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2జీ టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4జీ టెక్నాలజీ స్థాయికి పెంచనున్నామని పేర్కొంది. అంతేకాక.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 7,287 గ్రామాలకు.. అలాగే, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని 502 గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడానికి రూ.7,152 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. -
దూసుకుపోతున్న జియో, ఎయిర్టెల్.. కొత్తగా ఎన్ని లక్షల కస్టమర్లంటే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నవంబర్లో కొత్తగా 25 లక్షల మంది మొబైల్ కస్టమర్లను సొంతం చేసుకున్నాయి. వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది వినియోగదార్లను కోల్పోయింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. జియో నూతనంగా 14.26 లక్షల మందిని చేర్చుకుంది. దీంతో సంస్థ మొబైల్ చందాదార్ల సంఖ్య నవంబర్ చివరినాటికి 42.28 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ 10.56 లక్షల మంది కొత్త కస్టమర్ల చేరికతో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 36.60 కోట్లను తాకింది. వొడాఫోన్ ఐడియా చందాదార్లు 24.37 కోట్లకు వచ్చి చేరారు. భారత్లో మొ త్తం మొబైల్ కనెక్షన్లు 114.3 కోట్లు ఉన్నాయి. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement